Praja Vedika: రేపు (08/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Cabinet: రుషికొండ భవనాలపై వీడిన సస్పెన్స్.. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సిద్ధం! Mulapeta Port: శ్రీకాకుళం జిల్లాకు మణిహారం... మూలపేట పోర్టుపై మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన! AP Water Resources: ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరే లక్ష్యం.. రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.! Neradu Barriage: ఏపీలో ఆ జిల్లాకు మహార్దశ! ఆ ప్రాజెక్టు తో మారనున్న రూపురేఖలు... ఎన్నో ఏళ్ల కల! Google Data Center: ఏపీ ఐటీ రంగంలో చారిత్రక ఘట్టం.. ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్‌కు చంద్రబాబు శంకుస్థాపన. Rythu Bharosa Funds Release: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. AP Government Schemes: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంగన్‌వాడీల్లో ఇక ఇండక్షన్ స్టవ్‌లతోనే వంట.! Jagan Plan: విట్, ఎస్ఆర్ఎం పేర్లు మార్పించిన జగన్! అసలు కారణం ఇదేనా.... Google Data Center: ప్రపంచంలోనే మొదటిసారిగా... మూడు చోట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు! ఏప్రిల్ 28న ముహూర్తం ఫిక్స్! Praja Vedika: రేపు (08/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Cabinet: రుషికొండ భవనాలపై వీడిన సస్పెన్స్.. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సిద్ధం! Mulapeta Port: శ్రీకాకుళం జిల్లాకు మణిహారం... మూలపేట పోర్టుపై మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన! AP Water Resources: ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరే లక్ష్యం.. రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.! Neradu Barriage: ఏపీలో ఆ జిల్లాకు మహార్దశ! ఆ ప్రాజెక్టు తో మారనున్న రూపురేఖలు... ఎన్నో ఏళ్ల కల! Google Data Center: ఏపీ ఐటీ రంగంలో చారిత్రక ఘట్టం.. ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్‌కు చంద్రబాబు శంకుస్థాపన. Rythu Bharosa Funds Release: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. AP Government Schemes: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంగన్‌వాడీల్లో ఇక ఇండక్షన్ స్టవ్‌లతోనే వంట.! Jagan Plan: విట్, ఎస్ఆర్ఎం పేర్లు మార్పించిన జగన్! అసలు కారణం ఇదేనా.... Google Data Center: ప్రపంచంలోనే మొదటిసారిగా... మూడు చోట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు! ఏప్రిల్ 28న ముహూర్తం ఫిక్స్!

Kaushalam: నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు..! కౌశలం పరీక్షలతో ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..!

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పలు కీలక చర్యలు చేపడుతోంది. చదువు, అర్హత, నైపుణ్యాలకు అన

Published : 2025-12-17 12:37:00
కలెక్టర్లకు కూటమి ప్రభుత్వం కీలక ఆదేశాలు! రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున.. ప్రజలంతా ప్రభుత్వం అంటే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పలు కీలక చర్యలు చేపడుతోంది. చదువు, అర్హత, నైపుణ్యాలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి, స్థానికంగానే లేదా ఇంటి నుంచే పని చేసే అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే వర్క్‌ ఫ్రం హోమ్ ఉద్యోగాల కోసం ‘కౌశలం’ అనే కార్యక్రమాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా సర్వే నిర్వహించి నిరుద్యోగుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. బీటెక్‌, డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఐటీఐ వంటి వివిధ విద్యార్హతలు కలిగిన యువత ఈ సర్వేలో పాల్గొన్నారు.

తిరుమల అప్‌డేట్.. సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ – శ్రీవారి హుండీకి భారీ ఆదాయం! 10 గంటల సమయం..

కౌశలం సర్వేలో పాల్గొన్న అభ్యర్థుల విద్యార్హత సర్టిఫికెట్లను సైతం సేకరించి, వాటిని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ ప్రక్రియ పూర్తైన అనంతరం అర్హులైన అభ్యర్థులకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రెండు విడతల్లో కౌశల పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రస్తుతం మూడో విడత పరీక్షలు ఈ నెల 15 నుంచి 19 తేదీల వరకు జరుగుతున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన వివరాలను అభ్యర్థులకు మెసేజ్‌ల రూపంలో పంపిస్తున్నారు. సమాచారం అందుకున్న అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో పరీక్షలకు హాజరవుతున్నారు.

IndiGo: పైలట్ శిక్షణను వేగవంతం చేయనున్న ఇండిగో.. మధ్యలో వెళ్లిపోతే రూ20–30 లక్షల జరిమానా!

అయితే, కొన్ని కారణాల వల్ల కొందరు అభ్యర్థులు పరీక్షలకు హాజరుకాలేకపోయారు. ముఖ్యంగా స్థానికంగా లేని వారు, అనివార్య కారణాలతో రాలేని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. వారికి ప్రత్యేకంగా పంపిన లింక్ ఆధారంగా పరీక్ష తేదీని రీషెడ్యూల్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ కౌశల పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇంటి నుంచే పని చేసే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలను కేటాయించనున్నారు. సర్వేలో వివరాలు అందజేసిన వారికి మాత్రమే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. పరీక్ష తేదీ, సమయం తదితర వివరాలను అభ్యర్థులకు ముందుగానే మెసేజ్ ద్వారా తెలియజేస్తున్నారు.

విలక్షణ నటి ఐశ్వర్యా రాజేశ్ క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీ ప్రియులకు వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రెడీ! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

కౌశలం ఆన్‌లైన్ పరీక్షలు ప్రతిరోజూ పరిమిత సంఖ్యలో అభ్యర్థులకు నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు పరీక్షలు జరుగుతున్నాయి. మొత్తం పరీక్ష వ్యవధి 60 నిమిషాలు కాగా, ఇందులో 45 నిమిషాలు స్కిల్ అసెస్‌మెంట్‌కు, 15 నిమిషాలు కమ్యూనికేషన్ స్కిల్ అసెస్‌మెంట్‌కు కేటాయించారు. పరీక్ష సమయంలో అభ్యర్థి ఉన్న ప్రదేశాన్ని నిర్ధారించేందుకు లైవ్ లొకేషన్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. పరీక్ష జరుగుతున్న సమయంలో కెమెరాలో అభ్యర్థి తప్ప మరెవరైనా కనిపిస్తే అనర్హత విధిస్తారు. పరీక్ష అనంతరం రెండు కేటగిరీల్లో మూల్యాంకనం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో సర్వర్ సమస్యలు ఎదురైనప్పటికీ, మొత్తం మీద కౌశలం వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

RTC ప్రయాణికులకు గుడ్ న్యూస్…! ఇక మొబైల్ లోనే అడ్వాన్స్ రిజర్వేషన్..!
Road Expansion: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.8.50 కోట్లతో రోడ్ల విస్తరణ... ఇక అక్కడికి త్వరగా చేరుకోవచ్చు!
Messis: వాంఖడేలో వండర్‌ మోమెంట్.. బాలిక టాలెంట్‌కు మెస్సీ టీమ్ ఫిదా!
Indian Woman Arrested: అమెరికాలో గ్రీన్ కార్డు ప్రక్రియకు వెళ్లిన భారత సంతతి మహిళ అరెస్ట్!
కొత్త ఫోన్ కొనాలనుకునే వాళ్లకు ఇదే బెస్ట్ ఛాయిస్! 7000mAh బ్యాటరీతో,144Hz డిస్ ప్లే తో Realme Narzo 90x 5G లాంచ్!
US Immigration Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.... 30 దేశాలపై వీసా, ఇమ్మిగ్రేషన్ రద్దు!

Spotlight

Read More →