LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే!

AP Census 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 16 నుండి జనాభా గణన ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి దశలో గృహ గణన, రెండో దశలో కుల గణనతో కూడిన జన గణన జరుగుతుంది. ఈసారి అంతా డిజిటల్ యాప్ ద్వారానే సమాచార సేకరణ ఉంటుంది.

AndhraPravasi News Desk 2 min read
AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే!

AP Census 2026: దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జనగణన (సెన్సస్) ప్రక్రియకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ కీలక వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 16వ తేదీ నుంచి గృహ గణన ప్రక్రియ ప్రారంభం కానుంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈసారి గణనలో అనేక మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం.

మొదటి దశలో భాగంగా చేపట్టే ఈ గృహ గణనలో మొత్తం 33 రకాల అంశాలపై ప్రజల నుంచి వివరాలు సేకరిస్తారు. కుటుంబ సభ్యుల వివరాలతో పాటు నివాస గృహాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు నమోదు చేసుకుంటారు. మొదటి దశ విజయవంతంగా ముగిసిన తర్వాత రెండో దశలో అసలైన జన గణన ప్రక్రియ మొదలవుతుంది. ఈ రెండో దశలోనే అత్యంత కీలకమైన కుల గణనను కూడా కలిపి నిర్వహించబోతుండటం గమనార్హం. దీనివల్ల జనాభా లెక్కలతో పాటు సామాజిక వివరాలు కూడా స్పష్టంగా అందుబాటులోకి వస్తాయి.

ఈసారి జనాభా గణనను పాత పద్ధతిలో కాకుండా పూర్తిగా డిజిటల్ రూపంలో నిర్వహించనున్నారు ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్‌ను కూడా రూపొందించింది. గణన కోసం వచ్చే సిబ్బంది తమ సొంత మొబైల్ ఫోన్లను వాడుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ సరిగ్గా లేని ప్రాంతాల్లో కూడా ఇబ్బంది కలగకుండా ఈ యాప్‌ను ఆఫ్‌లైన్ విధానంలో కూడా పనిచేసేలా తీర్చిదిద్దారు. దేశవ్యాప్తంగా ఉన్న సిబ్బందికి ఈ డిజిటల్ ప్రక్రియపై ప్రస్తుతం శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

కేవలం సిబ్బంది మాత్రమే కాకుండా, పౌరులు తమంతట తామే వివరాలు నమోదు చేసుకునేందుకు స్వయం నమోదు  సౌకర్యాన్ని కల్పించారు. దీనికోసం ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రజలు తమ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి, ఒక ఐడీని పొంది తమ కుటుంబ వివరాలను సులభంగా నమోదు చేసుకోవచ్చు. ప్రజల భాషా సమస్యలు రాకుండా ఈ యాప్  ప్రశ్నావళిని తెలుగుతో పాటు దేశంలోని ప్రధాన 16 నుంచి 19 భాషల్లో అందుబాటులో ఉంచారు.

 జనాభా వివరాల భద్రతపై రిజిస్ట్రార్ జనరల్ స్పష్టమైన హామీ ఇచ్చారు. గణన ద్వారా సేకరించే డేటా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పొక్కకుండా, డేటా లీక్ అవ్వకుండా అత్యున్నత స్థాయి భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతం చేసేందుకు ప్రజలందరూ సహకరించాలని  కోరారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…