తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయ ఆవరణలో దస్త్రాల దహనం కేసు దర్యాప్తు ఇంతవరకు కొలిక్కిరాలేదు. ఈ ఘటన జరిగి దాదాపు మూడు నెలలైనా బాధ్యులెవరో తేల్చలేదు. ఈ ఏడాది ఆగస్టు 17న కీలకమైన దస్త్రాలు కాలి బూడిదై కనిపించాయి. ఆ మరుసటి రోజే మంత్రి దుర్గేశ్, రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి పరిశీలించి అధికారుల ధోరణి పై ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు అదేరోజు కేసు నమోదుచేశారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులుగా సూపరింటెండెంట్ కుమారి, సీనియర్ అసిస్టెంట్లు కళాజ్యోతి, నూకరాజు, కారం బేబి, పొరుగుసేవల ఉద్యోగి కె. రాజశేఖర్లను పేర్కొనగా.. వీరిలో సూపరింటెండెంట్ మినహా మిగిలిన అందరూ సస్పెన్షన్కు గురయ్యారు. అప్పటి నుంచి దర్యాప్తు కొనసాగుతూనే ఉంది.
ఇంకా చదవండి: వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?
ఆదినుంచీ అనుమానాలే
దస్త్రాల దహనం ఘటనపై ఆదినుంచీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పోలవరం నిర్వాసితులకు పరిహారం పంపిణీలో రూ.19 కోట్ల అవినీతి జరిగింది. ఈ నేపథ్యంలో పలువురు అధికారులు జైలుకు వెళ్లారు. ఈ అక్రమాల వెనుక వైకాపా నాయకులు, కొందరు దళారుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం కె.వీరవరం దరి ఊరకొండ పరిహారం విషయంలోనూ రూ.6.17కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. దాని నుంచి బయట పడేందుకే ఈ దస్త్రాలు దహనం చేశారని అక్కడి నిర్వాసితులు అల్లూరి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదుచేశారు. ఆగస్టు 20న మంత్రి లోకేశ్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లడంతో ఆయన విచారణకు ఆదేశించారు. దీంతో దస్త్రాల దహనం వెనుక కుట్ర కోణంపై అనుమానాలు బలపడ్డాయి. ఘటనకు సంబంధించి అధికారుల వద్ద ప్రస్తావిస్తే ప్రాథమిక విచారణ పూర్తయిందని, నివేదిక ఉన్నతాధికారులకు పంపించామని విచారణాధికారి సరళావందనం పేర్కొన్నారు. ధవళేశ్వరం పోలీస్స్టేషన్లో నమోదైన ఈ కేసు విషయంలో దర్యాప్తు కొనసాగుతోందని, రెవెన్యూ శాఖ నుంచి కొంత సమాచారం అవసరమని లేఖ రాసినట్లు ఎస్పీ నరసింహకిశోర్ స్పష్టం చేశారు. ఆ సమాచారం అందిన వెంటనే విచారణ పూర్తి చేస్తామన్నారు. పోలీసు దర్యాప్తు కొనసాగుతోందని, అది పూర్తయిన వెంటన బాధ్యులందరిపైనా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు.
ఇంకా చదవండి: 6 వ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు? ఎవరెవరికి అంటే?
ఉన్నతాధికారులకు తెలియజేయకుండానే..
సాధారణంగా కార్యాలయంలోని దస్త్రాలు దహనం చేయాల్సి వస్తే నిబంధనల ప్రకారం ఉన్నతాధికారికి ఆ వివరాలు తెలిపి అనుమతి తీసుకోవాలి. మదనపల్లె తరహా ఘటనలు జరిగిన నేపథ్యంలో జిల్లా అధికారులు ఈ విషయంపై అందరికీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా లెక్కచేయకుండా ఇక్కడి సిబ్బంది ఎందుకు దస్త్రాలు దహనం చేశారన్నది అంతు చిక్కని ప్రశ్న. కాలిపోయిన వాటిలో కీలక పత్రాలు లేవని చెప్పినా అది ఎంతవరకు నిజమన్న సందేహాలు నివృత్తి చేయాల్సి ఉంది. బాధ్యులపై చర్యల్లో తొలుత మీనమేషాలు లెక్కించడం.. కొందరినే బాధ్యులను చేయడం... విచారణ వేగవంతంగా సాగకపోవడంతో నిర్వాసితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!
భారీ శుభవార్త.. ఏపీలో కొత్త పెన్షన్లు జారీ.. దరఖాస్తు తేదీ ఇదే! అస్సలు మిస్ అవకండి!
ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం! ఏమి జరిగింది అంటే!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?
నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!
ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?
నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్, రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!
వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!
ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!
మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: