LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

AP Govt: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్.. ఇలా.!

AP Govt: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో హిందీ సబ్జెక్టుకు రెండు మార్కులు, ఆంగ్ల సబ్జెక్టుకు నాలుగు మార్కులు కలపాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. హిందీ పేపర్లో ప్రశ్నలు 3, 6 బిట్లలో కింద ఇచ్చిన ఐచ్చికాల్లో అక్షర దోషాలు ఉన్నందున ఒక్కో మార్కు చొప్పున రెండు మార్కులు ఇవ్వాలని…

AndhraPravasi News Desk 2 min read
AP Govt: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్.. ఇలా.!
  • ప్రశ్నపత్రాల్లో తప్పులు.. విద్యార్థులకు మార్కుల పంట: ఆంగ్లంలో 4, హిందీలో 2 మార్కులు యాడ్..
     
  • Politics: ఏప్రిల్ నెలలోనే పది, ఇంటర్ ఫలితాలు: పది రోజుల వ్యవధిలో రిజల్ట్స్ విడుదలకు కసరత్తు..

AP Govt: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో హిందీ సబ్జెక్టుకు రెండు మార్కులు, ఆంగ్ల సబ్జెక్టుకు నాలుగు మార్కులు కలపాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. హిందీ పేపర్లో ప్రశ్నలు 3, 6 బిట్లలో కింద ఇచ్చిన ఐచ్చికాల్లో అక్షర దోషాలు ఉన్నందున ఒక్కో మార్కు చొప్పున రెండు మార్కులు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులురెడ్డి తెలిపారు. విద్యార్థులు ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసి ఉండాలని, సమాధానం తప్పైనా మార్కులు ఇస్తామని చెప్పారు. సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఆంగ్ల భాష సబ్జెక్టు ప్రశ్నపత్రంలో 28వ ప్రశ్న పాఠ్యపుస్తకం నుంచి కాకుండా వర్క్ బుక్ నుంచి ఇచ్చారు. అండరైన్ చేసిన నాలుగు పదాలకు వ్యతిరేక పదాలు రాయాలంటూ నాలుగు మార్కుల ప్రశ్న ఇచ్చారు. బ్లూప్రింట్కు వ్యతిరేకంగా ఇచ్చారంటూ ఫిర్యాదులు రావడంతో సబ్జెక్టు నిపుణుల కమిటీ పరిశీలన అనంతరం ఈ ప్రశ్నకు ఎలాంటి జవాబు రాసినా నాలుగు మార్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు సబ్జెక్టులకు ఆరు మార్కులు కలపాలనే సమాచారాన్ని జిల్లా విద్యాధికారులకు పంపించారు. ఈ నెల 6 నుంచి పదో తరగతి ప్రశ్నపత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుంది.

ఈ నెలలోనే పది, ఇంటర్ ఫలితాలు..
ఈ ఏడాది ఇంటర్మీడియట్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ నెలలోనే విడుదల చేయనున్నారు. పది రోజుల తేడాతో ఇవి విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇంటర్మీడియట్ పరీక్ష పత్రాల మూల్యాంకనం 9న ముగుస్తుంది. తర్వాత ఫలితాల విడుదల ప్రక్రియకు ఐదు నుంచి ఆరు రోజులు పడుతుంది. దీంతో ఫలితాలను ఈ నెల మూడో వారంలో (15వ తేదీ తర్వాత) విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి కసరత్తు చేస్తోంది.
పదో తరగతి ఫలితాలను ఈ నెల చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. మూల్యాంకనం 6 నుంచి 15 వరకు సాగుతుంది. ఫలితాలను ప్రాసెస్ చేయడానికి 8 నుంచి 10 రోజులు పడుతుంది. ఇది పూర్తి కాగానే (25వ తేదీ తర్వాత) ఫలితాలు ఇవ్వాలని ప్రభుత్వ పరీక్షల విభాగం భావిస్తోంది.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…