Guntur trains: గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్ల సౌకర్యం.. ప్రయాణానికి పెద్ద ఊరట!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి చెందిన క్రిప్టో సంస్థ, పాకిస్థాన్ సైనిక నిధులతో సంబంధం ఉన్న సంస్థ మధ్య రహస్య ఒప్పందం అంతర్జాతీయ దుమారం రేపింది. ‘డిస్ఇన్ఫో ల్యాబ్’ విడుదల చేసిన నివేదికలో ఈ ఒప్పందం మనీలాండరింగ్, ఉగ్రవాద సంస్థలకు నిధుల బదిలీ కోసం ఉపయోగపడే అవకాశం ఉందని ఆరోపించింది.

Central Government: మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్.. జీఎస్టీ రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం! చాలా వస్తువులు చవకగా..

గత కొన్ని నెలలుగా అమెరికా–పాకిస్థాన్ సంబంధాలు అనూహ్యంగా మెరుగుపడటంలో ఈ క్రిప్టో ఒప్పందం కీలక పాత్ర పోషించిందని నివేదిక పేర్కొంది.

RS- 100 Coin: మీ జేబులో త్వరలో రూ.100 నాణెం! విడుదల తేదీ ఫిక్స్! దీని ప్రత్యేకతలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ఒకే వ్యక్తి, రెండు కీలక పదవులు
బిలాల్ బిన్ సాఖిబ్ అనే బ్రిటిష్-పాకిస్థానీ వ్యాపారవేత్త, ఒకే సమయంలో రెండు పదవులు నిర్వర్తిస్తున్నారు. ఆయన పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్ (PCC) సీఈఓ, అలాగే ట్రంప్ కుటుంబానికి చెందిన ‘వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్’ (WLFF) క్రిప్టో సంస్థకు సలహాదారుగా ఉన్నారు. ఈ WLFFలో ట్రంప్ కుమారులు ఎరిక్, డొనాల్డ్ జూనియర్, జారెడ్ కుష్నర్‌లకు కలిపి 40% వాటా ఉంది.

National Highway: గుడ్ న్యూస్.. ఏపీలో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో ఆరు లైన్లుగా! 12 గంటలు కాదు, ఇక 8 గంటల్లోనే.!

ఏప్రిల్ 26, 2025న పాకిస్థాన్–WLFF ఒప్పందం కుదిరింది. దీని కొద్ది రోజుల ముందే బిలాల్‌ను WLFF సలహాదారుగా నియమించారు, తర్వాత PCC సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. నివేదిక ప్రకారం, ఆయన పాకిస్థాన్ ప్రయోజనాలు మరియు ట్రంప్ కుటుంబ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

New liquor Stores: వారికి గుడ్‌న్యూస్‌.. మద్యం దుకాణాల దరఖాస్తు ఆహ్వానం.. ఈ సారి ఫీజు ఎంతో తెలుసా.?

బినాన్స్ వ్యవస్థాపకుడు పాత్ర
ఈ వ్యవహారంలో మరో వివాదాస్పద వ్యక్తి బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్‌పెంగ్ జావో. అమెరికాలో మనీలాండరింగ్, ఉగ్రవాద సంస్థలకు నిధుల బదిలీ కేసులో నాలుగు నెలల జైలు శిక్షకు గురయాడు. ఇలాంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తిని పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్‌కు వ్యూహాత్మక సలహాదారుగా నియమించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

AP Ration Card: ఏపీలో వారికి అలర్ట్.. కేంద్ర సంచలన నిర్ణయం! ఈ అర్హతలు లేకుంటే రేషన్ బియ్యం రద్దు..

పాక్ సైన్యం పాత్రపై అనుమానాలు
బిలాల్‌కు సంబంధించిన కొన్ని కంపెనీలు వాస్తవ వెబ్‌సైట్లూ లేవు, ఆయన సోదరి మినాహిల్‌కు చెందిన కంపెనీ పాకిస్థాన్ సైనికులకు చెందిన ‘అల్ ముస్తఫా ట్రస్ట్’తో భాగస్వామ్యం కొనసాగిస్తోంది. ఈ ట్రస్ట్ స్లష్ ఫండ్గా పనిచేస్తోంది. ఈ ఒప్పందం తర్వాతే పాక్ ఆర్మీ చీఫ్ అమెరికా పర్యటనలు, కొత్త ఒప్పందాలు, చివరికి ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Cabinet beti: ఏపీ కేబినెట్ సమావేశం! రాజధాని అభివృద్ధి, కొత్త జిల్లాల ఏర్పాటుకు..!
Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు 80% బోనస్.. సోషల్ మీడియాలో చర్చ!
Teachers transfer: టీచర్ల బదిలీలకు నేటి నుంచి దరఖాస్తులు.. AP విద్యాశాఖ ప్రకటన!
Free Mobile: ఏపీలో వారందరికీ ఉచితంగా మొబైల్! వెంటనే దరఖాస్తు చేసుకోండి! 26 వరకే ఛాన్స్!