ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్రం కలిసి అమరావతికి తెలంగాణకు మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నాయి. విజయవాడ-ఖమ్మం మధ్య రాకపోకలు సులభతరం చేయడానికి భూసేకరణ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 30 కిలోమీటర్ల మేర రహదారి కోసం భూమిని సేకరిస్తున్నారు. ఈ హైవే పూర్తయితే హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు ప్రయాణం మరింత సులభం అవుతుంది. ఈ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకుంటుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం సహకారంతో రాష్ట్రంలో నేషనల్ హైవేలు, స్టేట్ హైవేల పనుల్ని వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా అమరావతికి కనెక్ట్ అయ్యే రోడ్లపై ఫోకస్ పెట్టింది. తాజాగా అమరావతిని తెలంగాణకు కనెక్ట్ చేసే గ్రీన్ఫీల్డ్ హైవే పనుల్లో ప్రభుత్వం స్పీడ్ పెంచింది. విజయవాడ-ఖమ్మం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే కోసం భూసేకరణను పూర్తిచేసే పనిలో ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో 30 కిలోమీటర్ల మేర ఈ హైవే నిర్మాణం కోసం 329.30 ఎకరాల భూమిని సేకరించాలని భావిస్తున్నారు. ఇప్పటికే 243.67 ఎకరాల భూమిని సేకరించారు. ఇంకా 85.63 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది.. ఈ భూసేకరణ పూర్తయితే, విజయవాడ-ఖమ్మం మధ్య రాకపోకలు మరింత సులువుగా సాగుతాయి అంటున్నారు.
విజయవాడ-ఖమ్మం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే కోసం అధికారులు మిగిలిన భూమిని సేకరించే పనిలో ఉన్నారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు ఎక్కువగా ఉండటంతో వాటిని ముందుగా పూర్తి చేస్తారు.. ఆ తర్వాత ప్రైవేటు భూములపై దృష్టి పెడతారు. ఖమ్మం-విజయవాడ మధ్య గ్రీన్ఫీల్డ్ హైవే పనులను మూడు ప్యాకేజీలుగా చేస్తున్నారు. ఇప్పటికే రెండు పనులు మొదలయ్యాయి. ఖమ్మం నుంచి ఎన్టీఆర్ జిల్లా మీదుగా మూడో ప్యాకేజీ పని ప్రారంభం కావాల్సి ఉంది. ఈ మేరకు మిగిలిన భూసేకరణపై ఫోకస్ పెట్టారు. ఖమ్మం జిల్లాలోని రెమిడిచర్ల నుంచి మొదలయ్యే ప్యాకేజ్ 03 గ్రీన్ఫీల్డ్ హైవే పనులు గంపలగూడెం మండలంలోని తునికిపాడు దగ్గర ఎన్టీఆర్ జిల్లాలోకి వస్తాయి. ప్రస్తుతం ఇక్కడే భూసేకరణ జరుగుతోంది.
ఇది కూడా చదవండి: జగన్ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!
మొత్తం 30 కిలోమీటర్ల రహదారి కోసం 329.30 ఎకరాల భూమి అవసరమని అంచనా వేశారు. ఇందులో 273.73 ఎకరాలు ప్రైవేటు భూములు ఉండగా.. వీటిలో ఇప్పటికే 243.67 ఎకరాలను సేకరించగా.. మరో 30.6 ఎకరాలు మాత్రమే సేకరించాల్సి ఉంది. ఈ భూములతో పాటుగా ప్రభుత్వ భూములు 32.74 ఎకరాలు, అసైన్డ్ ల్యాండ్స్ 22.83 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. ఇలా మొత్తం 85.63 ఎకరాల సేకరణ పూర్తయితే గ్రీన్ఫీల్డ్ హైవే పనులకు మార్గం సుగమం అవుతుంది.
ఈ హైవేకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం, జి.కొండూరు, విజయవాడ గ్రామీణ మండలాల్లో కలిపి 9,86,125 చదరపు మీటర్ల భూమిని సేకరిస్తున్నారు. గంపలగూడెంలోని తునికిపాడులో 36,704.98 చదరపు మీటర్ల భూమిని సేకరిస్తున్నారు. ఈ హైవే జి.కొండూరు పరిధిలోని గ్రామాల మీదుగా విజయవాడ రూరల్ మండలంలోకి నేషనల్ హైవే వస్తుంది. దీంతో ఈ గ్రామాలన్నింటిలోనూ భూసేకరణ జరుగుతోంది. విజయవాడ రూరల్ మండలంలోని రాయనపాడు, పైడూరుపాడు మీదుగా విజయవాడ శివారులోని జక్కంపూడి వద్ద వెస్ట్ బైపాస్కు ఈ రోడ్డు కలుస్తుంది. ఈ మూడు ప్రాంతాల్లోనూ భూసేకరణ చేస్తున్నారు.
విజయవాడ-నాగపూర్ ఎకనమిక్ కారిడార్లో భాగంగా ఖమ్మం నుంచి గ్రీన్ఫీల్డ్ హైవే పనులు పూర్తి చేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం-విజయవాడ మధ్య ప్యాకేజీ 1లో వి.వెంకటాయపాలెం నుంచి బ్రాహ్మణపల్లె వరకు 25 కిలోమీటర్లు.. ప్యాకేజీ 2లో బ్రాహ్మణచర్ల నుంచి రెమిడిచర్ల వరకు 28 కిలోమీటర్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించాక రెమిడిచర్ల నుంచి జక్కంపూడి వరకు చేపట్టాల్సిన ప్యాకేజీ 3 పనులే ఆలస్యం అయ్యాయి. మిగిలిన భూసేకరణను త్వరగా పూర్తిచేసి పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు అధికారులు. విజయవాడ దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేను 165 కిలోమీటర్ల మేర రూ.4,609 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఐదు ప్యాకేజీలు.. 117 అండర్పాస్లు, 33 కల్వర్టులు, తొమ్మిది భారీ వంతెనలు నిర్మిస్తున్నారు. విజయవాడ నుంచి ఖమ్మం మీదుగా రాజమహేంద్రవరం, విశాఖపట్నం వెళ్లేందుకు ఈ గ్రీన్ఫీల్డ్ హైవే మరింత సులభతరం చేస్తుంది అంటున్నారు. ఈ హైవే పూర్తిచేస్తే 8 నుంచి 9 గంటల్లో హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లొచ్చంటున్నారు.
ఇది కూడా చదవండి: ఆ ఉద్యోగులకు శుభవార్త ! ప్రభుత్వం వాటికి గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో ఎంట్రీ ఇచ్చిన కరోనా.. తొలి కేసు నమోదు! ఎక్కడంటే!
అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!
దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు..! ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్!
తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!
ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!
హైదరాబాద్లో మయన్మార్ వాసుల కలకలం..! నకిలీ పత్రాలతో ఆధార్, పాన్!
ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!
ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!
టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!
అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!
పాఠశాలల్లో రోజూ ఒక గంట యోగా తప్పనిసరి! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!
విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! 160 మంది ప్రయాణికులతో..
అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!
ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: