US ఇమ్మిగ్రేషన్ షాక్.. ఆ విద్యార్థులకు పెరిగిన ఆందోళన! అసాధారణ ప్రతిభ ఉందా? అయితేనే 0-1 వీసా

ఆంధ్రప్రదేశ్‌ నుంచి దేశీయ, అంతర్జాతీయ గగన సర్వీసులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇటీవలే అనేక నగరాలకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. తాజా సమాచారం ప్రకారం విజయవాడ నుంచి సింగపూర్‌కు ఇండిగో విమాన సంస్థ నూతన అంతర్జాతీయ సర్వీసును ప్రారంభించనుంది. నవంబర్‌ 15న మొదలయ్యే ఈ సర్వీసు ద్వారా ఏపీ ప్రజలు కేవలం నాలుగు గంటల్లోనే సింగపూర్ చేరుకునే అవకాశం ఉంది. ఈ సర్వీసుతో రాష్ట్ర ప్రజలకు విదేశీ ప్రయాణం మరింత సులభతరం అవుతుందని అధికారులు వెల్లడించారు.

పాక్‌లో కూరగాయల ధరల మంట.. కిలో టమాటా, అల్లం, ఉల్లిపాయలు - సామాన్యుడికి చుక్కలు!

ఇండిగో సంస్థ నిర్ణయించిన ప్రకారం ఈ విమాన టికెట్‌ ధర రూ.8 వేలుగా నిర్ణయించారు. ఈ విమానం ఉదయం సింగపూర్‌ నుంచి బయలుదేరి భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 7.45 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి తిరిగి ఉదయం 10.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు సింగపూర్‌లోని ప్రసిద్ధ చాంగి విమానాశ్రయానికి చేరుకుంటుంది. కేవలం నాలుగు గంటల్లోనే ప్రయాణం పూర్తవ్వడం ప్రయాణికులకు సమయపరంగా ఎంతో సౌకర్యవంతంగా మారనుంది. ఇప్పటికే ఈ సర్వీసుకు సంబంధించిన టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

Boat lost: వాతావరణ మార్పుతో దారి తప్పిన పడవ.. బంగ్లా నేవీ ఆపరేషన్‌లో పట్టుబాటు!

ఈ విమాన సర్వీసులు వారానికి మూడు రోజులు—మంగళవారం, గురువారం, శనివారం నడుస్తాయి. ప్రారంభ దశలో బోయింగ్‌ విమానాల్లో 180 నుంచి 230 సీట్ల సామర్థ్యంతో ప్రయాణికులకు సేవలు అందించనున్నారు. ప్రయాణికుల స్పందన, రద్దీ ఆధారంగా రోజువారీ సర్వీసులు ప్రారంభించే ఆలోచనలో ఇండిగో ఉంది. గతంలో 2018 డిసెంబర్‌ నుంచి 2019 జూన్‌ మధ్య నడిచినప్పుడు ఈ సర్వీసులకు అద్భుతమైన స్పందన లభించింది. అప్పుడు సింగపూర్‌ నుంచి విజయవాడకు వచ్చే విమానాల్లో 90 శాతం, విజయవాడ నుంచి సింగపూర్‌ వెళ్లే విమానాల్లో 80 శాతం సీట్లు నిండిపోయాయి.

Bhagavad Gita: అహం బ్రహ్మాస్మి.. మనిషి నుంచి పరమాత్మ వైపు ఆత్మయాత్ర.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 40!

ఆ అనుభవంతోనే ఇప్పుడు ఇండిగో మరోసారి ఈ సర్వీసులను పునఃప్రారంభిస్తోంది. రాష్ట్ర రాజధాని ప్రాంతమైన విజయవాడ నుంచి నేరుగా సింగపూర్‌కు కనెక్టివిటీ అందించడం ద్వారా వ్యాపార, పర్యాటక, విద్యా ప్రయాణాలు మరింత వేగవంతం కానున్నాయి. ప్రత్యేకించి విదేశాల్లో చదువుకునే విద్యార్థులు, వ్యాపార ప్రయోజనాల కోసం తరచుగా సింగపూర్‌ వెళ్లే ప్రయాణికులకు ఈ సర్వీసు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఏపీ నుంచి విదేశీ గగన సర్వీసుల విస్తరణ రాష్ట్ర అభివృద్ధికి, ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు దోహదపడనుంది.

శబరి గిరుల్లో చారిత్రక ఘట్టం.. ఇరుముడితో 18 పడిమెట్లెక్కిన తొలి మహిళా రాష్ట్రపతి.! ఆమె వయసు 67..
Aqua Boost: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్..! ఆస్ట్రేలియా నిషేధం ఎత్తివేతతో ఏపీ రైతులకు భారీ లాభాలు..!
దుబాయ్‌లో సందడి వాతావరణం - సీఎంకు ఘన స్వాగతం! గల్ఫ్ కుటుంబాలకు అండగా నిలిచే బీమా పథకం!
Heavy rains: అతిభారీ వర్షాలు.. ప్రయాణాలు చేయవద్దని బయటికి రావొద్దుని.. హోం మంత్రి హెచ్చరిక!
సీఎం చంద్రబాబు యూఏఈ పర్యటనలో బిగ్ అచీవ్‌మెంట్! అమరావతికి రూ.100 కోట్లు విరాళం!
Microsoft board: ప్రపంచ అగ్రస్ధాయి సీఈవోల్లో సత్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్ బోర్డు జీతం పెంచింది!