ఆంధ్రప్రదేశ్లో మరో రెండు కొత్త జిల్లాల ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆ జిల్లాల అంశంపై క్లారిటీ వచ్చింది. రంపచోడవరం జిల్లా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఈ రంపచోడవరం నియోజకవర్గాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉందన్నారు.. ఈ మేరకు సీఎంకు వివరించినట్లు చెప్పారు.
రంపచోడవరంలో ఉభయ గోదావరిజిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి నుంచి పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్కు మద్దతుగా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ రాజశేఖర్ విజయానికి కృషి చేయాలన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం నియోజకవర్గాన్ని కలపడం వల్ల స్థానికులు ఇబ్బంది పడుతున్నారని మంత్రి సంధ్యారాణి చెప్పుకొచ్చారు. రంపచోడవరం నుంచి పాడేరు కలెక్టరేట్కు వచ్చి సమస్యలు చెప్పుకోవాలంటే 500 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది అన్నారు. ఈ సమస్యల్ని ముఖ్యమంత్రికి వివరించామన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మరోవైపు మార్కాపురం జిల్లా ఏర్పాటుపైనా స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు కావడం ఖాయమని.. రాష్ట్ర మున్సిపల్ శాఖామంత్రి పి.నారాయణ స్పష్టత ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తారన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా ప్రజలు సమస్యలపై జిల్లా కేంద్రానికి వెళ్లి సమస్యల్ని తెలియజేస్తున్నారని.. అందుకే త్వరలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతి సోమవారం డివిజన్ కేంద్రంలోని సబ్కలెక్టర్ కార్యాలయంలో ప్రజలు సమస్యలపై వస్తున్నారన్నారు. అందుకే అన్ని శాఖల అధికారులతో ప్రతి శనివారం ప్రజాదర్బార్ నిర్వహిస్తామన్నారు.
మార్కపురంతో పాటుగా అన్ని మండలాల నుంచి ప్రజలు సమస్యలపై వచ్చి తెలియజేయాలని కోరారు కందుల నారాయణరెడ్డి. ఒకవేళ ప్రజలు అందించే సమస్యల్లో పరిష్కరించదగిన సమస్యలు నేరుగా అక్కడే పరిష్కరిస్తామన్నారు. మిగిలిన సమస్యలకు నిర్ణీత కాలంలో పరిష్కారం ఉంటుందన్నారు. మార్కపురం నియోజకవర్గంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.1,200 కోట్లతో టెండర్లు పిలవబోతున్నామని.. భవిష్యత్తులో నీటి కోసం ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పనిచేస్తోంది అన్నారు. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు వచ్చే బడ్జెట్లో రూ.2 వేల కోట్లు కేటాయించేలా జిల్లాలోని ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని.. మరో రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుంది అన్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో లోకేశ్ భేటీ! ఈ పథకం కింద రూ. 5,684 కోట్లు మంజూరు!
ఇక ముందు కూడా ఇదే పంథా కొనసాగిద్దాం - మంత్రి నారా లోకేశ్! ఢిల్లీ పర్యటనలో కీలక ప్రకటన!
కేంద్రమంత్రి తో మంత్రి నారా లోకేశ్ భేటీ! ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు..
శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులు ఆందోళన! నాలుగు గంటలకు పైగా విమానాశ్రయంలో..
వైసీపీ నేతలకు బంపర్ ఆఫర్! ఇది నిరూపిస్తే 10 కోట్ల రూపాయలు మీ సొంతం! ఛాలెంజ్ విసిరిన మంత్రి లోకేష్!
భవిష్యత్లోనూ ఇదే పంథా కొనసాగిద్దాం! త్వరలో కేంద్ర మంత్రి వైష్ణవ్ రాష్ట్రంలో.. కూటమి ఎంపీలతో మంత్రి!
ఉచిత గ్యాస్ సిలిండర్పై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్! ఆ డేట్లోగా బుక్ తప్పనిసరి?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: