పోలీసులపై మాజీ సీఎం జగన్ హేయమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆక్షేపించారు. పోలీసు శాఖలో పని చేసే వేలాది మంది మహిళల మనోభావాల్ని కించపరచడమేనని, పోలీసు శాఖకు ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగులో గురువారం ‘పల్లెకు పోదాం చలో’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలతో కలసి ఆరోగ్యకేంద్రం, సచివాలయాలు, ఆలయాలను పురందేశ్వరి సందర్శించారు.
అనంతరం గ్రామస్తులతో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ విద్వేషం, విధ్వంసం మినహా రాష్ట్ర అభివృద్ధికి జగన్ చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రస్తుతం డబుల్ ఇంజన్ సర్కారుతో అభివృద్ధి పరుగులు పెడుతోందని చెప్పారు. తాజాగా కేంద్రం అమరావతికి రూ.4,285 కోట్లు ఇవ్వడంతోపాటు తిరుపతి-కాట్పాడి రైల్వేలైన్ అభివృద్ధికి 1331 కోట్లు మంజూరు చేసిందన్నారు. రొయ్యలు, చేపల ఎగుమతులకు సంబంధించి అమెరికాతో ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంప్రదింపులు జరపడంతో సుంకాల పెంపు 90రోజులు వాయిదా పడిందన్నారు.
ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?
జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!
రెండు తెలుగు రాష్ట్రాలకు పండగ లాంటి వార్త! గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్నల్!
వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!
సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..
ఎయిర్పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: