Nominated List: ఏపీలో మరో నాలుగు కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం! నామినేటెడ్ లిస్ట్ పూర్తి వివరాలు ఇవిగోండి..

అమెరికాతో సుంకాల వివాదం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు వెళ్లే అన్ని రకాల పోస్టల్‌ మెయిల్‌ సర్వీసులను పూర్తిగా నిలిపివేసింది. లెటర్లు, డాక్యుమెంట్లు, బహుమతులు సహా అన్ని కేటగిరీలలో పార్సిళ్ల రవాణా తాత్కాలికంగా ఆపేయాలని కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వ శాఖ శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఈ నిర్ణయం కారణంగా అమెరికాకు వస్తువులు పంపే వేలాది మంది భారతీయులకు ఇబ్బందులు తలెత్తనున్నాయి.

Railway Projects: కేంద్రం గ్రీన్ సిగ్నల్! రూ. 12,328 కోట్లతో...మరో నాలుగు రైల్వే ప్రాజెక్టులు! ఎక్కడెక్కండంటే!

అమెరికా తాజాగా దిగుమతి సుంకాలను పెంచిన విషయం తెలిసిందే. జూలై 30న జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం ఆగస్టు 29 నుంచి 100 డాలర్లకు పైగా విలువైన పార్సిళ్లపై అదనపు సుంకాలు అమలు చేయాలని నిర్ణయించింది. దీనితో భారత ప్రభుత్వం లెటర్లు, డాక్యుమెంట్లు, 100 డాలర్లలోపు గిఫ్ట్‌లు మాత్రం అనుమతిస్తామని స్పష్టం చేసింది. అయితే ఈ ఉత్తర్వులపై అమెరికా కస్టమ్స్‌ విభాగం తీసుకున్న కొత్త నిబంధనల్లో స్పష్టత లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నమయ్యాయి.

AP Government: ఏపీ ఉచిత బస్సు పథకం - 6 నెలల్లో ఆ సమస్యకు చెక్.! ఆటో డ్రైవర్ల పథకం...

విమానయాన సంస్థలు కూడా అమెరికాకు పార్సిళ్లను తీసుకెళ్లేందుకు నిరాకరించడం మరో ప్రధాన సమస్యగా మారింది. కొత్త నియంత్రణ విధానాల్లో ఉన్న అస్పష్టత కారణంగా వారు రవాణాకు ఆసక్తి చూపకపోవడంతో పోస్టల్‌ సర్వీసులు పూర్తిగా ఆగిపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికాకు పార్సిళ్లు పంపడం అసాధ్యమైపోయింది.

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్! ఎప్పటినుండంటే?

కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వ శాఖ ప్రకటనలో, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, వీలైనంత త్వరగా అన్ని రకాల సేవలను మళ్లీ ప్రారంభించేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది. కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవని, అంతర్జాతీయ చర్చల ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం కానుందని స్పష్టం చేసింది.

Lemon Seeds: నిమ్మకాయ గింజలను తినొచ్చా... తింటే ఏమవుతుంది?

ఇక మరోవైపు, అమెరికా విధించిన కొత్త సుంకాలు ఇప్పటికే శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో అమెరికాలో చదువుతున్న విద్యార్థులు, అక్కడ నివసిస్తున్న భారతీయులు, అలాగే వ్యాపార అవసరాల కోసం పార్సిళ్లు పంపేవారికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. రెండు దేశాల మధ్య ఈ సుంకాల ఉద్రిక్తతలు త్వరగా తగ్గితేనే పోస్టల్‌ సేవలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Promotions: ఉద్యోగులకు గుడ్ న్యూస్‌..! 53 మంది ఎంపీడీవోలు డీఎల్‌డీవోలుగా..! మరికొందరికి కీలక పదవులు..!
AP Ration Cards: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి వేళాయె! ఆ జిల్లాలో పంపిణీకి ఏర్పాట్లు.. 6 లక్షలకు పైగా.!
Real Estate: "గచ్చిబౌలి తరహాలో విజయవాడలో కొత్త డిస్టిక్ట్.. ఈ ప్రాంతం త్వరలోనే.. ఎక్కడంటే.?
IMD Alert: బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. IMD అలర్ట్!
Real Estate: ఏపీలో ఆ వర్గాలకు గట్టి హెచ్చరిక.. 30 రోజుల్లో రిజిస్టర్ అవ్వకపోతే భారీ జరిమానాలు, వ్యాపారంపై నిషేధం!