Politics: మాజీ మంత్రి జగన్ కు ఝలక్... పార్టీకి గుడ్ బై!

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ అత్యంత ఎక్కువగా ఉంది. ఉచిత దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి, నారాయణగిరి షెడ్స్ వరకూ భక్తులు క్యూలైన్లలో వేచిచూస్తున్నారు.

New Mandal: ఏపీలో కొత్తగా మరో మండలం ఏర్పాటు.. ఆ జిల్లాలోనే! ఆ మండలాన్ని విభజించి రెండుగా!

ఉదయం 8 గంటల తరువాత సర్వదర్శనం కోసం వెళ్తున్న భక్తులకు సుమారు 18 గంటల సమయం పడుతోంది. ఇదే సమయంలో రూ. 300 శీఘ్రదర్శనానికి వచ్చే భక్తులకు 3 నుండి 5 గంటల లోపల స్వామివారి దర్శనం కలుగుతోంది. మరోవైపు, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 5 నుండి 7 గంటల సమయం పట్టుతున్నది.

New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్ట్ 1086 ఎకరాల్లో.. డీపీఆర్‌కు రెడీ! ఆ జిల్లాకు మహర్దశ.. భూముల ధరలకు రెక్కలు!

భక్తుల సందర్శనతో ఆలయం ప్రాంగణం కిక్కిరిసిపోయింది. నిన్న ఒక్కరోజే స్వామివారిని 77,481 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,612 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ద్వారా వచ్చిన ఆదాయం రూ. 3.96 కోట్లు గా నమోదైంది.

Free Bus: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..! బిగ్ అప్‌డేట్ ఇదిగో..!

ఇంతటి రద్దీని సమర్థంగా నిర్వర్తించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులకు ఈ సందర్బంగా టీటీడీ తరఫున సహాయ సూచనలు, క్యూలైన్ వాహనాలు, అన్నదాన శిబిరాలు తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి.

Movie Event: 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్! నేను కూడా ఈ మూవీ కోసం వెయిటింగ్.. మంత్రి కామెంట్స్!
Green card : గ్రీన్‌కార్డుకు రెడ్‌ సిగ్నల్‌.. కార్పొరేట్‌ రంగంపై పెనుప్రభావం! మరో 16 లక్షల కొత్త దరఖాస్తులు..
Indian Army Recruitment: ఇంజనీరింగ్ చదివిన నిరుద్యోగులకు శుభవార్త… ఆర్మీలో కొత్త ఉద్యోగాలు..