LIVE
Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  •  Retirement Age: పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంపు.. హైకోర్టు కీలక తీర్పు!  •  Health Tips: వీటిలో వాటర్ తాగుతున్నారా... అయితే వాటిని కొనితెచ్చుకున్నట్లే!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Helping Hand

Revanth Reddy: గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి... రూ. 5 లక్షల ఆర్థిక సాయం!

Revanth Reddy: దుబాయ్‌లో కోమాలోకి వెళ్లి, స్వదేశంలో మరణించిన జగిత్యాల కార్మికుడు ఆరెల్లి గంగారాజం కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి రూ. 5 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేశారు. గల్ఫ్ దేశంలో మరణిస్తేనే వచ్చే ఎక్స్ గ్రేషియా నిబంధనను పక్కనపెట్టి, మానవతా దృక్పథంతో CMRF ద్వారా ఈ సాయం అందించార…

AndhraPravasi News Desk 2 min read
Revanth Reddy: గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి...  రూ. 5 లక్షల ఆర్థిక సాయం!

Helping Hand- గల్ఫ్ బాధితుడికి ప్రత్యేక పద్ధతిలో ఆర్థిక సాయం…

కోమాలో స్వదేశానికి వచ్చి మరణించిన కార్మికుడు…

ముఖ్యమంత్రి సాయంపై కార్మికుడి భార్య కృతజ్ఞతలు…

Revanth Reddy: జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన ఆరెల్లి గంగారాజం (61) అనే గల్ఫ్ కార్మికుడు దుబాయ్‌లో కిడ్నీ వ్యాధితో కోమాలోకి వెళ్లారు. మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వం ఆయనను హైదరాబాద్‌కు తరలించింది. అయితే, పది రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఆయన స్వదేశంలోనే తుదిశ్వాస విడిచారు. సాధారణంగా గల్ఫ్ దేశాల్లో మరణిస్తేనే ప్రభుత్వ ఎక్స్ గ్రేషియా అందుతుంది, కానీ గంగారాజం భారత్‌లో మరణించడంతో సాంకేతిక సమస్య తలెత్తింది.

ఈ విషయాన్ని గమనించిన గంగారాజం కుటుంబ సభ్యులు 'ప్రజావాణి'లో ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు. దీనిపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి. చిన్నారెడ్డి మరియు ఐఏఎస్ అధికారిణి దివ్యా దేవరాజన్ ప్రత్యేక చొరవ చూపారు. మరణం ఎక్కడ సంభవించినా, బాధితుడు గల్ఫ్ కార్మికుడనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అధికారులతో చర్చించి, ప్రత్యేక కేసుగా దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిబంధనల కంటే మానవత్వం గొప్పదని చాటుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో మృతుడి భార్య రాజవ్వకు ఈ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై అడ్వైజరీ కమిటీ ప్రతినిధులు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గల్ఫ్ కార్మికుల సంక్షేమం పట్ల ప్రభుత్వం ఎంత నిబద్ధతతో ఉందో ఈ ఘటన నిరూపిస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ మరియు ఇతర నాయకులు ఈ ప్రక్రియలో క్రియాశీలక పాత్ర పోషించారు. మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ గ్రామస్థులు మరియు ఎన్నారై విభాగం ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఒక నిరుపేద కార్మిక కుటుంబం వీధిన పడకుండా ప్రభుత్వం సకాలంలో స్పందించి ఆదుకోవడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కార్మికులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామనే భరోసాను ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం కల్పించింది.

Be the first to react

More Coverage

Oman: ఒమాన్‌లో ఇరుక్కున్న మహిళను రక్షించిన కూటమి కార్యకర్తలు! సురక్షితంగా స్వదేశానికి చేరిన బాధితురాలు!

Oman: ఒమాన్‌లో ఇరుక్కున్న మహిళను రక్షించిన కూటమి కార్యకర్తలు! సురక్షితంగా స్వదేశానికి చేరిన బాధితురాలు!

Oman: ఉద్యోగం కోసం ఒమాన్‌కు వెళ్లిన ఒక మహిళకు ఎదురైన భయానక అనుభవం చివరికి సుఖాంతం అయింది. ఆంధ్రప్రదే…