DGP: మార్చికల్లా మావోయిస్టులు లొంగిపోవాలి... డీజీపీ హరీష్ గుప్తా హెచ్చరిక!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు (జులై 26) రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్ బయలుదేరనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు "బ్రాండ్ ఏపీ" ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ విదేశీ పర్యటన చేపడుతున్నారు.

Godavari River: గోదావరి ఉగ్రరూపం.. ఎగువ నుంచి భారీ వరద! అధికారుల అలర్ట్..

ఈ పర్యటనలో సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, పీ. నారాయణ మరియు పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు. ఈ బృందం సింగపూర్‌లో ఐదు రోజుల పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననుంది.

మహిళల అభివృద్ధే మా ప్రాధాన్యం – ఆర్థిక భరోసా ప్రధాన లక్ష్యం! రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం..

పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రముఖ గ్లోబల్ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. అలాగే సింగపూర్‌లో జరిగే “తెలుగు డయాస్పొరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా” కార్యక్రమంలో పాల్గొననున్నారు. మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ దేశాల నుంచి పలువురు తెలుగు పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Caravan Parks: ఏపీలో కారవాన్ పార్కులు.. అక్కడే..! ఆ ప్రాంతాలకు మహర్దశ.!

ఈ సదస్సును ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. వేదికగా సింగపూర్‌లోని వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఎంపిక చేశారు. సుమారు 1,500 మంది ప్రతినిధులు హాజరయ్యే ఈ సదస్సుకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

Minister Speech: నగరాల్లో కాదు.. గ్రామాల్లోనూ కొత్త రోడ్లు – ఇదే నిజమైన అభివృద్ధి!

సదస్సు సందర్భంగా సీఎం చంద్రబాబు పీ4 (P4: People–Public–Private–Partnership–for–Progress) కార్యక్రమంలో భాగంగా ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలను రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా ఉండాలంటారు. రాష్ట్ర నిరుద్యోగ యువతకు దేశం లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చర్చలు సాగనున్నాయి.

Narayana tweet: అమరావతిలో రెండు వైద్య కళాశాలలు.... మంత్రి నారాయణ!

అలాగే, వివిధ దేశాలకు ఏపీ ఉత్పత్తుల ఎగుమతుల కోసం ఎన్ఆర్ఐల సహకారంతో ప్రణాళికలు రూపొందించనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.

TRF: టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అమెరికా..! ఎలాంటి అభ్యంతరం లేదన్న పాక్‌!

పర్యటనలో భాగంగా చంద్రబాబు బృందం స్పోర్ట్స్ హబ్‌లు, పోర్టులు, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ కేంద్రాలను సందర్శించనుంది. ఈ పర్యటనతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దారులు వెలిసే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Hydrogen Train: దేశంలో తొలిసారి హైడ్రోజన్ రైలు.. ఈ మార్గంలో త్వరలో పరుగులు!
Mudra Loan: ఏపీలో వారందరికి శుభవార్త..! ఒక్కొక్కరికి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు..!
Devlopment: జిల్లాకు ప్రత్యేక వైద్యాధికారి.. విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యం! 143 కోట్లతో హాస్టళ్లకు మరమ్మతులు!
Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ప్రజలు అవస్థలు... వచ్చే 48 గంటలు కీలకం!
Bank Balance: మీ బ్యాలెన్స్ మీ చేతిలో.. మిస్డ్ కాల్ ద్వారా సమాచారం... బ్యాంక్‌కు వెళ్లకుండా ఖాతా వివరాలు!
Gulf Direct flight: తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు డైరెక్ట్ విమాన సర్వీసులు! మంత్రులకు గల్ఫ్ ఎంపవర్‌మెంట్ కోఆర్డినేటర్ విజ్ఞప్తి!
AP DGP: డీజీపీ ఎదుట తలవంచిన మావోయిస్టులు.. ఏపీ పోలీసులకు గట్టి విజయం!