అమెరికా ఫస్ట్ నినాదంతో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. విదేశాలకు చెందిన వారి కంటే అమెరికా పౌరులకే అన్ని రకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉంటున్న వారిని.. తప్పుడు పత్రాలతో అక్రమ మార్గాల్లో చట్టవ్యతిరేకంగా అమెరికాలో అడుగుపెట్టిన వారిని.. స్వదేశాలకు పంపించే కార్యక్రమాన్ని శరవేగంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే 205 మంది భారతీయులతో కూడిన విమానం బుధవారం.. పంజాబ్లోని అమృత్సర్లో ల్యాండ్ అయింది. ఈ క్రమంలోనే తాజాగా మరో సంచలన నిర్ణయానికి ట్రంప్ సర్కార్ చర్యలు చేపడుతోంది. ఈ నిర్ణయం గనక అమల్లోకి వస్తే.. అమెరికాలోని హెచ్ 1 బీ, ఎల్ 1 వీసాలు కలిగిన ఉద్యోగులకు మరిన్ని కష్టాలు ఎదురుకానున్నాయి.
ఇప్పటివరకు హెచ్ 1బీ, ఎల్1 వీసాలు కలిగి ఉన్న వారికి వాటి గడువు పూర్తి కాగానే ఆటోమేటిక్గా ఆ వీసాలు రెన్యువల్ అయ్యేవి. ఈ వీసా ఆటో రెన్యూవల్ విధానాన్ని గతంలో అధికారంలో ఉన్న జో బైడెన్ తీసుకువచ్చారు. అయితే బైడెన్ కల్పించిన ఈ వీసాలను ఆటోరెన్యూవల్ చేసుకోవడానికి ఉన్న అవకాశాన్ని రద్దు చేయాలని ఇద్దరు రిపబ్లికన్ సెనెటర్లు తాజాగా తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు మరో భారీ షాక్ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. హెచ్-1బీ, ఎల్-1 వర్క్ వీసాలకు ఆటోరెన్యూవల్ విధానం అనేది ఇమ్మిగ్రేషన్ అమలు చేసేందుకు అత్యంత ప్రమాదకరమైందని ఆ సెనెటర్లు పేర్కొన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
హెచ్-1బీ, ఎల్-1 వీసాల గడువును పొడిగిస్తూ.. కొన్ని నెలల క్రితమే బైడెన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఆ వీసా గడువు కేవలం 180 రోజులు ఉండగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొన్ని రోజుల ముందే.. డెమోక్రటిక్ ప్రభుత్వం దాన్ని 540 రోజులకు పెంచింది. దీన్ని గత నెల 13వ తేదీన ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఫైనల్ చేసింది. దీని వల్ల వలసదారులు, శరణార్థులు, గ్రీన్కార్డ్దారులు, హెచ్-1బీ, ఎల్-1 వీసా దారుల భాగస్వాములకు భారీగా లబ్ధి చేకూరింది. వర్క్ వీసాలపై పనిచేస్తున్న భారతీయులకూ ప్రయోజనం కలిగింది.
అయితే బైడెన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం.. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ విధానాలకు అడ్డుకట్టగా మారింది. ఈ ఆటో రెన్యూవల్ ఉంటే.. కఠిన వలసల నియంత్రణ, కఠిన వీసా రూల్స్కు అడ్డంకిగా మారుతుందని సెనెటర్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని సెనెటర్లు జాన్కెన్నడీ, రిక్ స్కాట్లు కాంగ్రెస్ రివ్యూ యాక్ట్ కింద గత నెల 31వ తేదీన తీర్మానం ప్రతిపాదించారు. వర్క్పర్మిట్స్ను ఆటోమేటిక్గా 540 రోజులు పొడిగించేలా నిబంధన తీసుకురావడం అనేది ఇమ్మిగ్రేషన్ చట్టాల అమలును దెబ్బతీస్తుందని.. అమెరికా భద్రత కూడా ప్రమాదంలో పడుతుందని సెనెటర్లు తెలిపారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో లోకేశ్ భేటీ! ఈ పథకం కింద రూ. 5,684 కోట్లు మంజూరు!
ఇక ముందు కూడా ఇదే పంథా కొనసాగిద్దాం - మంత్రి నారా లోకేశ్! ఢిల్లీ పర్యటనలో కీలక ప్రకటన!
కేంద్రమంత్రి తో మంత్రి నారా లోకేశ్ భేటీ! ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు..
శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులు ఆందోళన! నాలుగు గంటలకు పైగా విమానాశ్రయంలో..
వైసీపీ నేతలకు బంపర్ ఆఫర్! ఇది నిరూపిస్తే 10 కోట్ల రూపాయలు మీ సొంతం! ఛాలెంజ్ విసిరిన మంత్రి లోకేష్!
భవిష్యత్లోనూ ఇదే పంథా కొనసాగిద్దాం! త్వరలో కేంద్ర మంత్రి వైష్ణవ్ రాష్ట్రంలో.. కూటమి ఎంపీలతో మంత్రి!
ఉచిత గ్యాస్ సిలిండర్పై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్! ఆ డేట్లోగా బుక్ తప్పనిసరి?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: