పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారణంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేపట్టిన ఆపరేషన్పై విపక్షాలు సంతోషం వ్యక్తం చేస్తాయనుకుంటే.. సందేహాలు వ్యక్తం చేస్తున్నాయంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు.
లోక్సభలో రెండో రోజు మంగళవారం జరిగిన ప్రత్యేక చర్చలో అమిషా మాట్లాడారు. విపక్ష ఎంపీల వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్నారు. ఉగ్రవాదులను మట్టుబెడితే ఆనందం వ్యక్తం చేస్తారనుకున్నానని.. కానీ విపక్ష సభ్యులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో ఒకసారి ఆలోచించాలంటూ హితవుపలికారు. ఉగ్రవాదులు చనిపోయారన్న సంతోషం వారిలో కనిపించలేదని చెప్పారు. ఉగ్రవాదులు పాక్ నుంచే వచ్చారనేందుకు.. ఆధారాలు ఉన్నాయా అన్న చిదంబరం ప్రశ్నకు అమిత్ షా స్పందించారు.
పాక్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారా.. అని ప్రశ్నించారు. పాక్కు క్లీన్చిట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటంటూ కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం తగదని హితవుపలికారు.
ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చారనేందుకు తమ వద్ద ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల నుంచి కొన్ని పాక్ వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నామని అమిత్షా క్లారిటీ ఇచ్చారు.