Ramanaidu Press Meet: ఆంధ్రప్రదేశ్‌ను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం.. ప్రతి రైతు ఆనందంగా.!

ఈ ఏడాది కృష్ణానదీ పరివాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటకలలో కురిసిన భారీ వర్షాలకు ముందస్తుగానే జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు జలాశయాలు గత వారంలోనే గరిష్ఠ స్థాయి మట్టాలకు చేరాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి అదనంగా వచ్చే వరదనంతా నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయానికి 1,98,920 క్యూసెక్కుల మేర వరద పెరగడంతో నిన్న నాలుగు గేట్లు పది అడుగుల మేర ఎత్తి 1,08,260 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 66,896 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

నాగార్జునసాగర్‌కు 2,01,743 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుతం సాగర్ ఔట్ ఫ్లో 41,882 క్యూసెక్కులుగా నమోదైంది. ఈరోజు ఉదయం గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తుండటంతో ప్రాజెక్టు దిగువ భాగంలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రజలు నదిలోకి వెళ్లవద్దని సూచించారు.

సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 586.60 అడుగుల నీటి మట్టం ఉంది. సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.4 టీఎంసీలకు చేరుకోవడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్‌కు భారీ వరద కొనసాగుతోంది. 

Rakhi Special: రాఖీ స్పెషల్.... ఫ్లిప్‌కార్ట్‌లో హ్యాండ్ బ్యాగ్స్‌పై భారీ తగ్గింపు!
No Airport Country: ఏమిటి ఈ దేశం? ఎయిర్‌పోర్ట్ లేదు... కరెన్సీ లేదు.. కానీ హ్యాపీ గా గడిపేస్తున్నారు!
TTD: టిటిడి పాఠశాలల్లో సద్గమయ శిక్షణా తరగతులు…! ఎవరు అర్హులంటే?
Tirupati: శ్రీవారిమెట్టు మార్గంలో ఏనుగుల కలకలం.. భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచన!
Srisailam Reservoir: డ్యాం పూర్తి స్థాయికి చేరడంతో గేట్లు ఎత్తి నీరు విడుదల!
Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? వీళ్లు ఏం చేశారో తెలిస్తే మీ గుండె గుభేలే..!
Lokesh Meeting: విశాఖలో గూగుల్ డేటాసెంటర్ పనులు ప్రారంభించాలి.. కొత్త అవకాశాలు సృష్టిస్తాం!
US Visa: US వీసా విధానంలో కీలక మార్పులు! సెప్టెంబర్ 2 నుండి అమలు!
Dear Nimisha: నిమిష ప్రియ కేసులో బిగ్ ట్విస్ట్... ఉరిశిక్ష రద్దయ్యిందా లేదా!