ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో శుక్రవారం భేటీ కానున్నారు. దావోస్ ప్రపంచ ఆర్థికవేదిక సదస్సు పర్యటన నుంచి ఆయన నేరుగా దిల్లీ చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు ఇక్కడి నార్త్ బ్లాక్ లోని ఆర్థికశాఖ కార్యాలయంలో నిర్మలా సీతారామన్తో సమావేశమవుతారు. ఫిబ్రవరి 1న కేంద్రప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్రం తరపున విజ్ఞప్తులను ఆమె ముందుంచే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇంకా చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! విశాఖలో డిజైన్ కేంద్రం.. గూగుల్తో ఇప్పటికే పలు ఒప్పందాలు!
వైజాగ్ స్టీల్స్టాంటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి సీఎం ప్రస్తావించే అవకాశం ఉంది. అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు, ఏడీబీ అందించే నిధుల అంశమూ చర్చకు రావొచ్చు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి.. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, పునరుత్పాదక ఇంధనశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీలనూ కలిసే అవకాశం ఉంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వారసత్వంపై సీఎం కీలక వ్యాఖ్యలు! జగన్ మళ్లీ సీఎం అయితే? దావోస్ లో చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఆయన నియామకానికి రంగం సిద్ధం! సీనియారిటీ జాబితాలో రెండో స్థానం!
ఓరి దేవుడా.. వీడు అసలు మనిషేనా? ఘోరం... భార్యను చంపి కుక్కర్ లో ఉడికించాడు!
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! విశాఖలో డిజైన్ కేంద్రం.. గూగుల్తో ఇప్పటికే పలు ఒప్పందాలు!
ఘోర ప్రమాదం... ప్రయాణికుల మీదకు దూసుకెళ్లిన రైలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: