ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. సూపర్ సిక్స్ పథకాల్లో ఒకదానిని వచ్చే సంక్రాంతి నుంచి అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. తాజాగా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఓ కీలక హామీను అమలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి కొన్నింటికి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో నిధులు కేటాయించింది. తాము అధికారంలోకి వస్తే 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఆర్థికసాయం అందిస్తామని కూటమి పార్టీలు ఎన్నికల్లో ప్రకటించాయి.
ఇంకా చదవండి: ఏపీలో బీచ్ కు వెళ్లాలంటే ఛార్జీ కట్టాల్సిందే! ఈ 5 చోట్ల ఎప్పటి నుంచి అంటే? - ఎంత అంటే!
కూటమి మేనిఫెస్టోలో ఈ పథకానికి ఆడబిడ్డ నిధి/మహిళాశక్తిగా నామకరణం చేశారు. ఇప్పుడు ఈ పథకాన్నికి ‘మహిళలకు ఆర్థిక సహకారం’ పేరుతో ఆయా వర్గాలకు చెందిన మహిళలకు అందించనుంది. తాజాగా ఈ పథకం అమలుకు సంబంధించి 2024-25 బడ్జెట్లో ప్రభుత్వం రూ.3,341.82 కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే సంక్రాంతి నుంచి ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయలేదు. బీసీ మహిళలకు రూ.1099.78 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రూ.629.37 కోట్లు, మైనారిటీలకు రూ.83.79 కోట్లు, ఎస్సీ మహిళలకు రూ.1198.42 కోట్లు, గిరిజన మహిళలకు రూ.330.10 కోట్లు కేటాయించింది.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రిపై కేసు నమోదు చేసిన ఐ-టీడీపీ నేత! ఎందుకో తెలుసా?
గుడ్న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు!
మూడవ విడత నామి నేటెడ్ పోస్టులు విడుదల! ఆ లిస్ట్ మీకోసం! ఒక్కో కార్పొరేషన్కు 15 మంది!
అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీవ్ర ఆగ్రహం! పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా.?
APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!
లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!
రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!
ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!
మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: