మచిలీపట్నం: మద్యం ధరల స్థిరీకరణకు త్వరలోనే టెండర్ కమిటీ వేస్తామని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. డిస్టిలరీస్లో టెండర్ కమిటీ సంప్రదింపులు జరిపి ఎంఆర్పీ రేట్లు నిర్ణయిస్తుందన్నారు. నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఇప్పటికే క్వాలిటీ మద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అత్యంత పారదర్శకంగా దుకాణాలు కేటాయించి మద్యం విక్రయాలు ప్రారంభించామన్నారు. గీత కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు వారం రోజుల్లోనే 340 మద్యం దుకాణాల కేటాయింపునకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఈ నెల 15 లోపు దుకాణాల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉందని మంత్రి రవీంద్ర తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?
"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!
ఏపీలో రైతులకు భారీ శుభవార్త... ఇకనుంచి రూ.3వేలు! అర్హులు ఎవరు అంటే!
ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్కు భారీ షాక్! పతనం కోరుకుంటున్న వైఎస్ షర్మిల!!
దీపావళి పండగ ముందు సామాన్యులకు బ్యాడ్న్యూస్! భారీగా పెరిగిన వంటనూనె ధరలు! ఎంతో తెలిస్తే షాక్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: