ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేడు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ సభ్యత్వ కార్డు ఉంటే సమాజంలో ఓ గౌరవం ఉంటుందని పేర్కొన్నారు. టీడీపీ రాకముందు తెలుగు వారికి సరైన గుర్తింపు లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ విశ్వవిద్యాలయం వంటిదని, అనేకమంది నేతలను తయారుచేసిన పార్టీ అని అభివర్ణించారు. కార్యకర్తల కోసం శిక్షణ తరగతులు నిర్వహించడమే కాకుండా, ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటు చేసి డిగ్రీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇంకా చదవండి: అందులో ఎవరూ జోక్యం చేసుకోవద్దు! టీడీపీ నాయకులకు సీఎం చంద్రబాబు మరోసారి వార్నింగ్!
జాతీయ భావంతో ముందుకు వెళుతూ ప్రతిభకు పెద్దపీట వేసిన పార్టీ టీడీపీ... జాతీయస్థాయిలో టీడీపీ పోషించిన కీలకపాత్రలు మరే పార్టీకి సాధ్యం కాలేదు అని వివరించారు. పార్టీ కార్యక్రమాలకు టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నామని, ఎవరికి పదవి ఇచ్చినా అన్ని జాగ్రత్తలు తీసుకుని, అన్ని అంశాలు పరిశీలించాకే ఇస్తానని చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ పనైపోయిందని గతంలో మాటలు వినిపించాయని, ఆ మాటలు అన్నవారు ఇప్పుడేమయ్యారు? అని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లతో మనం పోరాడాల్సి వస్తుందని ఊహించలేదు... గత ఐదేళ్ల కష్టాలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం అని వ్యాఖ్యానించారు. మొన్నటి ఎన్నికల్లో మన స్ట్రయిక్ రేట్ ఓ చరిత్ర అని చంద్రబాబు చెప్పారు. సోషల్ రీఇంజినీరింగ్ చేశామని, అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదలకు తెదేపా సిద్ధం! చంద్రబాబు కీలక ప్రకటన!
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న యువ తెలుగు హీరో! మెగామేనల్లుడు ఆసక్తికర వ్యాఖ్యలు!
తాను మరణించి... ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపి! మరొకరికి ఆశను పంచిన జగదీష్ కుటుంబం!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! వారి ఖాతాల్లో నిధులు జమ చేసిన ఏపీ ప్రభుత్వం..!
ఏపీ ప్రజలకు శుభవార్త: విజయవాడ నుంచి హైదరాబాద్ గంటన్నరే! రికార్డులు బద్దల కొడుతున్న కూటమి ప్రభుత్వం!
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు! నేతలతో చంద్రబాబు భేటీ - కీలక ఆదేశాలు జారీ!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దీపావళి బంపర్ ఆఫర్! ఉచిత గ్యాస్ బుకింగ్స్ ప్రారంభం! 48 గంటల్లోపు నగదు జమ!
భారీ శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకున్న APSRTC! ఆ సమస్యకి చెక్ పెటినటే!
రూ.6 వేలకే ఐ ఫోన్, రూ.5 వేలకే ఆండ్రాయిడ్ ఫోన్.. ల్యాప్టాప్ రూ.15 వేలు మాత్రమే!
ముందుబాబులకు డబల్ కిక్కిచ్చే న్యూస్.. రూ.99 క్వార్టర్ వచ్చేసిందోచ్! ఒకరికి ఎన్ని ఇస్తారంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: