విజయవాడ వరద బాధితులకు పరిహారం విడుదల చేసింది. బుడమేరు ముంపుతో విజయవాడ లో పలు ప్రాంతాలు నీట మునిగాయి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించేందుకు ప్యాకేజీ ప్రకటించింది. నిధులు విడుదల చేసింది. కొద్ది రోజులుగా పరిహారం అందని వారు ఆందోళన చేస్తున్నారు. దీంతో, పరిహారం అందని వారిని గుర్తించి వారికి ఈ రోజు వారి ఖాతాల్లో పరిహార సొమ్ము జమ చేసింది. విజయవాడ వరద బాధితుల్లో పరిహారం అందని వారికి ప్రభుత్వం నేడు నిధులు జమ చేసింది. మరో 1501 మందికి రూ.2.5 కోట్ల పరిహారం విడుదలైంది. 1501 మంది బాధితులకు వారి అకౌంట్లకు ఈరోజు నగదును సర్కార్ బదిలీ చేసింది. ఇందులో బ్యాంక్ అకౌంట్ ఇనాక్టివ్గా ఉన్న కారణంతో 143 మందికి లబ్ధిదారుల అకౌంట్లలో పరిహారం జమ అవ్వలేదని అధికారులు గుర్తించారు. వీరికి సంబంధించి మరోసారి బ్యాంకు వివరాలు తీసుకుని పరిహారం అందించాలని నిర్ణయించారు. బ్యాంకు ఖాతాలు లేవని గుర్తించిన 256 మంది వివరాలను సచివాలయాలు, ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా ప్రభుత్వం వెల్లడించనున్నారు. బ్యాంక్ అకౌంట్ వివరాలు అందించి ఈ 256 మంది తమకు వచ్చే పరిహారం పొందవచ్చని అధికారులు తెలిపారు.
ఇంకా చదవండి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దీపావళి బంపర్ ఆఫర్! ఉచిత గ్యాస్ బుకింగ్స్ ప్రారంభం! 48 గంటల్లోపు నగదు జమ!
వరద ఉధృతితో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. వారికి వరద సహాయాన్ని సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు సెప్టెంబర్లో విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలోని ప్రజలకు వరద సహాయాన్ని వారి ఖాతాల్లో వేశారు. ఇళ్లు, దుకాణాలు, తోపుడు బళ్లు, వ్యాపారాలు, చిన్న తరహ పరిశ్రమలు, వాహానాలు, పంటలు, పశువులకు ఆర్థిక సాయం అందించింది. వరదలు వచ్చిన 15 రోజుల్లోనే బాధితులకు వారి ఖాతాల్లో ప్రభుత్వం వరద సహాయాన్ని జమ చేసింది. పరిహారంగా మొత్తం రూ.618 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. విడతల వారీగా ప్రభుత్వం లబ్దిదారుల ఖాతాల్లో డబ్బును జమచేస్తోంది. ముందుగా రూ.602 కోట్లను జమ చేసిన సర్కార్.. ఆ తరువాత రూ.9 కోట్లు.. ఆపై రూ. 16 కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో జమచేసింది. మొత్తం 4,19,528 మందికి ప్రభుత్వం పరిహారం అందజేసింది. అలాగే తాజాగా 2954 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1646 మందిని అర్హులుగా గుర్తించారు. వారిలో ప్రస్తుతం 1501 మంది బాధితులకు రూ.2.5 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం అందజేసింది. ఇంకా అందాల్సిన వారికి మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో పరిహారం అందేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
భారీ శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకున్న APSRTC! ఆ సమస్యకి చెక్ పెటినటే!
రూ.6 వేలకే ఐ ఫోన్, రూ.5 వేలకే ఆండ్రాయిడ్ ఫోన్.. ల్యాప్టాప్ రూ.15 వేలు మాత్రమే!
ముందుబాబులకు డబల్ కిక్కిచ్చే న్యూస్.. రూ.99 క్వార్టర్ వచ్చేసిందోచ్! ఒకరికి ఎన్ని ఇస్తారంటే?
ఏపీపీఎస్సీ చైర్పర్సన్గా ఎవర్ని ఎంపిక చేశారు అంటే! కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు!
ఏపీలో విద్యార్థులకు లోకేష్ శుభవార్త! అకౌంట్లలో డబ్బులు జమ! గత ప్రభుత్వం రూ.3500 కోట్ల!
మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం కేసులో కోర్టు కీలక నిర్ణయం! టాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా!
ఏపీలో విద్యార్థులకు లోకేష్ శుభవార్త! అకౌంట్లలో డబ్బులు జమ! గత ప్రభుత్వం రూ.3500 కోట్ల!
జగన్పై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం! ఇదే తీరు కొనసాగిస్తే ఊరుకునేది లేదు!
రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్! దానా ఎఫెక్ట్.. 23, 24, 25 తేదీల్లో సుమారు 70 రైళ్లు క్యాన్సిల్!
ఏపీలో ఫ్రీ గ్యాస్ సిలిండర్లు.. కావాల్సిన అర్హతలు, డాక్యుమెంట్స్ ఇవే! దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే!
మీ పేరుతో ఎక్కువ సిమ్ కార్డులు ఉన్నాయా? భారీ జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష తప్పదు! ఎందుకో తెలుసా?
మహిళలు తస్మాస్ జాగ్రత్త.. ఈ లక్షణాలు ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు! 30 నుంచి 52 సంవత్సరాల..
విజయవాడ మెట్రోని అమరావతికి అనుసంధానం చేయాలి! కేంద్ర, రాష్ట్ర మంత్రుల కీలక భేటీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: