రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు మరో శుభవార్త అందించారు. పలు సమీక్షలు నిర్వహించిన అనంతరం ప్రజలకు తీపి కబురు చెప్పారు. చంద్రబాబు చేసిన ఈ ప్రకటనతో ఇళ్లు కట్టుకోవాలనుకునే వారి పండగ చేసుకుంటున్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఉచిత ఇసుక అందిస్తామని కూటమి నేతలు ప్రకటించారు. తాజాగా సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక విధానంకి సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉచితంగా అందిస్తున్న ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉచిత ఇసుక విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు, ఇసుక లభ్యత మరింత పెంచేందుకు సీనరేజి రద్దు చేసినట్లు వెల్లడించారు.
ఇంకా చదవండి: దోచుకుని దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ! జగన్ పై షర్మిల ఫైర్ - రాజీ చర్చల ప్రచారం వేళ..!
రాష్ట్రంలో కొన్ని రోజులుగా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు మార్గాల్లో తరలింపు అధికంగా జరుగుతోందన్నారు. ఆయా మార్గాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి పటిష్ఠ పర్యవేక్షణ ఉండాలన్నారు. ఉచిత ఇసుక విధానం నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. అక్రమ ఇసుక తవ్వకాలపై సామాన్యులు కూడా ఫిర్యాదు చేసేలా సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో సొంత అవసరాలకు ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలింపునకు అనుమతిచ్చిన్నట్లు తెలిపారు. ఇసుక తీసుకెళ్లేవారు గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేయించుకునే ఉచితంగా అందిస్తా్మన్నారు. రీచ్లలో తవ్వకాలు, లోడింగ్ ప్రైవేటుకు అప్పగింతపై ఆలోచించాలన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! దీపావళి కానుక అదరహో! ఆ వివరాలు మీ కోసం!!
వైసీపీకి షాక్.. మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు అరెస్ట్! ఎందుకో తెలుసా?
రూ.1 కట్టక్కర్లేదు.. ఏపీలో వీళ్లందరికీ ఉచితంగానే కరెంట్! ప్రభుత్వం మాస్టర్ ప్లాన్!
ఉత్తరాంధ్రకు భారీ వర్షాల సూచన! మత్స్యకారులకు సముద్రంలో వెళ్లవద్దని హెచ్చరిక!
పాకిస్థాన్ యువతిని ఆన్లైన్లో పెళ్లి చేసుకున్న బీజేపీ కార్పొరేటర్ కొడుకు! పెళ్లి కూతురు తరపువారు!
ఏపీలో మద్యం బాబుల సందడి! ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో!
ఆధార్ కార్డ్ ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! జిల్లాలలో 5 నుంచి 15 ఏళ్ల వయసు!
రూ.3 లక్షల 50 వేల జీతం.. పరీక్ష లేకుండా నేరుగా జాబ్, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఇదే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: