ప్రస్తుతం కీలకమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ లేకపోతూ ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఎవరో కూడా ప్రభుత్వానికి తెలీదు. రేషన్ కార్డు, పాన్ కార్డు.. ఇలా మీరు ఏ డాక్యుమెంట్ పొందాలన్నా ఆధార్ కార్డు ఉండాల్సిందే. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు ఉంటుంది. పుట్టిన పిల్లలకు కూడా వెంటనే ఆధార్ కార్డు తీసుకుంటున్నారు. అందువల్ల ఇంతటీ కీలకమైన ఆధార్ కార్డులో వివరాలు అన్నీ కూడా కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. వివరాల్లో తప్పులు ఉంటే దాని వల్ల ప్రభుత్వ పథకాలకు దూరం కావొచ్చు. అందుకే పేరు, వయసు, అడ్రస్ ఇలా అన్ని వివరాలు కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఒకవేళ వివరాల్లో తప్పులు ఉంటే వాటిని సరిచేసుకోవచ్చు. దీని కోసం మీరు రోజంతా పని వదిలేసుకోని ఎక్కడికో ఆధార్ కేంద్రాల వద్దకు వెళ్లాల్సిన పని లేదు. ఇప్పుడు ప్రభుత్వం స్పెషల్ ఆధార్ అప్డేట్ క్యాంపులను నిర్వహిస్తోంది.
మీరు మీ ఆధార్ కార్డులో వివరాలు సరి చేసుకోవాలని భావిస్తే.. ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు. ఈ నెల 22 నుంచి 25 వరకు అంటే 4 రోజుల పాటు అంగన్వాడీ కేంద్రాలు, సచివాలయాలు, కళాశాలలు, పాఠశాలల్లో స్పెషల్ ఆధార్ అప్డేట్ క్యాంపులను ఏర్పాటు చేస్తారు. మీరు ఇక్కడికి వెళ్లి ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ అప్డేట్ చేసుకోక 10 ఏళ్లు దాటిన వారు కచ్చితంగా వెళ్లి వివరాలు, వేలిముద్రలు అప్డేట్ చేసుకోండి. లేదంటే ఇబ్బంది పడాల్సి రావొచ్చు. ఏదైనా స్కీమ్ కోసం అప్లై చేసుకుంటే.. ఫింగర్ప్రింట్స్ పడకపోవచ్చు. డేటా మిస్ మ్యాచ్ కూడా రావొచ్చు. అంతేకాకుండా పిల్లలకు ఆధార్ కార్డు తీసుకొని ఉంటే.. వారికి ఐదేళ్లు దాటితే.. అప్పుడు మళ్లీ వివరాలను అప్డేట్ చేసుకోవాలి. ఇలాంటి వారు కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. గ్రామ-వార్డు సచివాలయాల అధికారులు మాట్లాడుతూ.. ఆధార్ అప్డేట్ సేవలు అందించేందుకు ఏర్పాటు చేస్తున్న ఈ స్పెషల్ క్యాప్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. దీని వల్ల భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. విజయనగరం, మన్యం జిల్లాలలో 5 నుంచి 15 ఏళ్ల వయసు కలిగిన వారిలో వేలిముద్రలు అప్డేట్ చేసుకోవాల్సిన వారు దాదాపు 82 వేల మంది వరకు ఉన్నారు. ఇక 15 నుంచి 17 ఏళ్లలోపు వారిలో అయితే లక్షా 20 వేల మంది వరకు ఉన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీ షాక్.. మాజీ ఎంపీని కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు! 48 గంటల పాటు..
అర్ధరాత్రి ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియోకాల్! ఎందుకు.. ఎవరు..? తర్వాత ఏమైందంటే?
నేడు చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం! ఆ నేతల గుండెల్లో గుబులు! ప్రజాప్రతినిధులకు కీలక సూచనలు!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఇక ఆ సమస్యలకు చెక్!!
నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.25 వేలు.. ఇలా చేయండి! ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ రాదు!
మందు బాబులకు షాక్ - మద్యం ధరల పెంపు! ఒక్క బీరు ఎంతంటే..?
వరదల ప్రాంతంలో సేవ చేయడమే ఐఏఎస్ అధికారుల బాధ్యత! వెళ్లాల్సిందే" అంటు క్యాట్ కీలక నిర్ణయం!
48 గంటల్లో అత్యాచార నిందితులను అరెస్టు చేసిన పోలీసులు! ఘోర ఘటనకు కఠిన జవాబు-హోం మంత్రి!
ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్! ఆ రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు పథకం!
ఏపీ జిల్లాలకు నూతన ఇన్చార్జి మంత్రుల ఎంపిక! ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: