టెక్నాలజీని అన్ని రంగాల్లో ఉపయోగించుకోవాలి. అప్పుడే దాని వల్ల కలిగే ఫలితాలను అందరూ పొందగలరు ముఖ్యంగా పాడి రైతులు.. కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి కష్టాలు తీర్చేందుకు ఏపీ కూటమి ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది.. అదే.. లింగ నిర్ధారిత వీర్యం. ఇదేంటంటే.. పుట్టేవి పెయ్య దూడలే అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. పెయ్య దూడలు పుడితే.. రైతులకు లాభం. ఆ దూడలే పుట్టేలా చేస్తుంది లింగ నిర్ధారిత వీర్యం టెక్నాలజీ. ఈ టెక్నాలజీని ఉపయోగించి.. కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్ల ద్వారా పెయ్య దూడలే పుట్టేలా చేస్తున్నారు. ఈ టెక్నాలజీ 90 శాతం పర్ఫెక్టుగా పనిచేస్తోంది. పైగా ఇలా పుట్టే దూడలు పూర్తి ఆరోగ్యంతో ఉంటున్నాయి. ఐతే.. మీకు ఓ డౌట్ రావచ్చు. దూడలే ఎందుకు, ఎద్దులు, దున్నలు వద్దా? అని. కారణం మళ్లీ టెక్నాలజీయే. ఈమధ్య ఏపీ ప్రభుత్వం.. వ్యవసాయంలో టెక్నాలజీని మరింత పెంచింది. సబ్సిడీకి వ్యవసాయ పరికరాలను రైతులకు ఇస్తోంది. దాంతో వ్యవసాయంలో ఎద్దులు, దున్నల అవసరం లేకుండా పోతోంది.
ఇంకా చదవండి: విశాఖలో కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేశ్! ఇది అవాస్తవ కథనం - పరువునష్టం ఎంత తెలుసా?
రైతులు.. భవిష్యత్తులో పాల ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకొని.. పెయ్య దూడలను కొంటున్నారు. దీన్ని ప్రభుత్వం గమనించి, వెంటనే అలర్ట్ అయ్యింది. రైతుల కోసం కూటమి సర్కార్.. సెక్స్ సార్టెడ్ సెమన్ (లింగ నిర్ధారిత వీర్యం) టెక్నాలజీని తెచ్చింది. ఐతే, దీన్ని ఇదివరకు వైసీపీ ప్రభుత్వం కూడా తెచ్చింది. దీని ద్వారా కృత్రిమ గర్భధారణ చేస్తున్నారు, పెయ్య దూడలే పుట్టేలా చేస్తున్నారు. ఐతే.. ఈ ఇంజెక్షన్ను కూటమి ప్రభుత్వం సబ్సిడీ ధరకు ఇస్తోంది. అందువల్ల రైతులకు ఇది మేలు చేస్తోంది. పెయ్య దూడ పెద్దయ్యాక.. రోజూ దాదాపు 8 లీటర్ల పాలు ఇస్తుంది. లీటర్ పాలు రూ.60 అనుకుంటే.. 8 లీటర్లకు రూ.480 వస్తుంది. ఇలా నెలకు రూ.14,400 అదే సంవత్సరానికి రూ.1,72,800 ఆదాయం వస్తుంది. గేదె 8 పిల్లలు పెడితే.. వాటి ద్వారా కూడా.. 3 ఏళ్ల తర్వాత భారీగా ఆదాయం వస్తుంది. అందుకే.. పాడి రైతులు.. పెయ్య దూడలనే కోరుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వం లింగ నిర్ధారిత వీర్యం టెక్నాలజీని సబ్సిడీ ధరకు ఇస్తోంది. ఒక్క ఇంజక్షన్ ధర రూ.1,350 కాగా, రైతులకు రూ.500కి ఇస్తోంది. ఐతే.. కృత్రిమ పెయ్య దూడ కోసం 2 సార్ల వరకూ ఇంజెక్షన్ ఇస్తారు. అప్పటికీ గర్భధారణ జరగకపోతే, మనీ వెనక్కి ఇస్తారు. ఇప్పుడు ఏపీలోని జిల్లాల్లో ఇది అమలవుతోంది. అందువల్ల పాడి రైతులు.. పశుపోషణ శాఖ అధికారులను కలిసి.. ఈ ప్రయోజనం పొందవచ్చు. రైతులకు అన్ని అంశాలపైనా అధికారులు అవగాహన కల్పిస్తారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నేడు చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం! ఆ నేతల గుండెల్లో గుబులు! ప్రజాప్రతినిధులకు కీలక సూచనలు!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఇక ఆ సమస్యలకు చెక్!!
నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.25 వేలు.. ఇలా చేయండి! ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ రాదు!
మందు బాబులకు షాక్ - మద్యం ధరల పెంపు! ఒక్క బీరు ఎంతంటే..?
వరదల ప్రాంతంలో సేవ చేయడమే ఐఏఎస్ అధికారుల బాధ్యత! వెళ్లాల్సిందే" అంటు క్యాట్ కీలక నిర్ణయం!
48 గంటల్లో అత్యాచార నిందితులను అరెస్టు చేసిన పోలీసులు! ఘోర ఘటనకు కఠిన జవాబు-హోం మంత్రి!
ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్! ఆ రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు పథకం!
ఏపీ జిల్లాలకు నూతన ఇన్చార్జి మంత్రుల ఎంపిక! ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు!
155 వైన్ షాపులకు దరఖాస్తు చేసిన ఢిల్లీ వ్యాపారి! చివరకు ఎన్ని షాపులు దక్కాయంటే!
జుపిటర్ మీదా బతికేద్దాం! రూ. 43,700 కోట్లతో నాసా వ్యోమనౌక ప్రయోగం!
ఒక్కో మహిళకు రూ.3 వేలు.. ప్రభుత్వం దీపావళి పండుగ కానుక అదరహో! అర్హతలు ఏంటివి?
మీ బెంగళూరులో ఏమో కానీ... ఇక్కడ మాత్రం! జగన్ కు టీడీపీ కౌంటర్! ఏ నిమిషమైనా తాడేపల్లి కొంప వరకు!
ఏపీలో మద్యం దుకాణాల కోసం నేడే లాటరీ! అనంతపురం జిల్లాలో 12 షాపులకు అతి తక్కువగా!
మంత్రి కొండా సురేఖను వదలని వివాదాలు! అధికారులపై ఆగ్రహం వ్యక్తం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: