తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. లడ్డూ వివాదంలో దాఖలైన పిటిషన్లపై రేపు (అక్టోబరు 4) విచారణ కొనసాగించనున్నారు. జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ నేడు మరో కేసును విచారించాల్సి ఉండడంతో, లడ్డూ కేసును శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వాయిదా వేశారు.
ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10
ఇవాళ ఓ ముఖ్యమైన కేసు విచారణ ఉందని, లడ్డూ కేసు విచారణ కోసం ఆ కేసును ఆపడం సరికాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం ఇవాళ మరో కేసుపై విచారణ చేపట్టాలని నిర్ణయించింది. లడ్డూ కేసును రేపటికి వాయిదా వేసింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇంకా చదవండి: ఏపీలో పారా క్రీడల అభివృద్ధికి లోకేశ్ హామీ! రాష్ట్రంలో పారా క్రీడల అభివృద్ధికి!
లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరపాలంటూ ఇటీవల బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ వేయడం తెలిసిందే. వైసీపీ రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఈ వివాదంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై సెప్టెంబరు 30న విచారణ జరిపిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను అక్టోబరు 3కి వాయిదా వేసింది. అయితే, నేడు ఓ కీలకమైన కేసు ఉన్నందున లడ్డూ వ్యవహారంపై విచారణ సాధ్యపడలేదు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గుడ్న్యూస్ చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం! తాను చేసిన పనికి గుర్తింపు!
హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరు? ఎందుకు చేశారు..! అసలేం జరిగింది..
చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు!
ఏపీ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! నియామక ప్రక్రియ వేగవంతం! హోం శాఖ అనిత కీలక ప్రకటన!
రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలో!
ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!
టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: