మహిళలకు గుడ్ న్యూస్. ఏంటని అనుకుంటున్నారా.. ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. ఇందుకు అప్లై చేసుకోవడానికి గడువు కూడా ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. మహిళలకు ఊరట కలిగే ప్రకటన చేసింది. దీని వల్ల చాలా మందికి ఊరట లభించనుంది. మహరాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అదిరే స్కీమ్ అందిస్తోంది. లడ్కి బహిన్ యోజన స్కీమ్ను అమలు చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం గడువు పొడిగించింది. ఈ స్కీమ్లో చేరేందుకు ప్రభుత్వం మరింత గడువు ఇచ్చింది.సెప్టెంబర్ 30 వరకు ఈ స్కీమ్ల చేరొచ్చని వెల్లడించింది. ఈ పథకం కింద అర్హత కలిగిన మహిళలు నెలకు రూ. 1500 పొందొచ్చు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అదితి టత్కరే తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. సాధారణంగా అయితే ఈ స్కీమ్లో చేరేందుకు జూలై 31 వరకే గడువు ఉండేది. అయితే తర్వాత దీన్ని ఆగస్ట్ 31 వరకు పొడిగించేశారు. ఇప్పుడు మరోసారి ఈ స్కీమ్లో చేరేందుకు గడువును ఈ నెల చివరి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. లబ్ధిదారుల నుంచి అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తుండటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
ఇంకా చదవండి: జగన్ కు నాగబాబు ఘాటు కౌంటర్ - ఏది మ్యాన్ మేడ్ డిజాస్టర్? అప్పట్లో ఈ ఘటన వల్ల 15 మంది గల్లంతుకావడం!
ముఖ్యమంత్రి లడ్కి బహిన్ యోజన పథకాన్ని ఏక్నాథ్ షిండే ప్రభుత్వం మహిళల సంక్షేమంలో భాగంగా తీసుకువచ్చింది. జూన్ నెల చివరిలో తీసుకువచ్చిన బడ్జెట్లో ఈ స్కీమ్ కు సంబంధించిన అంశాన్ని ప్రకటించారు. ఈ పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ. 46 వేల కోట్ల మేర భారం పడనుంది. ఈ స్కీమ్ కింద పెళ్లి చేసుకున్న మహిళలు, వితంతువులు వంటి వారు ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. వయసు 21 నుంచి 65 వరకు ఉండాలి. నిరాశ్రయులైన మహిళలకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. వార్షిక కుటుంబ ఆదాయం రూ. 2.5 లక్షలకు లోపు ఉండాలి. అయితే ఇలాంటి పథకాలే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలులోకి రావాల్సి ఉంది. అటు ఏపీలో చూస్తే.. మహిళలకు నెలకు రూ.1500 చొప్పున అందిస్తామని ఎన్నికల్లో భాగంగా టీడీపీప కూటమి హామీ ఇచ్చింది. అయితే ఈ స్కీమ్ ఎప్పటి నుంచి అమలు అవుతుందో తెలీదు. అలాగే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళలకు నెలకు రూ.2,500 అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఈ స్కీమ్ ఎప్పటి నుంచి అమలు అవుతుందో చూడాలి. అయితే పొరుగున ఉన్న మహరాష్ట్ర మాత్రం ఎన్నికల్లో హామీ ఇచ్చి.. ఇప్పుడు అమలు చేస్తోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు కూడా ఈ స్కీమ్ను వెంటనే అమలు చేస్తే తమకు ఊరట కలుగుతుందని పేర్కొంటున్నారు.
ఇంకా చదవండి: ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా? జగన్ పై కేంద్ర మంత్రి ఫైర్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైఎస్ జగన్కు మరో బిగ్ షాక్! వైసీపీకి రోజా గుడ్ బై? తన సోషల్ మీడియా ఖాతాల్లో!
ఇద్దరు కుమార్తెలున్న జగన్! కాదంబరీ జెత్వానీకి అండగా షర్మిల - మరో పోరాటానికి రెడీ!
శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. కొత్త పెన్షన్లకు డేట్ ఫిక్స్! ఇలా అప్లై చేసుకోండి!
అమెరికాలో దారుణం.. యువతిని కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి! అసలు ఏమి జరిగింది అంటే!
నటి కాదంబరి కేసులో కీలక మలుపు! ఆమెకు తాము అడ్వాన్స్ ఇవ్వలేదన్న కీలక సాక్షి!
ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవాలనుకునే వారికి కీలక సమాచారం! 10 ఏళ్ల తర్వాత ఆధార్ కార్డ్ను!
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త! కీలక ప్రకటన! తొలి దశలో 600 మహిళా సంఘాల ద్వారా!
వైఎస్ జగన్కు బిగ్ షాక్.. హైడ్రా నోటీసులు! హైదరాబాద్ ఇల్లు కూల్చివేత?
94 రైళ్లు రద్దు! మీరు వెళ్లే రైళ్లు ఈ లిస్టులో ఉన్నాయా?
క్రెడిట్ కార్డు వాడేవారికి అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు పిచ్చెక్కించే అప్డేట్! ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది మామ..!
యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్ అందిస్తున్న జియో! అది ఏమిటంటే..? ఫోన్ కాల్స్ చేసుకునే సమయంలో..
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త! కీలక ప్రకటన! తొలి దశలో 600 మహిళా సంఘాల ద్వారా!
వైఎస్ జగన్కు మరో బిగ్ షాక్! వైసీపీకి రోజా గుడ్ బై? తన సోషల్ మీడియా ఖాతాల్లో!
కీలక పదవుల్లో ఉన్నవారికి షాక్! ఏఎస్, డీఎస్, జేఎస్ లుగా ఉన్నవారికి బదిలీ ఆదేశాలు!
మందుబాబులకు అదిరే శుభవార్త! చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!
రూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: