ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు వైసీపీ ప్రభుత్వం.. రేషన్ కార్డు దారులకు సరుకులను బండిలో తెచ్చి ఇచ్చేది. ఐతే.. ఆ సమయంలో ఆ చుట్టుపక్కల ఇళ్లలో మనుషులు లేకపోతే, వారు ఆ సరుకులు తీసుకునే ఛాన్స్ ఉండేది కాదు. దాంతో వారికి ఇది ఇబ్బందిగా ఉండేది. మరికొంత మందికి మాత్రం ఇంటి దగ్గరకే రేషన్ సరుకులు రావడం అనుకూలంగా ఉండేది. ఐతే.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు రేషన్ షాపులపై దృష్టిపెట్టింది. ఆల్రెడీ కొత్త కార్డుల జారీ ప్రక్రియ ఓవైపు కొనసాగుతుంటే, మరోవైపు రేషన్ షాపుల సంఖ్యను కూడా పెంచాలని డిసైడ్ అయ్యింది. మరోవైపు కొత్త రేషన్ కార్డుల డిజైన్, జారీపైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఏపీలో ప్రస్తుతం 29వేలకు పైగా రేషన్ షాపులు ఉన్నాయి. ఐతే.. అవి ఏమాత్రం సరిపోవట్లేదనీ, సరుకుల కోసం లైన్లలో వేచి ఉండాల్సి వస్తోందని చాలా చోట్ల నుంచి కంప్లైంట్స్ వస్తుంటే, ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా కొత్తగా 4 వేల పంపిణీ కేంద్రాల్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందువల్ల త్వరలోనే ప్రజలకు ఈ క్యూ కష్టాలు తీరగలవు. కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఆల్రెడీ వాటిపై ప్రభుత్వ అధికారిక రాచముద్ర మాత్రమే ఉండేలా ప్లాన్ చేస్తోంది.
ఇంకా చదవండి: వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేత జంప్! వ్యక్తిగత కారణాలతోనా? లేక?
గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ ఫొటోలు ఉండేవి. వాటిని చూడగానే, టీడీపీకి కోపం వచ్చేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి.. కొత్త రేషన్ కార్డులకు రెడీ అయ్యింది. ఇక జగన్ ఫొటో ఉండదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డిజైన్ పూర్తవ్వగానే, కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేసే ఛాన్స్ ఉంది. ముందుగా కొత్తగా పెళ్లైన వారికి వెంటనే రేషన్ కార్డుల్ని ఇస్తారని తెలిసింది. రేషన్ కార్డు తీసుకోవాలనుకునే కొత్త జంట.. తప్పనిసరిగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇటు రేషన్ కార్డులు ఇస్తూనే మరోవైపు రేషన్ షాపులను ఎక్కడెక్కడ తెరవాలో ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. ఎక్కువ రేషన్ కార్డులు ఉన్న ప్రాంతాలు, ఎక్కువ సేపు ప్రజలు క్యూలో ఉండాల్సి వస్తున్న ఏరియాలను ఎంచుకొని, అక్కడ కొత్త షాపులను తెరుస్తారని తెలిసింది. దీనిపై ఏపీ పౌరసరఫరాల శాఖ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ప్రభుత్వం ముందు మరో సవాల్ కూడా ఉంది. కొన్ని రేషన్ షాపుల్లో ఇన్ఛార్డ్ డీలర్లు మాత్రమే ఉన్నారు. అక్కడ పర్మనెంట్ సొల్యూషన్ చూడాల్సి ఉంది. ప్రస్తుతం అలాంటి షాపుల్ని గుర్తించే పని జరుగుతోంది. అందువల్ల త్వరలోనే ఆ ఖాళీలను కూడా భర్తీ చేస్తారని అనుకోవచ్చు. ఓ అంచనా ప్రకారం 6 వేలకుపైగా డీలర్ల పోస్టుల్లో ఖాళీలు ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారు.
ఇంకా చదవండి: మాజీ మంత్రి రోజాకు ఆట మొదలైంది! ఆడుదాం ఆంధ్రా లెక్కలు బయటకి వస్తే ఇక జైలుకే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
భార్య పేరుపై అప్పు తీసుకున్నారా.. అయితే మీకో శుభవార్త! ఆ వివరాలు మీ కోసం!
సామాన్యులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.4 లక్షలు! ప్రభుత్వం కీలక ప్రకటన! ఇక వారికి ఆ సమస్య పోయినట్టే!
ఢిల్లీ పదవికై నలుగురు నేతల పోటీ - చంద్రబాబు ఛాయిస్! ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో!
శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.20వేలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం! ఇక వారికి పండగే పండగ!
ఏపీలో మహిళలకు శుభవార్త మరో పథకాన్ని ప్రారంభిస్తున్న చంద్రబాబు! తానే నేరుగా సందర్శిస్తా!
వైసీపీకి మరో షాక్ - అరకు ఎంపీకి హైకోర్టు నోటీసులు! దానికి కారణం అదేనా!
వచ్చే నెల నుండి కొత్త రూల్! అలా చేస్తే సిమ్ కార్డ్ బ్లాక్!
ఫ్రీ హోల్డ్ పేరుతో చేసిన అక్రమాలపై ప్రభుత్వం రెడ్ అలర్ట్! ప్రజా భూములపై వైసీపీ నేతల దుర్వినియోగం!
రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి ఒకేసారి రూ.15 వేలు! ప్రభుత్వం కీలక ప్రకటన?
కూటమి సంచలన నిర్ణయం! ఎమ్మెల్సీ ఎన్నికకు దూరం! కారణం ఏంటి?
సుబానీ హోటల్ డ్రామా, చీకటి దందా వెలుగులోకి! డ్రగ్స్ తో గుంటూరు దద్దరిల్లింది!
సీఎం సంచలన నిర్ణయం.. సచివాలయ వ్యవస్థ పేరు మార్పు! కొత్త పేరు ఇదే! దానికి కారణం అదేనా?
దువ్వాడ కేసులో బిగ్ ట్విస్ట్! సూసైడ్కు చేసుకున్న మాధురి? అసలు ఏమి జరిగింది అంటే!
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వాడే వారికి అదిరే శుభవార్త! భారీ తగ్గింపు! ఆ వివరాలు మీకోసం!
రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన వారికి భారీ శుభవార్త! ఉచితంగానే.. ప్రభుత్వ బ్యాంక్ మతిపోయే ఆఫర్!
కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు? కేసినో సహా రెండు కేసుల్లో! మరో 22 మంది ఇతర వైసీపీ నేతలపై!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: