దేశంలోని రెండు రాష్ట్రాల్లో హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో రెండు, గుజరాత్లో ఒకటి నమోదైంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. హెచ్ఎంపీవీ విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలకు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ హెచ్ఎంపీవీ వ్యాప్తి చెందితే తీసుకోవాల్సిన చర్యలపై అన్ని ఆసుపత్రులు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ మంత్రి భరద్వాజ్ సూచించారు. ఈ వైరస్ కట్టడికి సంబంధించిన అంశాలపై ఢిల్లీ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఎప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరపాలన్నారు. ఈ హెచ్ఎంపీవీ వైరస్కు సంబంధించి ఎలాంటి ఎలాంటి కొత్త విషయాలు తెలిసినా తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఎలాంటి ఆదేశాలు, సూచనలు కావాలన్నా తనను వెంటనే ఫోన్లో సంప్రదించవచ్చన్నారు. ప్రతిరోజు మూడు ఆసుపత్రులను తనిఖీ చేసి సంబంధిత నివేదికలను తనకు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో కొత్త వైరస్ కేసులు.. వ్యాధి లక్షణాలు 3 నుంచి 10 రోజుల్లోగా..! ఆరోగ్యశాఖ స్పందన ఇదే..
అమెరికా ప్రజలకు ప్రభుత్వం భారీ హెచ్చరిక! ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర..! జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే..
పిన్నెల్లికి మరో షాక్! హైదరాబాద్ లో ప్రధాన అనుచరుడు అరెస్ట్!
ఏపీలో కలకలం.. ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్!
ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న లోకేశ్! కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు..
ఏపీలో ప్రధాని మోదీ పర్యటన! ఎప్పుడు? ఎందుకు..?
పవన్ కల్యాణ్ గారే రియల్ గేమ్ చేంజర్! ర్యాలీ గుర్తొస్తోందన్న రామ్ చరణ్..
లోకేశ్: విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే! ఎప్పుడూ టఫ్ టాస్క్ తీసుకుంటా..
ఆ మూడు తేదీల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలని అనుకోవద్దు! భక్తులకు టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి!
ఏపీలో ఆ 10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల!
ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు! 46 ఏళ్ల రికార్డు బద్దలు..
తల్లికి వందనం పథకం అమలుకు డేట్ ఫిక్స్! మంత్రి కీలక ప్రకటన!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: