విజయవాడలో ఇద్దరు బాలికలు కనిపించకుండా పోవడంతో కలకలం రేగింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన బాలికలు ఎంతకూ తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలను వెతికి తీసుకురావాలంటూ కన్నీటితో పోలీసులను ప్రాధేయపడుతున్నారు. దీంతో కనిపించకుండా పోయిన బాలికల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల సాయంతో బాలికలు ఎక్కడికి వెళ్లారనేది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలికలు ఇద్దరూ విజయవాడలోని స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నారని పోలీసులు తెలిపారు.
ఇంకా చదవండి: ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న లోకేశ్! కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు..
బాలికల మిస్సింగ్ సమాచారంతో తొలుత స్థానికంగా గాలించినా ఫలితం లేకుండా పోయిందని వివరించారు. దీంతో బాలికల ఇళ్లకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించామన్నారు. అయినప్పటికీ బాలికలు ఎటువైపు వెళ్లారనే విషయం తెలియరాలేదని చెప్పారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు ఉద్ధృతం చేసినట్లు పోలీసులు వివరించారు. సాధ్యమైనంత తొందరగా బాలికలను వెతికి పట్టుకునేందుకు ఆరు బృందాలుగా ఏర్పడి వెతుకుతున్నట్లు తెలిపారు. బాలికలను క్షేమంగా తల్లిదండ్రుల దగ్గరకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో ప్రధాని మోదీ పర్యటన! ఎప్పుడు? ఎందుకు..?
పవన్ కల్యాణ్ గారే రియల్ గేమ్ చేంజర్! ర్యాలీ గుర్తొస్తోందన్న రామ్ చరణ్..
లోకేశ్: విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే! ఎప్పుడూ టఫ్ టాస్క్ తీసుకుంటా..
ఆ మూడు తేదీల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలని అనుకోవద్దు! భక్తులకు టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి!
ఏపీలో ఆ 10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల!
ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు! 46 ఏళ్ల రికార్డు బద్దలు..
తల్లికి వందనం పథకం అమలుకు డేట్ ఫిక్స్! మంత్రి కీలక ప్రకటన!
ఇకపై తెలుగులోనూ ఉత్తర్వులు ఇవ్వాలి! ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!
HDFC నుంచి మరో 2 కొత్త పథకాలు! రూ.100 ఉంటే చాలు! పూర్తి వివరాలు ఇవే!
రూ.10 వేలలోపు ధరలో... మంచి శాంసంగ్ ఫోన్లు ఇవే! వాటి ధరలు మారే అవకాశం.. Don't Miss!
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! మరో కొత్త రైల్వే లైను ప్రకటించిన కేంద్రం!
ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు! రేపటి నుంచి ఆ పథకం అమలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: