మహిళల్లో రొమ్ము క్యాన్సర్ సంభవం వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 1,62,468 మంది మహిళలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే ఇది సరైన సమయంలో గుర్తించి.. చికిత్స చేస్తే 90% మంది మహిళలు కోలుకుంటారని.. సీనియర్ వైద్యులు విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డైరెక్టర్.. కె రాంబాబు తెలిపారు. అయితే జాగ్రత్తలు తీసుకోకపోతే ఎంత ప్రమాదమైన క్యాన్సర్ అని తెలుపుతున్నారు. అత్యధికంగా 30 సంవత్సరాల లోపు వారికి, 52 నుంచి 64 సంవత్సరాల మధ్య వయస్సు వారికి ఎక్కువ రోమ్ము క్యాన్సర్ వస్తుందని తెలిపారు. ఈ వయసులో ఉన్న మహిళలు జాగ్రత్తగా చూసుకోవాలని తెలుపుతున్నారు. ఇక రొమ్ము క్యాన్సర్ లక్షణాలు చూస్తే.. స్నానం చేసేటప్పుడు చిన్న కణితిలా కనిపించి, నొప్పి వచ్చిన డాక్టర్ ని సంప్రదించాలని అన్నారు. నొప్పి తీవ్రతను బట్టి ఏ స్టేజిలో ఉందో వైద్యులు సూచిస్తారని తెలిపారు. స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉంటే వైద్య పరీక్షలు చేసి అనంతరం చికిత్స అందిస్తారని అంటున్నారు. స్టేజ్ 3 , స్టేజ్ 4 లో ఉంటే తీవ్ర ఇబ్బందులు పడతారని అంటున్నారు. దీని వలన వేరే అవయవాలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉందని తెలిపారు.
ఇంకా చదవండి: అధిక కొలెస్ట్రాల్ తో గుండెకే కాదు! ఈ అవయవాలకు కూడా ప్రమాదమే!
ఇక 4వ స్టేజ్ లో ఉంటే మాత్రం ప్రాణానికి ప్రమాదమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రొమ్ము క్యాన్సర్ పై అధిక శాతం అవగాహన కల్పిస్తుందని అంటున్నారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం పురస్కరించుకొని విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నందు రొమ్ము క్యాన్సర్ పై వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామనిడైరెక్టర్ డాక్టర్ కె. రాంబాబు లోకల్ 18 తో తెలిపారు. ఈ శిబిరంలో రొమ్ము క్యాన్సర్ నిర్ధారించే వైద్య పరీక్షలను నిర్వహించామని తెలిపారు. అవసరమైన వారికి ఉచితంగా బ్రెస్ట్ ఆల్ట్రా సౌండ్, బయాప్సీ వైద్య పరీక్షలు చేయటంతో పాటు మందులు కూడా ఉచితంగా అందజేశామని చెప్పారు. వచ్చే మంగళవారం కూడా విమ్స్ ఆస్పత్రి నందు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు ఓపి బ్లాక్ నందు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని క్యాన్సర్ పై తమకు ఉన్న అపోహలను పోగొట్టుకోవాలని కోరారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రోజా చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ఫైర్! ఏకపక్షంగా తీర్పు ఇచ్చినా సిగ్గు రాలేదా - తమ ప్రభుత్వం వారి ఆచూకీ!
ఏపీపై ‘దానా’ తుఫాన్ దండయాత్ర.. 4 రోజులు అత్యంత భారీ వర్షాలు! ఆ జిల్లాల వారికి అలర్ట్!
సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన! ఇళ్లు కట్టుకోవాలనుకునే వారికి బంపర్ ఆఫర్.!
దోచుకుని దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ! జగన్ పై షర్మిల ఫైర్ - రాజీ చర్చల ప్రచారం వేళ..!
మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! దీపావళి కానుక అదరహో! ఆ వివరాలు మీ కోసం!!
వైసీపీకి షాక్.. మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు అరెస్ట్! ఎందుకో తెలుసా?
రూ.1 కట్టక్కర్లేదు.. ఏపీలో వీళ్లందరికీ ఉచితంగానే కరెంట్! ప్రభుత్వం మాస్టర్ ప్లాన్!
ఉత్తరాంధ్రకు భారీ వర్షాల సూచన! మత్స్యకారులకు సముద్రంలో వెళ్లవద్దని హెచ్చరిక!
పాకిస్థాన్ యువతిని ఆన్లైన్లో పెళ్లి చేసుకున్న బీజేపీ కార్పొరేటర్ కొడుకు! పెళ్లి కూతురు తరపువారు!
ఏపీలో మద్యం బాబుల సందడి! ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో!
ఆధార్ కార్డ్ ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! జిల్లాలలో 5 నుంచి 15 ఏళ్ల వయసు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: