RRB Technician: ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ అభ్యర్థులకు అలర్ట్..! ఎగ్జామ్ డేట్, షిఫ్ట్ వివరాలు వెల్లడి! Iran Israel War: ఇరాన్‌కు మద్దతుగా పాకిస్థాన్‌లో అల్లర్లు..! టియర్ గ్యాస్ ప్రయోగంతో దద్దరిల్లిన కరాచీ...! Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్...! తిరుమలలో కొత్తగా హైటెక్ అన్నప్రసాద భవనం! Chicken Price: చికెన్ ప్రియులకు షాక్! కేవలం వారం రోజుల్లోనే ఆకాశాన్ని తాకిన ధరలు..! Merit Students: టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్! టాప్ స్కోరర్లకు ఫ్రీ ట్రిప్ ప్రకటించిన ఎమ్మెల్యే! Hormuz Strait: యుద్ధ మేఘాల మధ్య హోర్ముజ్ జలసంధి...! ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు! AP Govt: దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్...! నేటి నుంచే ఉచిత బస్సు ప్రయాణం! T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్‌కు భారీ షాక్.. గెలిచినా ఇంటికే, సెమీస్‌కు దూసుకెళ్లిన కివీస్! Iran Crisis: ఇరాన్‌లో కూడా అమెరికా 'పపెట్' ప్రభుత్వం? యుద్ధం వెనుక అసలు వ్యూహం ఇదేనా! Khamenei: అమెరికా దాడుల్లో ఖమేనీ మరణించారా? ఇరాన్ నిశ్శబ్దం వెనుక అసలు కారణం ఏంటి? RRB Technician: ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ అభ్యర్థులకు అలర్ట్..! ఎగ్జామ్ డేట్, షిఫ్ట్ వివరాలు వెల్లడి! Iran Israel War: ఇరాన్‌కు మద్దతుగా పాకిస్థాన్‌లో అల్లర్లు..! టియర్ గ్యాస్ ప్రయోగంతో దద్దరిల్లిన కరాచీ...! Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్...! తిరుమలలో కొత్తగా హైటెక్ అన్నప్రసాద భవనం! Chicken Price: చికెన్ ప్రియులకు షాక్! కేవలం వారం రోజుల్లోనే ఆకాశాన్ని తాకిన ధరలు..! Merit Students: టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్! టాప్ స్కోరర్లకు ఫ్రీ ట్రిప్ ప్రకటించిన ఎమ్మెల్యే! Hormuz Strait: యుద్ధ మేఘాల మధ్య హోర్ముజ్ జలసంధి...! ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు! AP Govt: దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్...! నేటి నుంచే ఉచిత బస్సు ప్రయాణం! T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్‌కు భారీ షాక్.. గెలిచినా ఇంటికే, సెమీస్‌కు దూసుకెళ్లిన కివీస్! Iran Crisis: ఇరాన్‌లో కూడా అమెరికా 'పపెట్' ప్రభుత్వం? యుద్ధం వెనుక అసలు వ్యూహం ఇదేనా! Khamenei: అమెరికా దాడుల్లో ఖమేనీ మరణించారా? ఇరాన్ నిశ్శబ్దం వెనుక అసలు కారణం ఏంటి?

Chandrababu: సచివాలయంలో NRI సభ్యులతో సీఎం చంద్రబాబు ఆత్మీయ భేటీ! గల్ఫ్ కార్మికుల సమస్యలపై సానుకూల స్పందన..

Chandrababu intimate meeting NRI members: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలతో నేరుగా కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రజల అభిప్రాయాలను స్వయంగా వినడంపై ఆయన ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.

Published : 2026-02-28 16:03:00
  • పరిస్థితి విషమం.. నిరంతర సమీక్ష: ఇజ్రాయెల్ అధికారులతో టచ్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం..
     
  • ఇరాన్ ప్రతీకార దాడుల ముప్పు?: ఇజ్రాయెల్ లోని భారతీయులు బంకర్లకు దగ్గరగా ఉండాలని సూచన..

Chandrababu intimate meeting NRI members: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలతో నేరుగా కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రజల అభిప్రాయాలను స్వయంగా వినడంపై ఆయన ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 27 శుక్రవారం అమరావతి సచివాలయంలో అమెరికా, ఒమన్ దేశాలకు చెందిన ఎన్నారైలు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీని ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ సమన్వయం చేశారు.

అమెరికా మరియు ఒమన్ నుంచి వచ్చిన ఎన్నారైలను సీఎం ఆత్మీయంగా పలకరించారు. వారి కుటుంబాలు, వృత్తులు, వారు నివసిస్తున్న దేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు.

ఈ సమావేశంలో అమెరికా నుంచి ఆళ్ల వెంకట్, కొమ్మినేని ప్రసాద్, కండెరి భాస్కర్ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. అలాగే ఒమన్ నుంచి మహమ్మద్ ఇమామ్ పాల్గొన్నారు.

అమెరికా నుంచి వచ్చిన కండెరి భాస్కర్ తన కుమార్తె నవ్య అంతర్జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అని తెలిపారు. ఆమె 12 అంతర్జాతీయ, 20 జాతీయ టోర్నమెంట్లలో విజయం సాధించిందని చెప్పారు. ఆమె క్రీడా లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని వారు ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు.

ఇక గల్ఫ్ దేశాల్లో తెలుగు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఒమన్ నుంచి వచ్చిన మహమ్మద్ ఇమామ్ వివరించారు. ఏజెంట్ల మోసాలు, ఎంబసీ వద్ద పరిష్కారం కాని సమస్యలు, కార్మికులు పడే ఇబ్బందులను తెలియజేశారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. సమస్యను సమగ్రంగా పరిశీలించి, మోసపూరిత చర్యలను అరికట్టేందుకు తగిన చట్టపరమైన, పరిపాలనా చర్యలు ఎలా తీసుకోవాలో, సమగ్రంగా స్టడీ చేసి దానికి అవసరమైన కార్యాచరణను తయారు చేయవలసిందిగా ఎన్నారై టీడీపీ సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్‌ ను ఆదేశించారు. విదేశాలకు వెళ్లే కార్మికులకు రక్షణ కల్పించేందుకు బలమైన నియంత్రణ వ్యవస్థ అవసరమని ఆయన సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక మరియు అతిథ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైలు ఆసక్తి చూపుతున్నారని వారు తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పిస్తే మరింత మంది ముందుకు వస్తారని చెప్పారు. విదేశాల్లో ఉన్న అవకాశాలను తెలుగు యువత వినియోగించుకునేలా నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.

వారి సూచనలకు స్పందించిన సీఎం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టదలచిన ఎన్నారైలు స్పష్టమైన ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారితో సంబంధాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములు కావడాన్ని ప్రభుత్వం స్వాగతిస్తుందని, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని భరోసా ఇచ్చారు.

ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడే అవకాశం రావడం తమకు మరచిపోలేని అనుభవమని ఎన్నారైలు ఆనందం వ్యక్తం చేశారు.

Spotlight

Read More →