Merit Students: టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్! టాప్ స్కోరర్లకు ఫ్రీ ట్రిప్ ప్రకటించిన ఎమ్మెల్యే! AP Govt: దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్...! నేటి నుంచే ఉచిత బస్సు ప్రయాణం! Pawan Kalyan: వేట్లపాలెం ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి.. క్షేత్రస్థాయిలో మంత్రి కందుల దుర్గేష్‌ పర్యటన..!! AP Judicial Academy: ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.165 కోట్లతో ఏపీ జ్యుడీషియల్ అకాడమీ! మార్చి 1 న శంకుస్థాపన! AP Development: ఆత్మకూరులో మంత్రి ఆనం పర్యటన! గ్రామాల్లో మెరుగైన రవాణా సౌకర్యాలు..! Chandrababu: సచివాలయంలో NRI సభ్యులతో సీఎం చంద్రబాబు ఆత్మీయ భేటీ! గల్ఫ్ కార్మికుల సమస్యలపై సానుకూల స్పందన.. Atchannaidu: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం - మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.!! AP Politics: లడ్డూ కల్తీ పాపం నుంచి జగన్ తప్పించుకోలేరు..! మంత్రి బాల వీరాంజనేయస్వామి ఘాటు వ్యాఖ్యలు! Nimmala Ramanaidu: అభివృద్ధిని అడ్డుకునే వైసీపీ నేతలు..‌అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెడితే సహించం నిమ్మల హెచ్చరిక..! Nara Lokesh: విశాఖలో లోకేష్ ప్రజాదర్బార్.. సమస్యల పరిష్కారానికి అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు.! Merit Students: టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్! టాప్ స్కోరర్లకు ఫ్రీ ట్రిప్ ప్రకటించిన ఎమ్మెల్యే! AP Govt: దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్...! నేటి నుంచే ఉచిత బస్సు ప్రయాణం! Pawan Kalyan: వేట్లపాలెం ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి.. క్షేత్రస్థాయిలో మంత్రి కందుల దుర్గేష్‌ పర్యటన..!! AP Judicial Academy: ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.165 కోట్లతో ఏపీ జ్యుడీషియల్ అకాడమీ! మార్చి 1 న శంకుస్థాపన! AP Development: ఆత్మకూరులో మంత్రి ఆనం పర్యటన! గ్రామాల్లో మెరుగైన రవాణా సౌకర్యాలు..! Chandrababu: సచివాలయంలో NRI సభ్యులతో సీఎం చంద్రబాబు ఆత్మీయ భేటీ! గల్ఫ్ కార్మికుల సమస్యలపై సానుకూల స్పందన.. Atchannaidu: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం - మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.!! AP Politics: లడ్డూ కల్తీ పాపం నుంచి జగన్ తప్పించుకోలేరు..! మంత్రి బాల వీరాంజనేయస్వామి ఘాటు వ్యాఖ్యలు! Nimmala Ramanaidu: అభివృద్ధిని అడ్డుకునే వైసీపీ నేతలు..‌అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెడితే సహించం నిమ్మల హెచ్చరిక..! Nara Lokesh: విశాఖలో లోకేష్ ప్రజాదర్బార్.. సమస్యల పరిష్కారానికి అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు.!

Kandula Durgesh: బాధితుల ఇళ్ల వద్దే రూ. 20 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కులు స్వయంగా అందజేసిన మంత్రి!

Kandula Durgesh: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా వేట్లపాలెం గ్రామంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.

Published : 2026-03-01 13:52:00
  • వేట్లపాలెం బాణాసంచా దుర్ఘటన బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం..
     
  • మీ ఇంట్లో బిడ్డగా అండగా ఉంటామంటూ బాధిత కుటుంబాలను ఓదార్చిన మంత్రి కందుల దుర్గేష్..

Kandula Durgesh: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా వేట్లపాలెం గ్రామంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. వారిని చూసి మంత్రి దుర్గేష్ చలించిపోయారు.  ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున ప్రకటించిన ఎక్స్ గ్రేషియా చెక్కులను కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ జనసేన పార్టీ ఇంచార్జి మరియు డీసీసీబీ ఛైర్మన్  తుమ్మల రామస్వామి బాబులతో కలిసి అందించారు. గాలిలో కలిసిన ప్రాణాలు, గుండె కోత మిగిల్చిన విషాదంతో ఆ కుటుంబాల కళ్లల్లో గూడుకట్టుకున్న శోకాన్ని చూసి మంత్రి కందుల దుర్గేష్ కన్నీటి పర్యంతమయ్యారు.  

ఈ సందర్భంగా ప్రమాదంలో మరణించిన సామర్లకోటకు చెందిన దర్శిపాటి నాని(38), ఏడిద సంపత్ కుమార్(25), జి.మేడపాడు గ్రామానికి చెందిన గంపల మంగ(43), గంపల నాగరాజు(45), గూడపర్తికి చెందిన మందపల్లి చిన్ని(44), గొడత మహేష్(41), గొడత వీరవెంకట రమణ(48), కడింపల్లి ధనరాజు(55), పెదబ్రహ్మదేవం కి చెందిన మకర రాఘవమ్మ(55) ల కుటుంబసభ్యులకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ వారి గ్రామంలో సభ్యుల ఇంటికి వెళ్లి పరామర్శించి ప్రభుత్వం తరపున అండగా ఉంటామన్న భరోసా కల్పించారు. వారిని ఆప్యాయంగా దగ్గరకు తీసి ఓదార్చారు. 

పోయిన మనుషులను వెనక్కి తీసుకురాలేం కానీ ఆ కుటుంబాలు రోడ్డున పడకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెబుతూ వారి తరపున కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని, మీ ఇంట్లో ఒక బిడ్డగా, మీ అన్నదమ్ముడిగా తానున్నాను.. తమ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని బరువెక్కిన గుండెతో మంత్రి కందుల దుర్గేష్ చెక్కులు పంపిణీ చేయడం పలువురిని కంటతడి పెట్టించింది..  కేవలం చెక్కులు ఇచ్చి వెళ్లడం కాకుండా, ప్రతి ఇంటి లోపలికి వెళ్లి వారి కష్టసుఖాలను మంత్రి దుర్గేష్ అడిగి తెలుసుకున్నారు.ప్రమాదానికి గల కారణాలను విచారించి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు
 
ఈ పర్యటనలో స్థానిక నాయకులు, ప్రభుత్వ అధికారులు, కూటమి కార్యకర్తలు పాల్గొని బాధితులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Spotlight

Read More →