Village History: కృష్ణా–ఏలూరు సరిహద్దులో ప్రత్యేక గ్రామం…! పేరు మాత్రం రెండు విధాలుగా! Four Stars Of Destiny: మాజీ ఆర్మీ చీఫ్ పుస్తకం...! కేంద్రం పరిశీలనలో కొత్త రూల్! De-Dollarisation: డీ-డాలరైజేషన్ అంటే ఏమిటి? డాలర్‌కు ఎందుకు దూరమవుతున్న దేశాలు? ఆగస్టు 15 vs జనవరి 26... జెండా ఎగురవేసే విధానంలో తేడా ఇదే! ఆంధ్రప్రదేశ్‌లోని ఈ గ్రామం ఒకప్పుడు ఒక ప్రత్యేక దేశమని మీకు తెలుసా? Sea Tragedy: ఫిలిప్పీన్స్‌లో ఘోర నౌక ప్రమాదం...! సముద్రంలో మునిగిన ఫెర్రీ.. 100 మందికి పైగా గల్లంతు! అసలు ఈ రోజు అది లేకపోతే ఏమయ్యేది? ఆలోచించగలరా! Robot Army: యుద్ధ రంగంలో మనుషులకు బదులు యంత్రాలు..! భారత సైన్యంలో రోబోట్ విప్లవం! Padma Shri Awards: అన్‌సంగ్ హీరోలకు అద్భుత గౌరవం..! పద్మశ్రీ జాబితాలో ఇద్దరు తెలుగు హీరోలు! Netaji Subhash Chandra Bose: నాకు రక్తం ఇవ్వండి నుంచి ఆజాద్ హింద్ ఫౌజ్ వరకు... నేతాజీ గాథ! Village History: కృష్ణా–ఏలూరు సరిహద్దులో ప్రత్యేక గ్రామం…! పేరు మాత్రం రెండు విధాలుగా! Four Stars Of Destiny: మాజీ ఆర్మీ చీఫ్ పుస్తకం...! కేంద్రం పరిశీలనలో కొత్త రూల్! De-Dollarisation: డీ-డాలరైజేషన్ అంటే ఏమిటి? డాలర్‌కు ఎందుకు దూరమవుతున్న దేశాలు? ఆగస్టు 15 vs జనవరి 26... జెండా ఎగురవేసే విధానంలో తేడా ఇదే! ఆంధ్రప్రదేశ్‌లోని ఈ గ్రామం ఒకప్పుడు ఒక ప్రత్యేక దేశమని మీకు తెలుసా? Sea Tragedy: ఫిలిప్పీన్స్‌లో ఘోర నౌక ప్రమాదం...! సముద్రంలో మునిగిన ఫెర్రీ.. 100 మందికి పైగా గల్లంతు! అసలు ఈ రోజు అది లేకపోతే ఏమయ్యేది? ఆలోచించగలరా! Robot Army: యుద్ధ రంగంలో మనుషులకు బదులు యంత్రాలు..! భారత సైన్యంలో రోబోట్ విప్లవం! Padma Shri Awards: అన్‌సంగ్ హీరోలకు అద్భుత గౌరవం..! పద్మశ్రీ జాబితాలో ఇద్దరు తెలుగు హీరోలు! Netaji Subhash Chandra Bose: నాకు రక్తం ఇవ్వండి నుంచి ఆజాద్ హింద్ ఫౌజ్ వరకు... నేతాజీ గాథ!

India Alert: చైనా–పాక్ వ్యూహాత్మక ముప్పు…! రెండు సరిహద్దుల నుంచి భారత్‌పై ఒత్తిడి!

 దక్షిణ ఆసియాలో చైనా తన వ్యూహాత్మక ఆటను మరింత పదునుపెడుతోంది. ఒకవైపు భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తున్నప్పటి

Published : 2025-12-26 09:44:00
Chandrababu: నేడు తిరుపతి పర్యటనకు సీఎం చంద్రబాబు!

దక్షిణ ఆసియాలో చైనా తన వ్యూహాత్మక ఆటను మరింత పదునుపెడుతోంది. ఒకవైపు భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, మరోవైపు పాకిస్థాన్‌తో కలిసి భారత భద్రతపై ఒత్తిడి పెంచుతోందని అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన తాజా వార్షిక రక్షణ నివేదికలో చైనా–పాక్ సైనిక భాగస్వామ్యంపై కీలక అంశాలను స్పష్టంగా ప్రస్తావించింది. ఈ భాగస్వామ్యం కేవలం ద్వైపాక్షిక సహకారం కాదని, ప్రాంతీయ శక్తి సమీకరణాలపై దీర్ఘకాల ప్రభావం చూపే అంశమని పెంటగాన్ విశ్లేషించింది.

Gold Rates: అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పెరిగిన బంగారం ధర! ఈరోజు ఎంతంటే!

నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా చైనాకు ఉన్న సైనిక భాగస్వాముల్లో పాకిస్థాన్ అత్యంత విశ్వసనీయమైనది, స్థిరమైనది. ఆయుధాల విక్రయం, ఉమ్మడి ఆయుధ ఉత్పత్తి, సైనిక శిక్షణ, సాంకేతిక బదిలీల్లో ఇరు దేశాల మధ్య సహకారం ఎప్పటికప్పుడు పెరుగుతోంది. పాకిస్థాన్ సైనిక ఆధునికీకరణలో చైనా తయారు చేసిన యుద్ధ విమానాలు, ట్యాంకులు, నౌకలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నివేదిక పేర్కొంది. గగనతల, భూతల, నావికా రంగాల్లో చైనా అందిస్తున్న ఆధునిక ఆయుధ వ్యవస్థలు పాకిస్థాన్ యుద్ధ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతున్నాయని పెంటగాన్ అంచనా వేసింది.

ఏపీలో ఆ ప్రాంతానికి దశ తిరిగినట్లే! గ్రేటర్ సిటీగా 7 మండలాలు,50 కి పైగా గ్రామాలు విలీనం!

ఈ చైనా–పాక్ భాగస్వామ్యం వల్ల భారత్‌కు ఉత్తర సరిహద్దులో చైనా నుంచి, పశ్చిమ సరిహద్దులో పాకిస్థాన్ నుంచి ఒకేసారి ఒత్తిడి పెరుగుతోందని నివేదిక హెచ్చరించింది. ఏదైనా సంక్షోభ పరిస్థితి తలెత్తితే, భారత్ రెండు సరిహద్దులను ఒకేసారి కాపాడుకోవాల్సిన క్లిష్టమైన సవాల్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషించింది. అక్టోబర్ 2024లో ఎల్‌ఏసీ వెంబడి బలగాల ఉపసంహరణకు చైనా అంగీకరించినప్పటికీ, ఇరు దేశాల మధ్య అపనమ్మకం ఇంకా కొనసాగుతోందని పేర్కొంది. భారత్–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడకుండా అడ్డుకోవడానికే చైనా సరిహద్దు చర్చలకు ముందుకొస్తోందన్న అభిప్రాయాన్ని కూడా పెంటగాన్ వ్యక్తం చేసింది.

LemonTea: రోజూ లెమన్ టీ తాగితే ఎన్నో అద్భుత ప్రయోజనాలు!

భూభాగ సరిహద్దులకే పరిమితం కాకుండా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో కూడా చైనా తన ప్రభావాన్ని విస్తరిస్తోంది. పాకిస్థాన్ తీర ప్రాంతాలకు సమీపంలో చైనా సైనిక అవసరాల కోసం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే అవకాశముందని నివేదిక హెచ్చరించింది. ఇది భారత నావికాదళ భద్రతకు కొత్త సవాళ్లను విసురుతుందని పేర్కొంది. అంతేకాదు, అరుణాచల్ ప్రదేశ్‌ను తన ‘కోర్ ఇంటరెస్ట్’గా చైనా పేర్కొంటూ భూభాగ వాదనలను కొనసాగించడం పరిస్థితిని మరింత సున్నితంగా మారుస్తోందని నివేదిక స్పష్టం చేసింది. దక్షిణ ఆసియాలో శక్తి సమతుల్యతను చైనా ఎలా మలుస్తుందన్న అంశం భారత్‌కు మాత్రమే కాకుండా, ప్రపంచ భద్రతకూ కీలకమవుతోందని పెంటగాన్ తన నివేదికలో హెచ్చరించింది.

Scholarship Released: విద్యార్థులకు శుభవార్త.. పెండింగ్ స్కాలర్‌షిప్‌లు రూ.71.67 కోట్లు విడుదల!
Ocean K-4: సముద్ర గర్భం నుంచి భారత్ గర్జన.. K-4 మిస్సైల్ టెస్ట్ సక్సెస్!
Holiday: రేపు బాక్సింగ్ డే సెలవు.. లాంగ్ వీకెండ్‌తో టూరిస్ట్ స్పాట్లకు రద్దీ!
Champion: ఫుట్‌బాల్ కల నుంచి స్వాతంత్ర్య పోరాటం వరకు.. ఛాంపియన్ కథ ఇదే!
Students Alert: జేఈఈ, నీట్‌ పరీక్షలకు కొత్త రూల్స్..! ఆధార్‌ అప్‌డేట్ తప్పనిసరి!
Students: గిరిజన విద్యార్థులకు ఏపీ సర్కార్ తీపికబురు..! రూ.100 కోట్ల స్కాలర్‌షిప్‌లు రిలీజ్!

Spotlight

Read More →