AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Road Safety: జాతీయ రహదారులపై ఓవర్‌లోడ్ వాహనాలకు చెక్.. ఏప్రిల్ 15 నుంచి కొత్త రూల్స్! IPL 2026: గెలుపు ఖాతా తెరిచేనా?: చెన్నైతో పోరులో కోల్‌కతా కీలక మార్పు.. వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ.. Bank Holidays: బ్యాంక్ పనులు ఉన్నాయా? అయితే ఈ సెలవుల లిస్ట్ మీ కోసమే...! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ రంగంలో ఓలా దూకుడు.. 5.2 kWh బ్యాటరీతో సరికొత్త రికార్డు! Samrat Chaudhary: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి! రేపే ప్రమాణ స్వీకారం... AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Road Safety: జాతీయ రహదారులపై ఓవర్‌లోడ్ వాహనాలకు చెక్.. ఏప్రిల్ 15 నుంచి కొత్త రూల్స్! IPL 2026: గెలుపు ఖాతా తెరిచేనా?: చెన్నైతో పోరులో కోల్‌కతా కీలక మార్పు.. వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ.. Bank Holidays: బ్యాంక్ పనులు ఉన్నాయా? అయితే ఈ సెలవుల లిస్ట్ మీ కోసమే...! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ రంగంలో ఓలా దూకుడు.. 5.2 kWh బ్యాటరీతో సరికొత్త రికార్డు! Samrat Chaudhary: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి! రేపే ప్రమాణ స్వీకారం...

PrajaVedhika: ప్రజా గ్రీవెన్స్‌లో అర్జీల వెల్లువ.. బాధితుల గోడు.. నేతల భరోసా! రేపటి ప్రజా వేదికలో పాల్గొననున్న ముఖ్య నాయకులు వీరే!

Praja Vedhika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రేపు (ఏప్రిల్ 15 , 2026) నిర్వహించనున్న "ప్రజా వేదిక" కార్యక్రమం పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్....

Published : 2026-04-14 18:32:00

Politics- ప్రజా గ్రీవెన్స్‌లో అర్జీల వెల్లువ.. పింఛన్లు, రేషన్ కార్డుల కోసం సామాన్యుల క్యూ…

భూ ఆక్రమణలపై ఉక్కుపాదం.. అధికారులను ఆదేశించిన మంత్రి అనగాని…

ప్రజాదర్బార్‌లో ఉద్యోగ వేట.. రెజ్యూమెలతో వచ్చిన నిరుద్యోగ యువత…

Prajavedhika: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా నిర్వహిస్తున్న 'ప్రజా గ్రీవెన్స్' కార్యక్రమంలో భాగంగా నేడు పలువురు బాధితులు తమ సమస్యలను నేతల దృష్టికి తీసుకెళ్లారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు సామాన్యుల నుండి అర్జీలను స్వీకరించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన బాధితులు తమకు జరుగుతున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని కోరారు.

ముఖ్యంగా తిరుపతి జిల్లా పీలేరుకు చెందిన ముంతాజ్ అనే మహిళ, తన భర్త చనిపోయిన తర్వాత మరిదులు ఆస్తిని అక్రమంగా పంచుకున్నారని ఫిర్యాదు చేశారు. రీ-సర్వే జరుగుతున్న తరుణంలోనైనా తన భర్త వాటా తనకు దక్కేలా చూడాలని ఆమె వేడుకున్నారు. మరోవైపు ప్రకాశం జిల్లా కంభంపాడు గ్రామంలో సాగునీటి కాలువను అక్రమంగా పూడ్చివేసి ఆక్రమించుకున్నారంటూ కె.వి. లావణ్య కుమారి ఫిర్యాదు చేశారు. దీనివల్ల పంటలు ఎండిపోతున్నాయని, కాలిబాటలు కూడా మూసివేయడం వల్ల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని ఆమె పేర్కొన్నారు.

నంద్యాల జిల్లా తువ్వపల్లె గ్రామానికి చెందిన వెంకటరమణ గౌడ్ వినూత్నమైన, బాధాకరమైన సమస్యను సభ ముందుంచారు. గ్రామంలో కేవలం ఒక గజం వెడల్పు గల స్థలంలోనే అంత్యక్రియలు నిర్వహించాల్సిన దుస్థితి ఉందని, పాత శవాల పైనే కొత్త వాటిని పూడ్చాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేనందున, ప్రైవేటు భూమినైనా కొనుగోలు చేసి కనీసం రెండు ఎకరాల స్మశాన వాటికను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మృతులకు గౌరవప్రదమైన అంత్యక్రియలు కల్పించాలని కోరారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన కృష్ణవేణి అనే మహిళ తన ఉద్యోగ సమస్యను వివరించారు. 25 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలలో వంట మనిషిగా పనిచేస్తున్న తనను, లంచం ఇవ్వలేదనే కారణంతో ఉపాధ్యాయుడు తొలగించారని వాపోయారు. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని తనను తీసేసి, డబ్బులు ఇచ్చిన వారికి ఆ అవకాశం కల్పించారని ఆమె ఆరోపించారు. వీటితో పాటు పింఛన్లు, రేషన్ కార్డులు, గృహ నిర్మాణాలు మరియు అనారోగ్య సమస్యలకు ఆర్థిక సాయం కోరుతూ అనేక మంది బాధితులు మంత్రులకు విన్నపాలు సమర్పించారు.

వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రి అనగాని సత్య ప్రసాద్ మరియు మంతెన రామరాజు, బాధితులకు తక్షణ పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అక్రమ ఆస్తుల వ్యవహారాలు మరియు ఆక్రమణలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, ఎక్కడా అవినీతికి తావులేకుండా పారదర్శకంగా న్యాయం చేస్తామని వారు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

తేదీ 15-04-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్

ప్రజా వేదిక షెడ్యూల్  
తేదీ: 15 ఏప్రిల్ 2026 (బుధవారం)  

స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి

1. శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు (గౌరవనీయ మంత్రి)

2. శ్రీ బుచ్చి రామ్ ప్రసాద్ గారు (ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్)

Spotlight

Read More →