AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Road Safety: జాతీయ రహదారులపై ఓవర్‌లోడ్ వాహనాలకు చెక్.. ఏప్రిల్ 15 నుంచి కొత్త రూల్స్! IPL 2026: గెలుపు ఖాతా తెరిచేనా?: చెన్నైతో పోరులో కోల్‌కతా కీలక మార్పు.. వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ.. Bank Holidays: బ్యాంక్ పనులు ఉన్నాయా? అయితే ఈ సెలవుల లిస్ట్ మీ కోసమే...! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ రంగంలో ఓలా దూకుడు.. 5.2 kWh బ్యాటరీతో సరికొత్త రికార్డు! Samrat Chaudhary: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి! రేపే ప్రమాణ స్వీకారం... AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Road Safety: జాతీయ రహదారులపై ఓవర్‌లోడ్ వాహనాలకు చెక్.. ఏప్రిల్ 15 నుంచి కొత్త రూల్స్! IPL 2026: గెలుపు ఖాతా తెరిచేనా?: చెన్నైతో పోరులో కోల్‌కతా కీలక మార్పు.. వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ.. Bank Holidays: బ్యాంక్ పనులు ఉన్నాయా? అయితే ఈ సెలవుల లిస్ట్ మీ కోసమే...! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ రంగంలో ఓలా దూకుడు.. 5.2 kWh బ్యాటరీతో సరికొత్త రికార్డు! Samrat Chaudhary: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి! రేపే ప్రమాణ స్వీకారం...

Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ భేటీ అయ్యారు. రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణపై వీరిద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, పకడ్బందీగా నిర్వహించాలని పవన్ కల్యాణ్ మంత్రికి కీలక దిశానిర్దేశం చేశారు.

Published : 2026-04-14 21:28:00
  • "10 కోట్ల మంది భక్తుల రాక": పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి కందుల దుర్గేష్‌తో పవన్ సమీక్ష..
     
  • Politics: "పవన్ కల్యాణ్ పర్యవేక్షణలో పుష్కర పనులు": పారిశుధ్యం, భద్రతపై స్పెషల్ ఫోకస్..

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ భేటీ అయ్యారు. రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణపై వీరిద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, పకడ్బందీగా నిర్వహించాలని పవన్ కల్యాణ్ మంత్రికి కీలక దిశానిర్దేశం చేశారు. ఈ భారీ ఆధ్యాత్మిక వేడుకకు దేశవ్యాప్తంగా సుమారు 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంత భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తులకు వసతి, రవాణా మరియు దర్శన విషయాల్లో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.

పుష్కరాల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించేందుకు త్వరలోనే రాజమండ్రిలో కూటమి నాయకులు మరియు ఉన్నతాధికారులతో పవన్ కల్యాణ్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఘాట్ల నిర్మాణం, పారిశుధ్యం మరియు భద్రతా అంశాలపై ఈ సమావేశంలో తుది నిర్ణయాలు తీసుకోనున్నారు. గోదావరి తీరాన్ని ఆధ్యాత్మిక శోభతో నింపేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ పర్యటన ద్వారా క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని సమీక్షించి, అవసరమైన నిధుల విడుదలపై కూడా స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.

డిప్యూటీ సీఎంతో భేటీ అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ, గోదావరి పుష్కరాలను ఉత్తరాదిలో జరిగే కుంభమేళా తరహాలో అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో భక్తులకు మరపురాని అనుభూతిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ప్రోత్సహించేలా ఈ పుష్కరాలను తీర్చిదిద్దుతామని ఆయన వెల్లడించారు.

Spotlight

Read More →