ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో రైతుల సంక్షేమం (Farmers Welfare) కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. పెట్టుబడి సాయం మొదలుకొని, పంట విక్రయాల వరకూ అండగా నిలుస్తూనే, ఇప్పుడు వ్యవసాయ అనుబంధ రంగాల (Allied Agricultural Sectors) పైనా దృష్టి పెట్టింది.
ముఖ్యంగా, పాడి పశువులు (Dairy Cattle) ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. గుంటూరు జిల్లా (Guntur District) రైతులకు శుభవార్త అందిస్తూ, ఏకంగా 256 పశువుల షెడ్లను (Cattle Sheds) మంజూరు చేసింది. ఈ పథకం కింద పశువుల షెడ్ల నిర్మాణం కోసం ఒక్కో లబ్ధిదారుడికి ఏకంగా రూ. 2 లక్షలు ఆర్థిక సాయం అందించనుంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చిన్న రైతులకు పశువుల షెడ్లు నిర్మించుకునేంత ఆర్థిక స్థోమత ఉండదు. దీనివల్ల వారు తమ పాడి పశువులను ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఆరుబయటే (Outdoors) కట్టేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఈ సమస్య పశువుల ఆరోగ్యంపై, పాల దిగుబడిపై ప్రభావం చూపుతుంది.
ఈ సమస్యల నుంచి రైతులకు ఉపశమనం కల్పించేందుకే ఏపీ ప్రభుత్వం ఈ పశువుల షెడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) లో భాగంగా ఈ షెడ్లను మంజూరు చేస్తున్నారు.
గుంటూరు జిల్లాలో పశువుల షెడ్లు నిర్మించుకోవాలనుకునే చిన్న, సన్నకారు రైతులకు ఇది ఒక మంచి అవకాశం. అర్హత మరియు దరఖాస్తు విధానం వివరాలు ఇలా ఉన్నాయి:

అర్హతలు:
ఐదు ఎకరాల లోపు భూమి ఉండే రైతులు ఇందుకు అర్హులు.
పాడి పశువులు తప్పనిసరిగా ఉండాలి.
అవసరమైన పత్రాలు:
తమ భూమికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకం
ఆధార్ కార్డు…
ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇచ్చిన జాబ్ కార్డు (Job Card) తప్పక ఉండాలి.
దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు తమ స్థానిక ఎంపీడీవో కార్యాలయాలను సంప్రదించాలి. మండలంలోని ఉపాధి హామీ పథకం ఏపీవో (APO) లేదా ఎంపీడీవో (MPDO) లను కలిసి దరఖాస్తు చేసుకునేందుకు సహకారం పొందవచ్చు. రైతులు తమ జిరాక్స్ పత్రాలతో ఎంపీడీవో కార్యాలయానికి వెళ్తే, వారే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేస్తారు.
పశువుల షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలబడుతోంది. ప్రభుత్వం లబ్ధిదారులకు రూ. 2 లక్షలు అందించనుంది. లబ్ధిదారులు ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఖాళీ స్థలంలో షెడ్లు నిర్మించుకోవాలి.
గతంలో ఈ కార్యక్రమం కింద రూ. 2.30 లక్షల వరకూ అందించేవారు. అయితే, ప్రస్తుతం ఉపాధి పథకం సాఫ్ట్వేర్ ఎన్ఐసీలో కేవలం రూ. 2 లక్షల వరకూ మాత్రమే అనుమతి ఇవ్వడం వల్ల ఈ మొత్తాన్ని రూ. 2 లక్షలకే పరిమితం చేసినట్లు అధికారులు తెలిపారు.
దరఖాస్తు గడువు పూర్తైన తర్వాత ఎంపీడీవోలు అర్హుల పేర్లను జిల్లా నీటి యాజమాన్య సంస్థకు (District Water Management Agency - DWMA) పంపిస్తారు. అనంతరం పశువుల షెడ్లు మంజూరు చేస్తారని అధికారులు వెల్లడించారు. అర్హులైన రైతులందరూ వెంటనే దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుందాం.