World Map: బే, గల్ఫ్, స్ట్రెయిట్,కెనాల్.. ప్రపంచ పటంలో వీటి మధ్య తేడా మీకు తెలుసా? AP Full Rains: హై అలెర్ట్.. ఏపీకి పిడుగుల ముప్పు.. రాగల 3 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం! Earthquake: ఇండోనేషియాలో 7.4 తీవ్రతతో భూకంపం.. తీరాన్ని తాకిన సునామీ అలలు! Weather Report: ఏప్రిల్‌లో మండుతున్న ఎండలు... కుండపోత వానలు! ... ప్రజలు తస్మాత్ జాగ్రత్త! Rain Alert: రాబోయే మూడు గంటల్లో ఈ నాలుగు జిల్లాలకు హై అలర్ట్!! పిడుగుల బీభత్సం.... 40-60కిమీ వేగంతో... AP Full Rains: ఆ జిల్లాలకు హై అలర్ట్.. రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు! ఏపీలో వాతావరణం ఉగ్రరూపం.. Full Rains: నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. 20కి పైగా జిల్లాల్లో.. IMD Alert: రాబోయే 24 గంటలు కీలకం.. ఏపీ వాతావరణంపై ఐఎండీ తాజా అప్‌డేట్! Fire Accident: రాజధానిలో కలకలం... సచివాలయ సమీపంలో భారీ అగ్నిప్రమాదం! Tiger Hunt: మళ్ళీ పులి కలకలం.. భయాందోళనలో స్థానిక గ్రామాలు! ఆ ప్రాంతాలకు రెడ్ అలెర్ట్... World Map: బే, గల్ఫ్, స్ట్రెయిట్,కెనాల్.. ప్రపంచ పటంలో వీటి మధ్య తేడా మీకు తెలుసా? AP Full Rains: హై అలెర్ట్.. ఏపీకి పిడుగుల ముప్పు.. రాగల 3 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం! Earthquake: ఇండోనేషియాలో 7.4 తీవ్రతతో భూకంపం.. తీరాన్ని తాకిన సునామీ అలలు! Weather Report: ఏప్రిల్‌లో మండుతున్న ఎండలు... కుండపోత వానలు! ... ప్రజలు తస్మాత్ జాగ్రత్త! Rain Alert: రాబోయే మూడు గంటల్లో ఈ నాలుగు జిల్లాలకు హై అలర్ట్!! పిడుగుల బీభత్సం.... 40-60కిమీ వేగంతో... AP Full Rains: ఆ జిల్లాలకు హై అలర్ట్.. రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు! ఏపీలో వాతావరణం ఉగ్రరూపం.. Full Rains: నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. 20కి పైగా జిల్లాల్లో.. IMD Alert: రాబోయే 24 గంటలు కీలకం.. ఏపీ వాతావరణంపై ఐఎండీ తాజా అప్‌డేట్! Fire Accident: రాజధానిలో కలకలం... సచివాలయ సమీపంలో భారీ అగ్నిప్రమాదం! Tiger Hunt: మళ్ళీ పులి కలకలం.. భయాందోళనలో స్థానిక గ్రామాలు! ఆ ప్రాంతాలకు రెడ్ అలెర్ట్...

AP Weather Updates: సోమవారం నుండి ఆ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షాలు.!!

AP Weather Updates: ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు ముదురుతున్నాయి. ఆదివారం రాష్ట్రంలోని 17 మండలాల్లో తీవ్ర వడగాలులు, 32 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

Published : 2026-04-04 20:55:00

AP Weather Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్ నెల ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో జనం విలవిలలాడుతున్నారు. తాజాగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ గారు రేపటి వాతావరణంపై కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 17 మండలాల్లో తీవ్రస్థాయిలో వడగాలులు వీస్తాయని, మరో 32 మండలాల్లో సాధారణ వడగాలుల ప్రభావం ఉంటుందని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస, హిరమండలం, విజయనగరంలోని గుర్ల, సంతకవిటి, మన్యం జిల్లాలోని పాలకొండ వంటి మండలాలు ఉన్నాయి. వీటితో పాటు పోలవరం, తూర్పుగోదావరి జిల్లాల్లో కూడా ఎండ వేడిమి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయనుంది. ఇప్పటికే నెల్లూరు, తిరుపతి, కృష్ణా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల మార్కును దాటేశాయి. శనివారం నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 41.2°C ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.

అయితే ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు ఒక వైపు ఉపశమనం కలిగించే వార్తను కూడా విపత్తుల సంస్థ వెల్లడించింది. దక్షిణ కోస్తాంధ్ర తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం మారనుంది. అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కూడా చిరుజల్లులు పడే ఛాన్స్ ఉంది. అయితే వర్షం పడే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున, పొలాల్లో పని చేసే రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని  హెచ్చరించారు.

వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రజలు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థ కోరింది. ముఖ్యంగా గర్భిణీలు, చిన్న పిల్లలు, వృద్ధులు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉన్నందున ఎండలో తిరగకూడదని సూచించారు. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి మంచినీరు ఎక్కువగా తాగాలని, లస్సీ, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు వంటి పానీయాలను తీసుకోవడం మంచిదని అధికారులు చెబుతున్నారు. ఎండ తగలకుండా బయటకు వెళ్లేటప్పుడు గొడుగు లేదా టోపీ ధరించాలని సూచించారు.

రైతులకు పిడుగుల హెచ్చరికను సీరియస్‌గా తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. వర్షం పడుతున్నప్పుడు ఆరుబయట ఉండటం ఏమాత్రం క్షేమకరం కాదని, సురక్షితమైన భవనాల కింద ఉండాలని తెలిపారు. వడగాలుల ప్రభావం ఉన్న మండలాల్లో స్థానిక యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండి, ప్రజలకు అవసరమైన అవగాహన కల్పించాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశించింది. ఈ విభిన్న వాతావరణ పరిస్థితుల్లో అప్రమత్తతే మనల్ని రక్షిస్తుందని ప్రఖర్ జైన్ స్పష్టం చేశారు.

Spotlight

Read More →