LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Entertainment

Singer Mangli: "తప్పు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం": సుబ్బారావు ఆరోపణలపై గాయని మంగ్లీ సవాల్!

Singer Mangli: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను సినీ గాయని మంగ్లీ కలిశారు. అడ్వకేట్ సుబ్బారావుకు, మంగ్లీకి మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, మైక్రోఫైనాన్స్ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని కోరుతూ మంగ్లీ తాజాగా సీపీ సజ్జన…

AndhraPravasi News Desk 2 min read
Singer Mangli: "తప్పు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం": సుబ్బారావు ఆరోపణలపై గాయని మంగ్లీ సవాల్!
  • cinema: మంగ్లీ ఫిర్యాదుతో రంగంలోకి సీపీ సజ్జనార్: వేధింపులపై కఠిన చర్యలకు విన్నపం..
     
  • మంగ్లీ వర్సెస్ సుబ్బారావు: ముదురుతున్న వివాదం.. పోలీసుల దర్యాప్తు వేగవంతం..

Singer Mangli: ప్రముఖ సినీ గాయని మంగ్లీ మరియు న్యాయవాది సుబ్బారావు మధ్య నెలకొన్న వివాదం మరో మలుపు తిరిగింది. మైక్రోఫైనాన్స్ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో తనపై సాగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని కోరుతూ మంగ్లీ మంగళవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను కలిసి రాతపూర్వక ఫిర్యాదు చేశారు. తాను కానీ, తన తమ్ముడు కానీ ఎలాంటి ఆర్థిక మోసాలకు పాల్పడలేదని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. కేవలం తన ప్రతిష్టను దిగజార్చేందుకే సుబ్బారావు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తనపై జరుగుతున్న వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కమిషనర్‌ను కోరారు. అదే సమయంలో, ఈ స్కామ్‌లో నిజంగా మోసపోయిన బాధితులకు న్యాయం చేయాలని, అసలు దోషులు ఎవరో తేల్చాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

గత నెల 22వ తేదీన సుబ్బారావు తనను కలిసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారని మంగ్లీ సంచలన ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో తనపై ఉన్న వ్యతిరేక వీడియోలను తొలగించాలంటే పది లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారని, అందుకు తాను అంగీకరించకపోవడంతోనే కక్షపూరితంగా ఇదంతా చేస్తున్నారని వివరించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోల్లో డబ్బుల కట్టలతో ఉన్న వ్యక్తి తన తమ్ముడు కాదని ఆమె క్లారిటీ ఇచ్చారు. తనకు పాటలు పాడటం తప్ప మరే ఇతర వ్యాపారాలు లేవని, ఈ వ్యవహారంలో తన తప్పు ఉందని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఆమె సవాల్ విసిరారు. కేవలం ప్రాచుర్యం కోసమే సుబ్బారావు తన పేరును వాడుకుంటూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మంగ్లీ మండిపడ్డారు.

మరోవైపు, ఈ వివాదంలో సుబ్బారావు ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో బాధితులతో కలిసి ఆయన నిరసన తెలిపిన సమయంలో పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షలో 27 ఎంజీ రీడింగ్ రావడంతో, ఆయన మద్యం సేవించి స్టేషన్‌లో హంగామా చేసినట్లు తేలిందని సమాచారం. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి స్టేషన్‌లో మద్యం సేవించి ప్రవర్తించిన తీరుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరస్పర ఆరోపణల నేపథ్యంలో పోలీసులు తదుపరి దర్యాప్తును వేగవంతం చేశారు.

Be the first to react

More Coverage

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం 3’ ఓటీటీ విడుదల తేద…

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: నటుడు సోనూ సూద్ ఇటీవల వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఈ ఆధునిక రైలు ప్రయాణం ఆయనన…