LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Entertainment

Manchu Vishnu: మొన్న త్రిష.. ఇప్పుడు నయనతార.. ఎంపీ అనుచిత ప్రసంగంపై మంచు విష్ణు తీవ్ర ఆగ్రహం.!

Manchu Vishnu: ప్రముఖ నటి నయనతారపై తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే ఎంపీ సి.వి. షణ్ముగం చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. రాజకీయ ప్రసంగాల్లోకి నటీనటుల పేర్లను లాగడంపై నటుడు మంచు విష్ణు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై సినీ, రాజకీయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతో…

AndhraPravasi News Desk 2 min read
Manchu Vishnu: మొన్న త్రిష.. ఇప్పుడు నయనతార.. ఎంపీ అనుచిత ప్రసంగంపై మంచు విష్ణు తీవ్ర ఆగ్రహం.!
  • రాజకీయ పంచ్‌ల కోసం నటులను వాడుకోవద్దు: ఎంపీకి 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు చురకలు..
     
  • నయనతారపై ఎంపీ షణ్ముగం వివాదాస్పద వ్యాఖ్యలు: రాజకీయాల్లో రేగుతున్న సెగలు!

Manchu Vishnu Reacts MPs Comments Nayanthara: ప్రముఖ నటి నయనతారపై తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే ఎంపీ సి.వి. షణ్ముగం చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ మరియు సినీ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. తమిళనాడులోని విల్లుపురంలో డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఒక నిరసన సభలో పాల్గొన్న ఎంపీ, ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రవేశపెట్టిన ‘మీ కలను చెప్పండి’ అనే పథకాన్ని విమర్శించే క్రమంలో హద్దులు దాటి మాట్లాడారు. అబ్దుల్ కలాం గారు కలలు కనమని చెప్పారని, ఇప్పుడు స్టాలిన్ మీ కలలు నెరవేరుస్తామంటున్నారని పేర్కొంటూ, ఒకవేళ ఎవరైనా తనకు నయనతార కావాలని లేదా ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటే ముఖ్యమంత్రి ఆ కలను నెరవేరుస్తారా అంటూ వ్యక్తిగత దూషణలకు దిగారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక ప్రజాప్రతినిధి బహిరంగ సభలో ఒక మహిళా నటిని ఉద్దేశించి ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. రాజకీయ ప్రసంగాల్లోకి లేదా ప్రచారాల్లోకి ఏమాత్రం సంబంధం లేని నటీనటుల పేర్లను లాగడం, ముఖ్యంగా మహిళా నటీమణులను కించపరిచేలా మాట్లాడటం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. తెరపై కనిపించే నటీనటులకు కూడా సమాజంలో గౌరవప్రదమైన స్థానం ఉంటుందని, వారికి వ్యక్తిగత కుటుంబ జీవితాలు ఉంటాయని గుర్తు చేశారు. కేవలం వార్తల్లో నిలవడానికి లేదా రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడానికి సినిమా రంగంపై ఇలాంటి అబాండాలు వేయడం తగదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు తమ హుందాతనాన్ని కాపాడుకోవాలని, మహిళల పట్ల గౌరవంగా మెలగాలని మంచు విష్ణు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

వివాదం ముదిరి సినీ పరిశ్రమ నుంచి నిరసనలు వ్యక్తమవ్వడంతో ఎంపీ షణ్ముగం ఎట్టకేలకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాను ఉద్దేశపూర్వకంగా నయనతారను విమర్శించాలని ఆ వ్యాఖ్యలు చేయలేదని, ప్రసంగం ప్రవాహంలో పొరపాటున ఆ మాటలు దొర్లాయని ఆయన సమర్థించుకున్నారు. అయితే, ఒక అగ్ర నటిని రాజకీయ విమర్శలకు వాడుకోవడం వెనుక ఉన్న సంకుచితత్వాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. రాజకీయాల్లో ఆరోగ్యకరమైన విమర్శలు ఉండాలి తప్ప, వ్యక్తిగత జీవితాలను కించపరిచేలా ఉండకూడదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Be the first to react

More Coverage

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం 3’ ఓటీటీ విడుదల తేద…

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: నటుడు సోనూ సూద్ ఇటీవల వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఈ ఆధునిక రైలు ప్రయాణం ఆయనన…