Sri Kalahasti: శ్రీకాళహస్తి భక్తులకు గుడ్ న్యూస్..! కొత్త గిరి ప్రదక్షిణ మార్గం అందుబాటులోకి...! Dakshina Kashi: దక్షిణ కాశీలో కొత్త శకం.. వర్చువల్ గా గిరి ప్రదక్షిణ పనులకు అంకురార్పణ! TTD Good News: తిరుమలలో భక్తులకు బంపర్ ఆఫర్..! వాహన పూజ నుంచి ఉపనయనం వరకు తక్కువ ఫీజులు Maha Shivaratri: శివరాత్రి రోజున రేగు పండ్లు ఎందుకు తింటారు..? పురాణం చెబుతున్న నిజం ఇదే..! తిరుమల అప్‌డేట్: కొండపై కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే? TTD: తిరుమల భక్తులకు ఊరట... లడ్డూల కోసం ఇక క్యాష్ అవసరం లేదు! శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందడి షురూ! ప్రత్యేకతలు ఇవే! తిరుమల భక్తులకు శుభవార్త... ఇక వాట్సాప్‌లోనే దర్శనం టికెట్లు! శ్రీశైల పాదయాత్ర భక్తులకు తీపి కబురు..! అటవీ మార్గంపై ప్రభుత్వం కీలక నిర్ణయం! Maha Shivaratri 2026: శివుడికి శంఖు పుష్పాలు సమర్పిస్తే ఇన్ని లాభాలా? Sri Kalahasti: శ్రీకాళహస్తి భక్తులకు గుడ్ న్యూస్..! కొత్త గిరి ప్రదక్షిణ మార్గం అందుబాటులోకి...! Dakshina Kashi: దక్షిణ కాశీలో కొత్త శకం.. వర్చువల్ గా గిరి ప్రదక్షిణ పనులకు అంకురార్పణ! TTD Good News: తిరుమలలో భక్తులకు బంపర్ ఆఫర్..! వాహన పూజ నుంచి ఉపనయనం వరకు తక్కువ ఫీజులు Maha Shivaratri: శివరాత్రి రోజున రేగు పండ్లు ఎందుకు తింటారు..? పురాణం చెబుతున్న నిజం ఇదే..! తిరుమల అప్‌డేట్: కొండపై కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే? TTD: తిరుమల భక్తులకు ఊరట... లడ్డూల కోసం ఇక క్యాష్ అవసరం లేదు! శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందడి షురూ! ప్రత్యేకతలు ఇవే! తిరుమల భక్తులకు శుభవార్త... ఇక వాట్సాప్‌లోనే దర్శనం టికెట్లు! శ్రీశైల పాదయాత్ర భక్తులకు తీపి కబురు..! అటవీ మార్గంపై ప్రభుత్వం కీలక నిర్ణయం! Maha Shivaratri 2026: శివుడికి శంఖు పుష్పాలు సమర్పిస్తే ఇన్ని లాభాలా?

అయోధ్య: రామ్ లల్లా ప్రాణప్రతిష్ట ఆహ్వానం అందుకున్న తెలుగు ప్రముఖులు వీరే!!

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట ప్రారంభోత్సవాని సంబంధించిన క్రతువులు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆరు వేల మంది ప్రముఖుల నడుమ ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా

Published : 2024-01-20 14:08:00

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట ప్రారంభోత్సవాని సంబంధించిన క్రతువులు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆరు వేల మంది ప్రముఖుల నడుమ ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. 22న జరిగే ప్రాణ ప్రతిష్ట పూజా కార్యక్రమ నిర్వహణ మొత్తం లక్ష్మీకాంత్ దీక్షితులు నిర్వహించనున్నారు.

ప్రారంభోత్సవానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను అయోధ్య ట్రస్టు ప్రతినిధులు ఆహ్వానాలు అందజేశారు. అట్టహాసంగా జరగబోయే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి అన్నిరంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య ముహూర్తం ఉంది. ఈ 84 సెకన్లలోనే అయోధ్య శ్రీ రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఇది దివ్యమైన మంగళమైన ముహూర్తం అని భక్తులు భావిస్తున్నారు.

ఆహ్వానం అందుకున్న తెలుగు ప్రముఖులు :

22న జరగనున్న రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలంటూ శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు ఆహ్వానం అందింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును సైతం అయోధ్య ట్రస్టు ఆహ్వానించింది. మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ దంపతులు, ప్రభాస్, అల్లు అర్జున్, దర్శక ధీరుడు రాజమౌళికి ఆహ్వానం అందింది.

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

భారత్ బయోటెక్ అధినేతలు క్రిష్ణఎల్లా, శాంత బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగేశ్వర్, యశోద హాస్పిటల్స్ ఛైర్మన్ దేవేందర్ రావు ఆహ్వానాలు అందాయి. బ్యాడ్మింట్ కోచ్ పుల్లెల గోపిచంద్, మాజీ క్రికెటర్ పూర్ణిమా రావు, భాగ్యనగర్ ఉత్సవ సమితి అధ్యక్షులు రాఘవరెడ్డి, చినజీయర్ స్వామికి అయోధ్య ట్రస్ట్ ఆహ్వానం పంపింది.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →