తిరుమల అప్‌డేట్: కొండపై కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే? TTD: తిరుమల భక్తులకు ఊరట... లడ్డూల కోసం ఇక క్యాష్ అవసరం లేదు! శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందడి షురూ! ప్రత్యేకతలు ఇవే! తిరుమల భక్తులకు శుభవార్త... ఇక వాట్సాప్‌లోనే దర్శనం టికెట్లు! శ్రీశైల పాదయాత్ర భక్తులకు తీపి కబురు..! అటవీ మార్గంపై ప్రభుత్వం కీలక నిర్ణయం! Maha Shivaratri 2026: శివుడికి శంఖు పుష్పాలు సమర్పిస్తే ఇన్ని లాభాలా? TTD: తిరుమలలో సంప్రదాయబద్ధంగా బాధ్యతలు.. టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర! CM Chandrababu: వెంకటేశ్వర స్వామి భక్తుడిగా వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత నాదే... సీఎం చంద్రబాబు! తిరుమల శ్రీవారి ఆనంద నిలయం నిర్మాణ రహస్యాలు! వేల సంవత్సరాల క్రితమే ఒక అద్భుత సైన్స్! తిరుమల లడ్డూ కల్తీకి చెక్..! టీటీడీ కీలక నిర్ణయం.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సూపర్ ల్యాబ్! తిరుమల అప్‌డేట్: కొండపై కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే? TTD: తిరుమల భక్తులకు ఊరట... లడ్డూల కోసం ఇక క్యాష్ అవసరం లేదు! శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందడి షురూ! ప్రత్యేకతలు ఇవే! తిరుమల భక్తులకు శుభవార్త... ఇక వాట్సాప్‌లోనే దర్శనం టికెట్లు! శ్రీశైల పాదయాత్ర భక్తులకు తీపి కబురు..! అటవీ మార్గంపై ప్రభుత్వం కీలక నిర్ణయం! Maha Shivaratri 2026: శివుడికి శంఖు పుష్పాలు సమర్పిస్తే ఇన్ని లాభాలా? TTD: తిరుమలలో సంప్రదాయబద్ధంగా బాధ్యతలు.. టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర! CM Chandrababu: వెంకటేశ్వర స్వామి భక్తుడిగా వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత నాదే... సీఎం చంద్రబాబు! తిరుమల శ్రీవారి ఆనంద నిలయం నిర్మాణ రహస్యాలు! వేల సంవత్సరాల క్రితమే ఒక అద్భుత సైన్స్! తిరుమల లడ్డూ కల్తీకి చెక్..! టీటీడీ కీలక నిర్ణయం.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సూపర్ ల్యాబ్!

అందరి చూపు అయోధ్య రామయ్య వైపే... వెళ్ళాలి అని ఉందా?? తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే

: ఉత్తరప్రదేశ్‌ అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత రామ్‌ లల్లా ప్రతిష్ఠాప

Published : 2024-01-11 11:56:00

: ఉత్తరప్రదేశ్‌ అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత రామ్‌ లల్లా ప్రతిష్ఠాపన ప్రక్రియను ప్రారంభించి, 10 రోజుల పాటు 'ప్రాణ ప్రతిష్ఠ' కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ ట్రస్టు నిర్ణయించింది. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు నాలుగు వేల మంది సాధువులు, 2,500 మంది ప్రముఖులు హాజరుకానున్నారు.

జనవరి 22న పవిత్ర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగనుంది. 23 నుంచి సాధారణ ప్రజలకు శ్రీరాముడి దర్శన భాగ్యం కల్పించనున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సైతం అయోధ్య రాముడిని దర్శించుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా రెండు రైళ్లు అయోధ్యకు చేరుకుంటాయి. 

యశ్వంతపుర నుంచి గోరఖ్‌పూర్ వెళ్లే రైలు (15024) కాచిగూడ మీదుగా అయోధ్యకు వెళ్తుంది. ప్రతి శుక్రవారం ఉదయం 10.50 నిమిషాలకు గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (15024) కాచిగూడలో బయల్దేరుతుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ధర్మవరం, అనంతపురం, కర్నూలు సిటీ, మహబూబ్ నగర్, కాచికూడా, ఖాజీపేట, సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్లలో ఆగుంది. 1690 కిలోమీటర్లు ప్రయాణించి శనివారం సాయంత్రం 4.30కు అయోధ్య చేరుకుంటుంది. 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

అలాగే తమిళనాడు లోని రామేశ్వరం నుంచి విజయవాడ  మీదుగా శ్రద్ధ సేతు ఎక్స్‌ప్రెస్ (22613) అయోధ్యకు వెళ్తుంది. ఈ రైలు విజయవాడలో ప్రతి సోమవారం రాత్రి 8.10 గంటలకు బయల్దేరి 1813 కిలోమీటర్లు ప్రయాణించి బుధవారం తెల్లవారుజామున 4.00 అయోధ్య జంక్షన్‌కు  చేరుకుంటుంది. గూడూరు, విజయవాడ, వరంగల్ స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది.  

దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు అయోధ్య పట్టణానికి పోటెత్తనున్నారు. యూపీ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలకూ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన భక్తులు రైలు మార్గంలో అయోధ్యకు చేరేందుకు వీలుగా రైల్వే సర్వీసులను భారీగా పెంచాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. రామ మందిరం తెరుచున్న తరవాత 100 రోజుల పాటు దేశంలోని పలు చోట్ల నుంచి 1000 రైళ్లు ప్రత్యేకంగా నడపనున్నట్టు వెల్లడించింది. 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →