Mountains: చలికాలం రాకముందే వెళ్లవలసిన అద్భుత పర్వత ప్రదేశాలు!

హైదరాబాద్ (Hyderabad) నుంచి బెంగళూరు (Bengaluru) వెళ్తున్న వి కావేరి ట్రావెల్స్‌కు (V Kaveri Travels) చెందిన ప్రైవేట్ బస్సు దగ్ధమైన ఘటన (Bus Fire Accident) దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘోర దుర్ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు (Passengers) సజీవ దహనం అయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో బస్సులో ప్రయాణించిన వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

Bastian: ఒక్క రాత్రికే రూ. 2-3 కోట్లు టర్నోవర్! ఎక్కడో తెలుసా..

ఈ ఘోర ప్రమాదం కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద (Chinnatekur, Kallur Mandal) చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న బస్సును (Speeding Bus) ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్ బస్సు ముందు భాగంలో చిక్కుకుపోయి, ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.

ఏపీలో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ కోసం LEAP పథకం – మెల్‌బోర్న్‌లో వివరించిన లోకేష్!!

ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 39 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిమిషాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించడంతో (Spread), లోపల ఉన్న ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. బయటకు వచ్చిన కొద్దిమంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు.

Bank Update: డిపాజిటర్ల భద్రతకు కేంద్రం కొత్త పథకం..! నవంబర్‌ 1 నుంచి మార్పులు..!

ఈ బస్సులో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి ప్రయాణికులు ఎక్కారు. తమ వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారిలో కొంతమంది క్షేమంగా బయటపడగా, మరికొందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది:

వాషింగ్టన్: రష్యా ఆయిల్‌పై అమెరికా ఆంక్షలతో భారత్, చైనా దిగుమతులు తగ్గించాయి అంటున్న వైట్ హౌస్!!

ఏడుగురు ఎక్కగా, వారిలో హర్ష, రామిరెడ్డి, సూర్య ప్రాణాలతో బయటపడ్డారు. ధాత్రి, చందన, మంగా, అమృత్ కుమార్ అనే ప్రయాణికుల ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఎక్కిన గుణ సాయి క్షేమంగా ఉన్నారు. బస్సు ఎక్కిన సుబ్రహ్మణ్యం సురక్షితంగా బయటపడగా, అదే ప్రాంతానికి చెందిన ప్రశాంత్ ఫోన్ కలవడం లేదు.

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మార్పు.. పరీక్షలు త్వరగా పూర్తి.. ఫలితాలు త్వరగా! ప్రైవేటు కళాశాలల్లో...

గండిమైసమ్మ చౌరస్తా వద్ద ఎక్కిన సత్యనారాయణ, చింతల్‌లో ఎక్కిన వేణు గుండాల ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుండటంతో, వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంపై వి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది.

Agniveer Jaisalmer: జైసల్మేర్‌లో అగ్నివీర్ భవిష్యత్తుపై చర్చలు.. ఆర్మీ కమాండర్ల మీటింగ్ హాట్‌టాపిక్!

ప్రమాదం జరిగిన వెంటనే, వి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం హైదరాబాద్‌లోని తమ కార్యాలయాలన్నింటినీ మూసివేసింది. ఘటన జరిగినప్పటి నుంచి యాజమాన్యం అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.

India: మోడీ మాస్టర్ ప్లాన్! విదేశీ పరిశోధకులను ఆకర్షించేందుకు కొత్త పథకం!

అంతేకాకుండా, ప్రమాదానికి గురైన ఈ బస్సుపై గతంలో తెలంగాణలో రెండుసార్లు రాష్ డ్రైవింగ్ చలాన్లు విధించినట్లు సమాచారం. ఈ విషయం బస్సు వేగంగా (Speeding) వచ్చి ప్రమాదం జరిగిందనే అనుమానాలకు బలం చేకూర్చుతోంది.

Centers goal : కేంద్రం లక్ష్యం.. విదేశాల్లోని భారత సంతతి నిపుణులను స్వదేశానికి రప్పించడం!

ప్రభుత్వ అధికారులు, పోలీసులు ప్రస్తుతం ఈ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు (Comprehensive investigation) చేస్తున్నారు. ఈ ప్రమాదం ప్రయాణికుల భద్రతపై ప్రైవేట్ ట్రావెల్స్ (Private Travels) సంస్థలు ఎంతవరకు నిర్లక్ష్యంగా (Negligently) వ్యవహరిస్తున్నాయో చెప్పకనే చెబుతోంది.

Narmada: భారత్ లో తూర్పు నుండి పశ్చిమ దిశగా ప్రవహించే ఏకైక ప్రధాన నది!
Industrial Sector: పారిశ్రామిక రంగానికి బంపర్ ఆఫర్..! రూ.1,030 కోట్ల ప్రోత్సాహకాలు విడుదలకు గ్రీన్ సిగ్నల్..!
APSRTC Recruitment: ఏపీఎస్‌ఆర్‌టీసీ భారీ నోటిఫికేషన్‌..! రాత పరీక్ష లేదు..! మెరిట్‌ ఆధారంగా ఎంపిక..!
Railway Jobs: రైల్వే శాఖ భారీ నోటిఫికేషన్‌..! 5,810 గ్రాడ్యుయేట్‌ పోస్టులకు దరఖాస్తులు..!
TET: ఏపీ TET నోటిఫికేషన్ విడుదల..! 2011కు ముందే నియమితులూ అయిన వారికి షాక్..!