LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Business

Air India: పైలట్ల డ్యూటీ టైమ్‌పై ఎయిర్ ఇండియా కీలక ప్రతిపాదన..

Air India: మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా విమానయాన సంస్థలు తమ మార్గాలను మార్చుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా... పైలట్ల విమాన విధి నిర్వహణ సమయ పరిమితి (FDTL) నిబంధనల నుంచి తాత్కాలికంగా సడలింపు ఇవ్వాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సి…

AndhraPravasi News Desk 1 min read
Air India: పైలట్ల డ్యూటీ టైమ్‌పై ఎయిర్ ఇండియా కీలక ప్రతిపాదన..
  • ఎయిర్ ఇండియా ప్రతిపాదనను పరిశీలిస్తున్న డీజీసీఏ..
     
  • మధ్యప్రాచ్య ఉద్రిక్తతల వల్ల విమానాల దారి మళ్లింపు ప్రధాన కారణం..

Air India: మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ విమానయాన సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ ఉద్రిక్తతల దృష్ట్యా ఇరాన్, ఇరాక్ వంటి దేశాల గగనతలాన్ని ఉపయోగించకుండా విమానాలను దారి మళ్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా, తన పైలట్ల విమాన విధి నిర్వహణ సమయ పరిమితి (FDTL) నిబంధనల నుంచి తాత్కాలిక సడలింపు ఇవ్వాలని కోరుతూ విమానయాన నియంత్రణ సంస్థ డిజిసిఎ (DGCA) ను ఆశ్రయించింది. కొన్ని సుదూర మార్గాల విమానాలను ముగ్గురు పైలట్లకు బదులుగా ఇద్దరితోనే నడపడానికి అనుమతించాలని, అలాగే ప్రస్తుతం ఉన్న 10 గంటల గరిష్ఠ ప్రయాణ సమయాన్ని మరో గంటకు పైగా పెంచి 11.5 గంటల వరకు పొడిగించాలని అభ్యర్థించింది. అదనంగా, గరిష్ఠ ఫ్లైట్ డ్యూటీ పీరియడ్‌ను కూడా 13 గంటల నుంచి 14 గంటల 45 నిమిషాలకు పెంచాలని ఎయిర్ ఇండియా తన ప్రతిపాదనలో పేర్కొంది.

మధ్యప్రాచ్య గగనతలంలో ఆంక్షలు ఉండటం, అలాగే పాకిస్థాన్ గగనతలం భారత విమానాలకు మూసివేసి ఉండటంతో విమానాలు అరేబియా సముద్రం మరియు మధ్య ఆసియా మీదుగా సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా ఇంధన వినియోగం కూడా భారంగా మారుతోంది. ఇప్పటికే 11 మధ్యప్రాచ్య దేశాల గగనతలాన్ని హై-రిస్క్ జోన్లుగా డీజీసీఏ ప్రకటించి, వాటిని వాడొద్దని సూచించిన సంగతి తెలిసిందే. ఇరాన్, ఇరాక్ మార్గాలను తప్పించడం వల్ల ఎయిర్ ఇండియాకు చెందిన పలు సుదూర విమానాల 'బ్లాక్ టైమ్' పెరిగిపోవడంతో, నిర్వహణ పరమైన ఇబ్బందుల వల్ల గత వారం కొన్ని విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఇచ్చిన ఈ ప్రతిపాదనను డీజీసీఏ పరిశీలిస్తోంది. అయితే, ఇలాంటి సడలింపుల కోరుతూ ఇండిగో వంటి ఇతర సంస్థల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అభ్యర్థనలు రాలేదని అధికారులు వెల్లడించారు.

Be the first to react

More Coverage

Gold Rate Today: ట్రంప్ వ్యాఖ్యలతో బులియన్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు.. భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు!

Gold Rate Today: ట్రంప్ వ్యాఖ్యలతో బులియన్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు.. భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు!

Gold Rate Today: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు సద్దుమణిగే సంకేతాలు వెలువడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బం…

Stock Market: అమెరికా-ఇరాన్ శాంతి సంకేతాలు... దలాల్ స్ట్రీట్‌లో బుల్ రన్.. దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు! ప్రపంచ మార్కెట్లలో కొత్త ఉత్సాహం..

Stock Market: అమెరికా-ఇరాన్ శాంతి సంకేతాలు... దలాల్ స్ట్రీట్‌లో బుల్ రన్.. దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు! ప్రపంచ మార్కెట్లలో కొత్త ఉత్సాహం..

Stock Market: అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరవచ్చనే సానుకూల సంకేతాలతో శుక్రవారం భారత స్టాక్ మ…