Palnadu: నరసరావుపేటలో రాజకీయ వేడి.. అభివృద్ధిపై ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్లు! PMAY: సొంతింటి కల నిజం.. ఏపీలో ఇంటి నిర్మాణానికి రూ. 2.39 లక్షల ఆర్థిక సాయం! దరఖాస్తు వివరాలు... TDP: రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ.. నేడు పేర్ల ప్రకటనకు సిద్ధం! Pawankalyan: డెడ్లీ మిషన్.. చీకటి పడితే మృత్యువే.. డిప్యూటీ సీఎం సీరియస్ యాక్షన్! 500 మందితో భారీ వేట! Liquor Scam: ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం.. మద్యం కుంభకోణంలో త్వరలోనే వైఎస్ జగన్‌కు ఈడీ నోటీసులు!! Bhogapuram Airport: ప్రయాణికులకు గుడ్ న్యూస్... పుష్పక్ తరహాలోనే ఆ ఎయిర్‌పోర్టుకు 20 స్పెషల్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు! AP PCCM Post: వైజాగ్ రైల్వే జోన్‌లో కీలక నియామకం.. దక్షిణ కోస్తా జోన్‌కు కొత్త పీసీసీఎం.. ఆ ప్రముఖ ఆఫీసర్ ఎవరు అంటే... Rajya Sabha Seat: కూటమిలో సీట్ల టెన్షన్ ఖతం.. ఎవరికీ దక్కని ఆ నాలుగు స్థానాలు ఎవరికంటే..? కమలానికి నో ఛాన్స్! Land Registration: రేపటి నుంచే పెరగనున్న భూముల ధరలు.. రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పోటెత్తిన జనం.! TDP: డీఎస్సీ నియామకాలపై వైసీపీ ఆరోపణలు నిరాధారం.. మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు! Palnadu: నరసరావుపేటలో రాజకీయ వేడి.. అభివృద్ధిపై ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్లు! PMAY: సొంతింటి కల నిజం.. ఏపీలో ఇంటి నిర్మాణానికి రూ. 2.39 లక్షల ఆర్థిక సాయం! దరఖాస్తు వివరాలు... TDP: రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ.. నేడు పేర్ల ప్రకటనకు సిద్ధం! Pawankalyan: డెడ్లీ మిషన్.. చీకటి పడితే మృత్యువే.. డిప్యూటీ సీఎం సీరియస్ యాక్షన్! 500 మందితో భారీ వేట! Liquor Scam: ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం.. మద్యం కుంభకోణంలో త్వరలోనే వైఎస్ జగన్‌కు ఈడీ నోటీసులు!! Bhogapuram Airport: ప్రయాణికులకు గుడ్ న్యూస్... పుష్పక్ తరహాలోనే ఆ ఎయిర్‌పోర్టుకు 20 స్పెషల్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు! AP PCCM Post: వైజాగ్ రైల్వే జోన్‌లో కీలక నియామకం.. దక్షిణ కోస్తా జోన్‌కు కొత్త పీసీసీఎం.. ఆ ప్రముఖ ఆఫీసర్ ఎవరు అంటే... Rajya Sabha Seat: కూటమిలో సీట్ల టెన్షన్ ఖతం.. ఎవరికీ దక్కని ఆ నాలుగు స్థానాలు ఎవరికంటే..? కమలానికి నో ఛాన్స్! Land Registration: రేపటి నుంచే పెరగనున్న భూముల ధరలు.. రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పోటెత్తిన జనం.! TDP: డీఎస్సీ నియామకాలపై వైసీపీ ఆరోపణలు నిరాధారం.. మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు!

TDP: రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ.. నేడు పేర్ల ప్రకటనకు సిద్ధం!

TDP: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల భర్తీ నేపథ్యంలో అధికార కూటమిలో అభ్యర్థుల ఎంపికపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Published : 2026-06-05 10:24:00

టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి..

రాజ్యసభ బరిలో ఎవరు?.. తుది నిర్ణయానికి చేరుకున్న చంద్రబాబు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల భర్తీ నేపథ్యంలో అధికార కూటమిలో అభ్యర్థుల ఎంపికపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే విస్తృత స్థాయిలో చర్చలు జరిపి నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో నేడు అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు ఈ నెల 8వ తేదీ వరకు గడువు ఉండటంతో ప్రక్రియ వేగం పుంజుకుంది. కూటమి తరఫున ఎంపికైన అభ్యర్థులు శనివారం నామినేషన్లు దాఖలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పార్టీల సమావేశంలో రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జనసేన అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

టీడీపీ కోటాలో ఎవరికి అవకాశం దక్కనుందనే అంశంపై కూడా పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. సామాజిక సమీకరణాలు, పార్టీకి చేసిన సేవలు, రాజకీయ అనుభవం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత రాజ్యసభ ఎన్నికల రాజకీయ సమీకరణాలు మరింత స్పష్టతకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకున్న ఈ ఎంపిక ప్రక్రియపై టీడీపీ, జనసేన శ్రేణులతో పాటు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Spotlight

Read More →