AP PCCM Post: వైజాగ్ రైల్వే జోన్‌లో కీలక నియామకం.. దక్షిణ కోస్తా జోన్‌కు కొత్త పీసీసీఎం.. సత్యనారాయణ బదిలీ! Rajya Sabha Seat: కూటమిలో సీట్ల టెన్షన్ ఖతం.. ఎవరికీ దక్కని ఆ నాలుగు స్థానాలు ఎవరికంటే..? కమలానికి నో ఛాన్స్! Land Registration: రేపటి నుంచే పెరగనున్న భూముల ధరలు.. రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పోటెత్తిన జనం.! TDP: డీఎస్సీ నియామకాలపై వైసీపీ ఆరోపణలు నిరాధారం.. మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు! TDP: వైసీపీ పాలనపై విమర్శలు.. కూటమి ప్రభుత్వ పనితీరును వివరించిన ఎంఏ షరీఫ్! Pravasi Prajavani: ప్రవాస భారతీయులకు అండగా 'ప్రవాసీ ప్రజావాణి'... సప్త సముద్రాల అవతల ఉన్న సమస్యలకు పరిష్కారం! Chandrababu: "జై ఆంధ్రప్రదేశ్" నినాదంతో చంద్రబాబు వైరల్ పోస్ట్.. సోషల్ మీడియాలో కూటమి శ్రేణుల సంబరాలు! Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్మరణీయమైన జూన్ 4 తీర్పుకు రెండేళ్లు! PM Modi: క్యాబినెట్ సంచలన నిర్ణయం.. ఇరాన్ యుద్ధం సెగ.. భారత ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు కేంద్రం కీలక ఆర్డినెన్స్! Narayana: అమరావతిపై జగన్ వ్యాఖ్యలు నవ్వొచ్చేలా ఉన్నాయి.. మాజీ సీఎంపై మంత్రి నారాయణ తీవ్ర విమర్శలు! AP PCCM Post: వైజాగ్ రైల్వే జోన్‌లో కీలక నియామకం.. దక్షిణ కోస్తా జోన్‌కు కొత్త పీసీసీఎం.. సత్యనారాయణ బదిలీ! Rajya Sabha Seat: కూటమిలో సీట్ల టెన్షన్ ఖతం.. ఎవరికీ దక్కని ఆ నాలుగు స్థానాలు ఎవరికంటే..? కమలానికి నో ఛాన్స్! Land Registration: రేపటి నుంచే పెరగనున్న భూముల ధరలు.. రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పోటెత్తిన జనం.! TDP: డీఎస్సీ నియామకాలపై వైసీపీ ఆరోపణలు నిరాధారం.. మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు! TDP: వైసీపీ పాలనపై విమర్శలు.. కూటమి ప్రభుత్వ పనితీరును వివరించిన ఎంఏ షరీఫ్! Pravasi Prajavani: ప్రవాస భారతీయులకు అండగా 'ప్రవాసీ ప్రజావాణి'... సప్త సముద్రాల అవతల ఉన్న సమస్యలకు పరిష్కారం! Chandrababu: "జై ఆంధ్రప్రదేశ్" నినాదంతో చంద్రబాబు వైరల్ పోస్ట్.. సోషల్ మీడియాలో కూటమి శ్రేణుల సంబరాలు! Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్మరణీయమైన జూన్ 4 తీర్పుకు రెండేళ్లు! PM Modi: క్యాబినెట్ సంచలన నిర్ణయం.. ఇరాన్ యుద్ధం సెగ.. భారత ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు కేంద్రం కీలక ఆర్డినెన్స్! Narayana: అమరావతిపై జగన్ వ్యాఖ్యలు నవ్వొచ్చేలా ఉన్నాయి.. మాజీ సీఎంపై మంత్రి నారాయణ తీవ్ర విమర్శలు!

Atchennaidu: 2024లో వైసీపీ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారు.. మంత్రి అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు!

Atchennaidu: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో వైసీపీ ప్రభుత్వ పాలనకు ముగింపు పలికారని, రాష్ట్రాన్ని రాక్షస పాలన నుంచి విముక్తి చేసిన చారిత్రక తీర్పు అదే అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

Published : 2026-06-04 10:56:00

స్వర్ణాంధ్ర దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు: అచ్చెన్నాయుడు..

ప్రజల తీర్పుతో వైసీపీ అహంకారానికి ముగింపు.. స్వర్ణాంధ్ర దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు: మంత్రి అచ్చెన్నాయుడు..

అమరావతి: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో వైసీపీ ప్రభుత్వ పాలనకు ముగింపు పలికారని, రాష్ట్రాన్ని రాక్షస పాలన నుంచి విముక్తి చేసిన చారిత్రక తీర్పు అదే అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజల తీర్పును గౌరవించకుండా వైసీపీ చేపడుతున్న నిరసనలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన విమర్శించారు.

మీడియాతో మాట్లాడుతూ అచ్చెన్నాయుడు, గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీ రాజకీయాలకు చరమగీతం పాడారని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని పక్కనపెట్టి అధికార అహంకారంతో వ్యవహరించిన నాయకత్వానికి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని అన్నారు.

జగన్ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలకు తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించిన మంత్రి, ఆ కాలంలో ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల మధ్యకు రాని నాయకులు ఇప్పుడు ప్రజల గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. పరదాల చాటున పాలన చేసిన రోజులను ప్రజలు ఇప్పటికీ మరచిపోలేదని వ్యాఖ్యానించారు.

రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకురావాల్సిన సమయంలో అనేక పరిశ్రమలను తరిమివేసి, అభివృద్ధిని దెబ్బతీశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆర్థిక క్రమశిక్షణను విస్మరించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని అన్నారు. దాని ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడిందని పేర్కొన్నారు.

అయితే ప్రజలు 2024 ఎన్నికల్లో ఇచ్చిన స్పష్టమైన తీర్పుతో వైసీపీ అహంకారానికి ముగింపు పలికారని ఆయన అన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్ర పునర్నిర్మాణం లక్ష్యంగా ముందుకు సాగుతోందని చెప్పారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ "స్వర్ణాంధ్ర-2047" లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా పారదర్శక పాలన, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

Spotlight

Read More →