Praja Vedika: రేపు (25/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Economic Times Award: ముంబయి వేదికగా చంద్రబాబుకు అరుదైన గౌరవం: 'ఎకనమిక్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మక అవార్డు! New Railway Line: ఏపీలో కొత్తగా మరో ఆరు రైల్వే లైన్‌లు... ఈ రూట్లోనే!! బెంగళూరు ప్రయాణం ఇక ఈజీ... Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు! Praja Vedika: రేపు (25/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Economic Times Award: ముంబయి వేదికగా చంద్రబాబుకు అరుదైన గౌరవం: 'ఎకనమిక్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మక అవార్డు! New Railway Line: ఏపీలో కొత్తగా మరో ఆరు రైల్వే లైన్‌లు... ఈ రూట్లోనే!! బెంగళూరు ప్రయాణం ఇక ఈజీ... Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు!

TDP: కార్యకర్తల శిక్షణా తరగతులకు హాజరైన సీఎం చంద్రబాబు! ప్రభుత్వ పథకాలపై చర్చలు!

TDP: టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు.

Published : 2026-04-24 17:15:00

దస్తగిరి హత్య, ఎమ్మెల్సీ అనంతబాబు బరితెగింపు.. వంటి అంశాలను ప్రస్తావించిన సీఎం చంద్రబాబు..

సమకాలీన రాజకీయాలపై అవగాహన కల్పించుకోవాలి..

అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, “ప్రతి కార్యకర్తను నాయకుడిగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం” అని స్పష్టం చేశారు. టీడీపీలో కార్యకర్తలే నిజమైన అధినేతలని, వారు గౌరవంగా “రైట్ రాయల్‌గా” జీవించాలని అన్నారు. పార్టీ కూడా కార్యకర్తలను అదే స్థాయిలో గౌరవిస్తుందని చెప్పారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడిన సీఎం, సమకాలీన రాజకీయాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాజకీయాల్లో క్రిమినల్స్‌తో పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. “కిల్లర్ పార్టీతో అందరూ జాగ్రత్తగా ఉండాలి” అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ ఆలోచనా విధానాన్ని అధ్యయనం చేసి, సమర్థంగా కౌంటర్ ఇవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ప్రజలను రెచ్చగొట్టడం, రోడ్లపైకి వచ్చి అల్లర్లు సృష్టించడం, తర్వాత చర్యలు తీసుకుంటే రాజకీయంగా మలచడం వంటి అంశాలను సీఎం ప్రస్తావించారు. “రప్పా రప్పా” అంటూ హింసకు ప్రోత్సహిస్తారని, అమాయక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారని విమర్శించారు. అన్యాయం జరిగిందని చెప్పుకుంటూ పరామర్శలకు వెళ్తారని, కానీ వాస్తవానికి కార్యకర్తలనే కార్ల కింద తొక్కించి చంపించే పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు.

కడపలో జరిగిన పార్టీ కార్యకర్త హత్యను ఉదాహరణగా ప్రస్తావించిన సీఎం, అక్కడి డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, అలాగే రవీంద్రనాథ్ రెడ్డి కలిసి ప్రభుత్వ భూములను దోపిడీ చేశారని ఆరోపించారు. ఆస్తుల పంపకాలలో తలెత్తిన విభేదాల కారణంగానే దస్తగిరి హత్య జరిగిందని తెలిపారు.

అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ప్రవర్తనను ప్రస్తావిస్తూ, సాక్షులను బెదిరించారని ఆరోపించారు. ఈ ఘటనలు ప్రజల్లోకి తీసుకెళ్లి నిజాలను తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు. “గొడ్డలి పార్టీ అరాచకాలను నిరంతరం ప్రజలకు వివరించాలి” అంటూ సీఎం చంద్రబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండి, ప్రజలతో దగ్గరగా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

Spotlight

Read More →