Vande Bharat: వేగం.. విలాసం.. విపరీతమైన క్రేజ్.. దక్షిణాదిలోనే అత్యంత రద్దీగా మారిన రూట్ ఇదే! Nara Lokesh: లోకేశ్ రాకతో ఉత్సాహంలో కార్యకర్తలు.. బెంగళూరులో పార్టీ శ్రేణుల కోలాహలం.. ఫొటోలు వైరల్.! AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. ycp leader: అకౌంట్లో రూ.7 లక్షల కోట్లు!": వైసీపీ నేత మోసం.. బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ అసలు రంగు.. Nitish Kumar: జాతీయ రాజకీయాల్లో నితీశ్ మార్క్.. పార్లమెంటులో చర్చల స్థాయిని పెంచనున్న సీనియర్ నేత.! Lok Sabha: పెరగనున్న లోక్‌సభ సీట్లు.. 543 నుండి 816కు ఎంపీ స్థానాల పెంపు.. కేంద్రం మాస్టర్ ప్లాన్! Jagan: వైఎస్‌ డెత్‌ మిస్టరీ.. మొత్తం జగన్‌ ఖాతాలో.. దేవుడి స్క్రిప్టే ఇదేనా.! 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై.. Vande Bharat: వేగం.. విలాసం.. విపరీతమైన క్రేజ్.. దక్షిణాదిలోనే అత్యంత రద్దీగా మారిన రూట్ ఇదే! Nara Lokesh: లోకేశ్ రాకతో ఉత్సాహంలో కార్యకర్తలు.. బెంగళూరులో పార్టీ శ్రేణుల కోలాహలం.. ఫొటోలు వైరల్.! AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. ycp leader: అకౌంట్లో రూ.7 లక్షల కోట్లు!": వైసీపీ నేత మోసం.. బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ అసలు రంగు.. Nitish Kumar: జాతీయ రాజకీయాల్లో నితీశ్ మార్క్.. పార్లమెంటులో చర్చల స్థాయిని పెంచనున్న సీనియర్ నేత.! Lok Sabha: పెరగనున్న లోక్‌సభ సీట్లు.. 543 నుండి 816కు ఎంపీ స్థానాల పెంపు.. కేంద్రం మాస్టర్ ప్లాన్! Jagan: వైఎస్‌ డెత్‌ మిస్టరీ.. మొత్తం జగన్‌ ఖాతాలో.. దేవుడి స్క్రిప్టే ఇదేనా.! 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై..

Public Litigation Policy: న్యాయశాఖ బలోపేతానికి కూటమి ప్రభుత్వ చర్యలు! పబ్లిక్ లిటిగేషన్ పాలసీ-2025పై మంత్రివర్గ ఉపసంఘం భేటీ!

Public Litigation Policy: రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో “ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ లిటిగేషన్ పాలసీ-2025”పై మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సమావేశమైంది.

Published : 2026-04-10 21:52:00

న్యాయ శాఖ పటిష్టత కోసం చర్యలు..

పబ్లిక్ లిటిగేషన్ పాలసీ- 2025పై మంత్రి వర్గ ఉపసంఘం భేటి..

అమరావతి: రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో “ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ లిటిగేషన్ పాలసీ-2025”పై మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సమావేశమైంది.

ఈ సమావేశంలో రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొన్నారు. న్యాయశాఖ ఉన్నతాధికారులతో కలిసి పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.

రాష్ట్రంలో అనవసరమైన వ్యాజ్యాలను తగ్గించడం, కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడం ప్రధాన లక్ష్యమని మంత్రి ఫరూక్ తెలిపారు. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

కేసులు కోర్టులకు వెళ్లే ముందే పరిష్కరించే విధానాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ముందస్తు కేసు నిర్వహణ ద్వారా అప్పీల్స్‌ను సమర్థవంతంగా దాఖలు చేయడం, విధానపరమైన జాప్యాలను తొలగించడం వంటి అంశాలపై మంత్రుల ఉపసంఘం సూచనలు చేయనుంది.

ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాలు (ADR) ను ప్రోత్సహించడం, లోక్ అదాలత్‌లను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా వ్యవస్థను తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రులు పేర్కొన్నారు.

ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న లిటిగేషన్ పాలసీలను పరిశీలించి, అక్కడి మంచి పద్ధతులను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాలని మంత్రులు సూచించారు. సంస్కరణలను కూలంకషంగా అధ్యయనం చేసి రాష్ట్రానికి అనుకూలంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభా దేవి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

న్యాయ వ్యవస్థను వేగవంతం చేసి ప్రజలకు సమయానికి న్యాయం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు, భవిష్యత్తులో కేసుల భారం తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.

Spotlight

Read More →