TDP Mahanadu 2026: మహానాడుకు ముస్తాబవుతున్న ఉత్తరాంధ్ర.. వేదిక ఎంపికపై టీడీపీ హైకమాండ్ ఫోకస్! Google Data Centre: ఏపీ టెక్ చరిత్రలో నవశకం.. ఏప్రిల్ 28న గూగుల్ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! AP Property Tax Rebate 2026: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆస్తి పన్నుపై భారీ రాయితీ.. ఈ నెలాఖరు వరకు మాత్రమే ఛాన్స్! AP Retired Govt Employees: ఏపీ రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అకౌంట్‌లలోకి నగదు జమ, వెంటనే చెక్ చేసుకోండి! Amaravati Capital:అమరావతిపై నీచ రాజకీయం.. చంద్రబాబు వీడియో వక్రీకరణ! వైకాపా ఫేక్ భాగోతం బట్టబయలు.! AP Govt: ఆ జిల్లా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. రూ. 14 వేల కోట్లతో రైల్వే, జాతీయ రహదారుల ప్రతిపాదనలు.! AP Govt: ₹185 కోట్లతో 130 కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు.. 55,766 కేంద్రాల్లో.. అంగన్‌వాడీల రూపురేఖలు సమూల మార్పు! Nara Lokesh: పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం! దీనిపై రాష్ట్రవ్యాప్తంగా.. Nimmala Ramanaidu: వైసీపీది విధ్వంస పాలన.. కూటమిది అభివృద్ధి బాట.. పెనుమదం సభలో మంత్రి! రూ. 4.49 కోట్లతో.. Vijay Tirunelveli Speech: వ్యక్తిగత జీవితంపై దాడిని సహించను.. విడాకుల వివాదంపై నోరు విప్పిన దళపతి విజయ్! TDP Mahanadu 2026: మహానాడుకు ముస్తాబవుతున్న ఉత్తరాంధ్ర.. వేదిక ఎంపికపై టీడీపీ హైకమాండ్ ఫోకస్! Google Data Centre: ఏపీ టెక్ చరిత్రలో నవశకం.. ఏప్రిల్ 28న గూగుల్ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! AP Property Tax Rebate 2026: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆస్తి పన్నుపై భారీ రాయితీ.. ఈ నెలాఖరు వరకు మాత్రమే ఛాన్స్! AP Retired Govt Employees: ఏపీ రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అకౌంట్‌లలోకి నగదు జమ, వెంటనే చెక్ చేసుకోండి! Amaravati Capital:అమరావతిపై నీచ రాజకీయం.. చంద్రబాబు వీడియో వక్రీకరణ! వైకాపా ఫేక్ భాగోతం బట్టబయలు.! AP Govt: ఆ జిల్లా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. రూ. 14 వేల కోట్లతో రైల్వే, జాతీయ రహదారుల ప్రతిపాదనలు.! AP Govt: ₹185 కోట్లతో 130 కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు.. 55,766 కేంద్రాల్లో.. అంగన్‌వాడీల రూపురేఖలు సమూల మార్పు! Nara Lokesh: పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం! దీనిపై రాష్ట్రవ్యాప్తంగా.. Nimmala Ramanaidu: వైసీపీది విధ్వంస పాలన.. కూటమిది అభివృద్ధి బాట.. పెనుమదం సభలో మంత్రి! రూ. 4.49 కోట్లతో.. Vijay Tirunelveli Speech: వ్యక్తిగత జీవితంపై దాడిని సహించను.. విడాకుల వివాదంపై నోరు విప్పిన దళపతి విజయ్!

Google Data Centre: ఏపీ టెక్ చరిత్రలో నవశకం.. ఏప్రిల్ 28న గూగుల్ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన!

Google Data Centre: ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే భారీ పెట్టుబడి! విశాఖపట్నంలో రూ. 1.35 లక్షల కోట్లతో గూగుల్ నిర్మించనున్న ఆసియాలోనే అతిపెద్ద AI డేటా సెంటర్ పనులకు ఏప్రిల్ 28న సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు.

Published : 2026-04-10 10:01:00

Google Data Centre: విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రాన్ని మార్చేసే మరో భారీ ప్రాజెక్టు అడుగులు పడుతున్నాయి. ప్రపంచ టెక్ దిగ్గజం 'గూగుల్' సుమారు 1.35 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించనున్న భారీ డేటా సెంటర్ పనులకు ఈ నెల 28న ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు స్వయంగా శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా, దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా ఈ ప్రాజెక్టు నిలవబోతోంది.

ఈ మెగా ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఇప్పటికే మూడు ప్రాంతాల్లో సుమారు 601 ఎకరాల భూమిని కేటాయించింది. విశాఖ పరిసరాల్లోని అడవివరం, తర్లువాడ,  రాంబిల్లి ప్రాంతాల్లో గూగుల్ తన క్యాంపస్‌లను ఏర్పాటు చేయనుంది. ఇందులో తర్లువాడలో అత్యధికంగా 266 ఎకరాల్లో ప్రధాన పనులు జరగనున్నాయి. కేవలం భూమి కేటాయింపులే కాకుండా, ఫిబ్రవరి నాటికే అన్ని రకాల అనుమతులు పూర్తి చేసి గూగుల్ చేతికి అప్పగించడంతో పనులు వేగంగా మొదలవుతున్నాయి.

ఈ డేటా సెంటర్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఆసియాలోనే అతిపెద్ద 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) హబ్‌గా అవతరించబోతోంది. దాదాపు 1 గిగావాట్ విద్యుత్ సామర్థ్యంతో నడిచే ఈ సెంటర్, క్లౌడ్ సర్వీసులు  అత్యాధునిక కంప్యూటింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. దీనివల్ల గూగుల్ సేవలు మరింత వేగవంతం కావడమే కాకుండా, డేటా స్టోరేజీ విషయంలో విశాఖ నగరం ప్రపంచ పటంలో ఒక వెలుగు వెలగనుంది.

సాంకేతికంగానే కాకుండా, మౌలిక సదుపాయాల పరంగా కూడా ఈ ప్రాజెక్టు విశాఖకు కొత్త హంగులు అద్దనుంది. సముద్ర గర్భం గుండా వచ్చే హై-స్పీడ్ కేబుల్ కనెక్టివిటీ మరియు ఫైబర్ నెట్‌వర్క్‌ల ద్వారా వైజాగ్ నగరం అంతర్జాతీయ డిజిటల్ నెట్‌వర్క్‌తో నేరుగా అనుసంధానం అవుతుంది. 2025 అక్టోబర్‌లో కుదిరిన ఈ ఒప్పందం, కేవలం ఆరు నెలల కాలంలోనే ఆచరణలోకి రావడం గమనార్హం.

ఈ భారీ పెట్టుబడి ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా, అనుబంధ సాఫ్ట్‌వేర్ సంస్థలు కూడా విశాఖ వైపు చూసే అవకాశం ఉంది. 2028 జూలై నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవైపు ఐటీ రంగం, మరోవైపు ఏఐ టెక్నాలజీతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

Spotlight

Read More →