- Technology: సిబ్బంది ఎస్కేప్ సిస్టమ్లో పట్టు సాధించిన భారత్: గగన్యాన్ విజయానికి చేరువలో..
- భారత అంతరిక్ష యాత్రలో కీలక మైలురాయి: గగన్యాన్ మిషన్ కోసం సిద్ధమైన ఇస్రో!
India Space: గగన్యాన్ మిషన్ ద్వారా.. మానవసహిత అంతరిక్ష యాత్రకు భారతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. వ్యోమగాములను నింగిలోకి పంపాలనుకుంటున్న ఇస్రో.. ఇవాళ మరో కీలక అడుగు వేసింది. గగన్యాన్ మిషన్కు చెందిన రెండో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ను విజయవంతంగా నిర్వహించింది. ఐఏడీటీ-02 పరీక్షను సక్సెస్ఫుల్గా నిర్వహించిన ఇస్రోకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయమంత్రి జితేంద్ర సింగ్ కంగ్రాట్స్ తెలిపారు.
ఈ మైలురాయి ద్వారా గగన్యాన్ మిషన్ కోసం ఇస్రో సంసిద్దమైందన్న సంకేతాన్ని ఇచ్చిందని మంత్రి పేర్కొన్నారు. శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఇవాళ ఈ పరీక్ష చేపట్టారు. వచ్చే సంవత్సరం వ్యోమగాములను ఇస్రో నింగిలోకి పంపాలనుకుంటున్న విషయం తెలిసిందే. గగన్యాన్ మిషన్లో ఎయిర్ డ్రాప్ పరీక్ష అత్యంత కీలకమైంది. సిబ్బంది ఎస్కేప్, రికవరీ సిస్టమ్ గురించి ఈ పరీక్ష చేపట్టారు. ఎమర్జెన్సీ సమయంలో ఆస్ట్రోనాట్ రక్షణే ధ్యేయంగా ఎయిర్ డ్రాప్ టెస్ట్ను నిర్వహించారు.