Lok Sabha: పెరగనున్న లోక్‌సభ సీట్లు.. 543 నుండి 816కు ఎంపీ స్థానాల పెంపు.. కేంద్రం మాస్టర్ ప్లాన్! India Space: అంతరిక్షంలోకి భారతీయ బాహుబలి.. గగన్‌యాన్ మిషన్ సిద్ధం.. ఇక నింగిలోకి ఎగరడమే..! AP New Highways: అమరావతి-మచిలీపట్నం మధ్య కొత్త హైవే... త్వరలో రెండు రాష్ట్రాల మధ్య తగ్గనున్న దూరం! Jagan: వైఎస్‌ డెత్‌ మిస్టరీ.. మొత్తం జగన్‌ ఖాతాలో.. దేవుడి స్క్రిప్టే ఇదేనా.! 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై.. Samantha: ఆయన వల్లే నేను ఇంత ధైర్యంగా ఉన్నాను.. సమంత ఎమోషనల్ కామెంట్స్! ఒక్క రోజు కూడా.. Summer Mangoes: మామిడి ప్రియులారా, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.. కల్తీ మామిడిని గుర్తించడం ఇక చాలా ఈజీ! Prawns Fry Recipe: హోటల్ స్టైల్‌లో క్రిస్పీ రొయ్యల ఫ్రై.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి! Shruti Haasan: వరుస సినిమాలతో బిజీ.. అయినా కిచెన్‌లో ఖాళీ లేదు.. శ్రుతి హాసన్ స్పెషల్ వంటకాలు.! TDP Mahanadu 2026: మహానాడుకు ముస్తాబవుతున్న ఉత్తరాంధ్ర.. వేదిక ఎంపికపై టీడీపీ హైకమాండ్ ఫోకస్! Middle East Peace: అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక చర్చలు.. నేడు ఇస్లామాబాద్ వేదికగా శాంతి దిశగా అడుగులు..! Lok Sabha: పెరగనున్న లోక్‌సభ సీట్లు.. 543 నుండి 816కు ఎంపీ స్థానాల పెంపు.. కేంద్రం మాస్టర్ ప్లాన్! India Space: అంతరిక్షంలోకి భారతీయ బాహుబలి.. గగన్‌యాన్ మిషన్ సిద్ధం.. ఇక నింగిలోకి ఎగరడమే..! AP New Highways: అమరావతి-మచిలీపట్నం మధ్య కొత్త హైవే... త్వరలో రెండు రాష్ట్రాల మధ్య తగ్గనున్న దూరం! Jagan: వైఎస్‌ డెత్‌ మిస్టరీ.. మొత్తం జగన్‌ ఖాతాలో.. దేవుడి స్క్రిప్టే ఇదేనా.! 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై.. Samantha: ఆయన వల్లే నేను ఇంత ధైర్యంగా ఉన్నాను.. సమంత ఎమోషనల్ కామెంట్స్! ఒక్క రోజు కూడా.. Summer Mangoes: మామిడి ప్రియులారా, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.. కల్తీ మామిడిని గుర్తించడం ఇక చాలా ఈజీ! Prawns Fry Recipe: హోటల్ స్టైల్‌లో క్రిస్పీ రొయ్యల ఫ్రై.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి! Shruti Haasan: వరుస సినిమాలతో బిజీ.. అయినా కిచెన్‌లో ఖాళీ లేదు.. శ్రుతి హాసన్ స్పెషల్ వంటకాలు.! TDP Mahanadu 2026: మహానాడుకు ముస్తాబవుతున్న ఉత్తరాంధ్ర.. వేదిక ఎంపికపై టీడీపీ హైకమాండ్ ఫోకస్! Middle East Peace: అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక చర్చలు.. నేడు ఇస్లామాబాద్ వేదికగా శాంతి దిశగా అడుగులు..!

TGSRTC: టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ 52.8 శాతానికి పెంపు!

TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ ఏడాది నుంచి టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను 2.1 శాతం పెంచుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

Published : 2026-04-10 11:22:00

డీఏ బకాయిలను చెల్లించనున్న ప్రభుత్వం.. 

ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆనందాల వెల్లువ.. 

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ ఏడాది నుంచి టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను 2.1 శాతం పెంచుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

ఇప్పటివరకు 50.7 శాతంగా ఉన్న డీఏ, తాజా పెంపుతో 52.8 శాతానికి చేరుకుంది. దీంతో ఉద్యోగుల జీతాల్లో కొంత పెరుగుదల కనిపించనుంది.

గత మూడు నెలలకు సంబంధించిన డీఏ బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించనుంది. ప్రతి నెలకు సంబంధించిన మొత్తం సప్లిమెంటరీ బిల్లుల ద్వారా విడతల వారీగా అందించనున్నట్లు వెల్లడించింది.

ఇక చివరిసారిగా 2025 జూలైలో కూడా 2.1 శాతం డీఏ పెంపు జరిగింది. అప్పట్లో డీఏ 48.6 శాతం నుంచి 50.7 శాతానికి పెరిగింది. ప్రస్తుతం మరోసారి అదే స్థాయిలో పెంపు ఇవ్వడంతో మొత్తం డీఏ 52.8 శాతానికి చేరింది.

ఈ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో డీఏ పెంపు తమకు కొంత ఉపశమనం ఇస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల ఆర్థిక స్థితికి మద్దతుగా నిలవనుంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Spotlight

Read More →